అన్వేషించండి

Anasuya Bharadwaj: కోడలైనా సరే నన్ను అత్త అనకూడదు - అనసూయ

హాట్ యాంకర్ అనసూయ.. మరోసారి ‘ఆంటీ’ వివాదంపై స్పందించింది. సుమ కనకాల వంటల కార్యక్రమంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ తను ఏం అన్నదంటే..?

జబర్దస్ కామెడీ షోతో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. ఆ షోకు సంబంధించి వందల ఎపిసోడ్లకు యాంకర్ గా చేసి.. మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత యాంకరింగ్  పక్కన పెట్టి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

ప్రస్తుతం అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారింది. బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తూ యువతను గిలిగింతలు పెట్టింది.  నెమ్మదిగా పలు సినిమాల్లో లీడింగ్ రోల్స్ చేస్తోంది. ఇటీవల అనసూయ ప్రధాన పాత్రలో ‘దర్జా’ అనే సినిమా తెరకెక్కింది. అటు ‘వాంటెడ్ పండుగాడ్’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. వెండితెర ఆఫర్స్ వరుసబెట్టి వస్తున్న తరుణంలో అనవసర వివాదాల్లో తల దూర్చి అనసూయ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. 

‘లైగర్’ మూవీ ఫెయిల్యూర్ తర్వాత ఈ అమ్మడు ‘ఆంటీ’ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.  లైగర్ ఫ్లాప్ ను ఎంజాయ్ చేస్తూ  పరోక్షంగా ట్వీట్ వేసి అనసూయ వివాదానికి కారణం అయ్యింది.  విజయ్ దేవరకొండను కర్మఫలం వెంటాడిందని..  అందుకే లైగర్ ప్లాప్ అయ్యింది అని అర్థం వచ్చేలా  ట్వీట్ చేసింది. దీంతో ది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీంతో తనను ఆంటీ అన్న వారిపై కేసు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. నటుడు బ్రహ్మాజీ సైతం అనసూయపై ఇండైరెక్ట్ సెటైర్ వేశాడు.  

తాజాగా అనసూయ.. యాంకర్ సుమ నిర్వహించే ‘క్రేజీ కిచన్’ అనే వంటల కార్యక్రమంలో పాల్గొన్నది. చాలా మంది తనకు వంటలు రావని అందరూ అనుకుంటారని.. కానీ, తాను చాలా బాగా వంటలు చేస్తానని చెప్పింది. ఈ షోలో తాను బాగా వంట చేస్తానని ఈ షోలో నిరూపించనున్నట్లు చెప్పింది. మాటలో మాటగా ఆంటీ అనే విషయం మళ్లీ ముందుకు వచ్చింది. వాతావానికి “అత్తా, పిత్తా అనడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. చివరికి నా కోడలు కూడా నన్ను అత్త అని పిలవడం ఇష్టం ఉండదు. జస్ట్ అను అని పిలిస్తే చాలు” అని చెప్పింది. గురువారం ఈ కార్యక్రమం సుమ యూట్యూబ్ చానెల్ లో ప్రసారం కానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suma Kanakalla (@kanakalasuma)

మరోవైపు తన ఆంటీ వివాదం మూలంగా అనసూయ పలు అవకాశాలను కోల్పోయినట్లు తెలుస్తున్నది. సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ‘పుష్ప-2’ నుంచి తనని తప్పించినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆమె ప్లేస్ లో మరో నటిని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అటు ‘పుష్ప’ సినిమాలో సునీల్ భార్య దాక్షాయనిగా నటించి ఆకట్టుకుంది. అటు మరో ఇద్దరు దర్శకులు కూడా ఆమె తమ ప్రాజెక్టుల నుంచి తొలగించినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది.  ఈ వార్తలు వాస్తవమేనా? అనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది.

Also Read : ఆస్కార్ బరిలో నిలిచిన ‘చల్లో షో’ కథ ఏంటీ? అందుకే, ఆ చిత్రానికి అంత హైప్?

Also Read : ముందుంది అసలైన యుద్ధం - రంగంలోకి దిగిన 'ఆర్ఆర్ఆర్' టీమ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget