అన్వేషించండి

Ayushmann Khurrana: కోల్‌కతా లేడీ డాక్టర్‌పై అమానుషం - కవితతో కంటతడి పెట్టింటిన బాలీవుడ్ నటుడు

కోల్ కతా డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా కవితతో మృతురాలి బాధను వ్యక్తం చేశారు.

Ayushmann Khurrana On Kolkata Doctor Rape And Murder: కోల్‌కతాలోని ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో లేడీ జూనియర్ డాక్టర్ పై జరిగిన దారుణ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఢిల్లీ నిర్భయ ఘటనను గుర్తు చేసేలా ఉన్న ఈ అమానుష ఘటనపై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. దారుణానికి పాల్పడిన కిరాతకులకు కఠిన శిక్ష విధించాలంటూ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పలువురు సినీ తారలు ఇప్పటికే ఈఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులు ఎవరైనా శిక్ష పడితీరాలని డిమాండ్ చేశారు.

కవితతో నివాళి అర్పించిన ఆయుష్మాన్ ఖురానా   

ఈ ఘోరంపై బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కవిత ద్వారా ఆమె పడిన వేదనను చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మేరకు తన ఇన్ స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. ‘నేను అబ్బాయిని అయితే..’ అంటూ ఆయన రాసిన కవితను వినిపించారు. ఈ కవిత అందరిని కంటతడి పెట్టిస్తోది.

‘‘నేనే అబ్బాయిని అయితే.. రూమ్ డోర్లు తెరిచే పడుకోవచ్చు..

నేనే అబ్బాయిని అయితే.. స్వేచ్ఛగా పరిగెత్తవచ్చు..

రాత్రంతా ఫ్రెండ్స్ తో కలిసి నిర్భయంగా తిరగవచ్చు.

ఆడపిల్లలను చదివించాలని.. బలంగా తీర్చిదిద్దాలని చెప్తారు..

కష్టపడి చదివి డాక్టర్‌ అయినా కంటిరెప్పలా కాపాడాడుకోవాల్సి వస్తోంది..

 --

ఈ రోజు నాపై దారుణ బలాత్కారం జరిగింది.

ఓ దుర్మార్గుడి దారుణాన్ని చూస్తూ ఉండిపోయా..

సీసీటీవీ లేకపోయి ఉంటే ఏం జరిగినా తెలిసేది కాదు..

పురుష సిబ్బంది ఉన్నా మాకు రక్షణ ఏది?

అందుకే.. నేనే అబ్బాయిని అయితే బాగుండేది.

ఒకవేళ నేనూ అబ్బాయిని అయి ఉంటే ఈ రోజు బతికి ఉండేదాన్నే” అంటూ బాధితురాలి బాధను చెప్పే ప్రయత్నం చేశారు నటుడు ఆయుష్మాన్ ఖురానా.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

ఆయుష్మాన్ షేర్ చేసిన ఈ కవిత నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.  ఇది చూసిన ప్రతి ఒక్కరు కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. మనసుని తాకేలా ఉన్న ఈ కవిత చదివి ప్రతి ఒక్కరు ఆమెకు ఆశ్రు నివాళి అర్పిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఏమాత్రం మానవత్వం లేదంటూ మండిపడుతున్నారు. ఈ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు.  ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా స్పందించారు. స్ట్రాంగ్ మెసేజ్ అంటూ ఆయన కామెంట్ పెట్టారు. 

కోల్ కతా ఘటనపై స్పందించిన ఉపాసన

డాక్టర్ పై జరిగిన దారుణాన్ని తలచుకుంటేనే గుండె పగిలిపోతుందన్నారు ఉపాసన. ఆమె లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదన్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. ఎలా స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకుంటున్నామో అర్థం కావట్లేదన్నారు. దేశంలో హెల్త్ కేర్ రంగానికి వెన్నెముకగా ఉన్న మహిళలపై ఇలాంటి అమానుషం జరగడం దారుణం అన్నారు. ఇప్పటికైనా మహిళా భద్రతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందన్నారు. ప్రతి మహిళకు గౌరవం లభించాలని ఆమె ఆకాంక్షించారు.  అటు ఈ ఘటన సంబంధించి ఇప్పటికే ఒక నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Read Also: ఇదేం ఇండిపెండెన్స్ డే, కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార ఘటనపై ఉపాసనా సెన్సేషనల్ పోస్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget