అన్వేషించండి

Pawan Kalyan: అవమానంగా భావించింది అందుకే - లడ్డూ వ్యవహారంపై మరోసారి స్పందించిన పవన్ కల్యాణ్

లడ్డూ గురించి కార్తి చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. ఆయన లడ్డూ గురించి కామెడీగా మాట్లాడారు కాబట్టే తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. నటులుగా సూర్య, కార్తి తనకు చాలా ఇష్టం అన్నారు.

Pawan Kalyan About Suriya And Karthi: గత కొద్ది రోజులుగా తిరుపతి లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం ఏపీ రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ లడ్డూ కల్తీ వ్యవహారంపై శ్రీవారిని క్షమాపణ కోరుతూ ప్రాయాశ్చిత దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో ‘సత్యం సుందరం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతి లడ్డూ గురించి తమిళ నటుడు కార్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. లడ్డూ సెన్సిటివ్ అంశంగా మారిందని, దానికి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ సీరియస్ కావడంతో కార్తి క్షమాపణలు చెప్పారు.

కామెడీ చేశారు కాబట్టే సీరియర్ అయ్యా- పవన్ కల్యాణ్

తిరుపతి లడ్డూ వ్యవహారం కార్తి కామెంట్స్ పై పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. ఓ తమిళ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు చెప్పారు. సూర్య, కార్తి అంటే తనకు ఎంతో ఇష్టమని, లడ్డూ అంశాన్ని కామెడీ చేయడం వల్లే కోపం వచ్చిందన్నారు. “కార్తి, సూర్య తిరుమల శ్రీవారి భక్తులు. కార్తీ తేలిగ్గా మాట్లాడినా.. నా ఉద్దేశ్యం ఆయనకు తెలుసు. వారు నిజంగా రోల్ మోడల్స్. లడ్డూ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలకు చాలా మంది నవ్వారు. అందుకే నాకు కోపం వచ్చింది. తమిళ సినీ పరిశ్రమను గౌరవిస్తాను. తమిళ నటులను నా సోదరులుగా భావిస్తాను” అని పవన్ కల్యాన్ చెప్పుకొచ్చారు.  

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

గత ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. పవిత్ర లడ్డూలో జంతువుల మాంసంతో తయారుచేసిన నెయ్యిని కలిపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డుకు చెందిన ల్యాబ్ కు పంపించగా నెయ్యి కల్తీ అయినట్లు తేలిందన్నారు. ఈ విషయం బయటకు రావడంతో శ్రీవారి భక్తులతో పాటు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పలు హిందూ సంఘాలు ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏకంగా  ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో  హైదరాబాద్ లో జరిగిన ‘సత్యం సుందరం’ మూవీ ప్రమోషన్స్ లో “యాంకర్ లడ్డూ కావాలా నాయనా?” అనడంతో కార్తి.. “ప్రస్తుతం లడ్డూ వ్యవహారం సెన్సిటివ్ అంశంగా మారింది. దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది” అన్నారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ సీరియస్ కావడంతో కార్తి వెంటనే క్షమాపణలు చెప్పారు. అయితే, ఇదంతా కేవలం సినిమా ప్రమోషన్ కోసం పవన్, కార్తి చేసిన ప్రయత్నం అంటూ మరికొంత మంది నెటిజన్లు విమర్శలు చేశారు.

Read Also: షాహిద్ కపూర్ 'అశ్వత్థామ'లో జర్మనీ భామ - ఎవరీ ఆర్య? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh : మ్యాజిక్ జరిగింది... ట్రైలర్ అదిరింది - ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌పై మెగాస్టార్ రివ్యూ
మ్యాజిక్ జరిగింది... ట్రైలర్ అదిరింది - ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌పై మెగాస్టార్ రివ్యూ
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Telugu Movie: పేమెంట్లు ఎగ్గొట్టిన ప్రొడ్యూసర్... అమెరికాకు పరార్ - స్పోర్ట్స్‌ బయోపిక్‌ ఇష్యూ తెల్సా?
పేమెంట్లు ఎగ్గొట్టిన ప్రొడ్యూసర్... అమెరికాకు పరార్ - స్పోర్ట్స్‌ బయోపిక్‌ ఇష్యూ తెల్సా?
10/G Railway Quarters OTT : రైల్వే క్వార్టర్స్‌లో ఏం జరిగింది? - ఓటీటీలోకి వచ్చేసిన 10/G రైల్వే క్వార్టర్స్
రైల్వే క్వార్టర్స్‌లో ఏం జరిగింది? - ఓటీటీలోకి వచ్చేసిన 10/G రైల్వే క్వార్టర్స్

వీడియోలు

ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget