అన్వేషించండి

Jyothi Rai: గొప్ప మనసు చాటుకున్న జ్యోతిరాయ్‌ (జగతి మేడం) - పద్మ శ్రీ మొగిలయ్యకు ఆర్థిక సాయం

jyothi rai help to mogilaiah: 'గుప్పెడంత మనసు' ఫేం జ్యోతిరాయ్‌ అలియాస్‌ జగతి మేడం గొప్ప మనసు చాటుకున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా బంగారానికి బదులుగా పద్మశ్రీ కిన్నెర మొగిలియ్యకు ఆర్థికసాయం అందించారు.

Jyothi rai helped to Padma Shri Kinnera Mogulaiah: 'గుప్పెడంత మనసు' ఫేం జ్యోతిరాయ్‌ అలియాస్‌ జగతి మేడం గొప్ప మనసు చాటుకున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా బంగారానికి బదులుగా దీన స్థితిలో ఉన్న పద్మశ్రీ అవార్డు గ్రహిత మొగిలియ్యకు ఆర్థిక సాయం చేసి చేయూతను అందించారు. కాగా పద్మ శ్రీ అవార్డు గ్రహిత, కిన్నెర క‌ళాకారుడు ద‌ర్శ‌నం మొగిల‌య్య ప్రస్తుతం పూట గడవని దీనస్థితిలో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కిన్నెర కళారుడు మొగిలయ్య ప్రతిభను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

ఆయనను అక్కున చేర్చుకుని చేయూతనిచ్చింది. సినీ ఇండస్ట్రీ సైతం ఆయన ప్రతిభను మెచ్చుకుంటూ సినిమాల్లో ఆఫర్స్‌‌ ఇచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ భీమ్లా నాయక్‌ సినిమాలో మొగిలయ్యకు ఆఫర్‌ వచ్చింది. వెండితెరపై తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో ఆకట్టుకున్న మొగిలయ్య ప్రతిభను ఏకంగా కేంద్ర ప్రభుత్వమే గుర్తించింది. అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అయిన పద్మ శ్రీతో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు పద్మశ్రీ ఆయన ఆర్థిక కష్టాలను తీర్చలేకపోయింది. ప్రభుత్వం నుంచే ఫించన్‌ ఆగిపోవడంతో మొగిలయ్యకు పూట గడవడమే కష్టమైంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj)

దీంతో హైదరాబాద్‌లో రోజూ వారి కూలీగా మారి పూట గడుపుకుంటున్న మొగిలయ్య వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో కాస్తా 'జగతి మేడం' అలియాస్‌ జ్యోతిరాయ్‌ కంట పడింది. మొగిలయ్య దీన స్థితి చూసి చలించినపోయిన జ్యోతిరాయ్‌ తన ఉదారతను చాటుకుంటుంది. మొగిలయ్యకు ఆర్థిక సాయం చేసి గొప్ప మనసు చాటుకుంటుంది. ఈ విషయాన్ని స్వయంగా జ్యోతిరాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అంతేకాదు మొగిలయ్యను స్వయంగా కలిసి డబ్బు అందించిన వీడియోను కూడా షేర్‌ చేశారు. ఈ సందర్భంగా అక్షయ తృతీయ వంటి శుభదిననా.. శ్రీ పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యను కలిసి రూ. 50,000 ఆర్థిక సహాయం అందించానని చెప్పింది.

Also Read: నటి జ్యోతి రాయ్ ప్రైవేట్ వీడియోపై కేసు నమోదు, పరువు పోయిందంటూ జగతి మేడం ఆవేదన!

ఇక జ్యోతిరాయ్‌ నిర్ణయంపై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె గొప్ప మనసును ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా జ్యోతిరాయ్‌ కొద్ది రోజులుగా వ్యక్తిగత విషయమై వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తన పర్సనల్‌ వీడియో తన దగ్గర ఉందని, కావాల్సిన వాళ్లు డబ్బులు పంపిస్తే తమకు వీడియో షేర్‌ చేస్తానంటూ ఓ గుర్తు తెలియని సోషల్‌ మీడియా ఖాతా నుంచి పోస్ట్‌ దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త కన్నడనాట సంచలనంగా మారింది. అయితే దీనిపై స్పందించిన జ్యోతిరాయ్‌ తనని కావాలని టార్గెట్‌ చేస్తున్నారని, తన పేరుతో ఫేక్ వీడియో క్రియేట్‌ చేసి తప్పుదారి పట్టిస్తున్నారని, ఇది ఎంతవరకు కరెక్ట్‌ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  

టాప్ హెడ్ లైన్స్

Eknath Harika New House : కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
Oh Sukumari Review - ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
Kiara Advani : రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ - ప్రభాస్ ఫౌజీతో క్లాష్ లేకుండా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
NBK111 రిలీజ్ డేట్ - ప్రభాస్ ఫౌజీతో క్లాష్ లేకుండా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget