Rangamarthanda: 'రంగమార్తాండ' ఓటీటీ రిలీజ్ - ఎంత ఆఫర్ చేశారంటే?
ప్రముఖ ఓటీటీ సంస్థ 'రంగమార్తాండ' సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజే చేయడానికి రూ.20 కోట్లు ఆఫర్ చేసిందని తెలుస్తోంది.

మరాఠీ భాషలో తెరకెక్కించిన 'నటసామ్రాట్' సినిమా అక్కడ పెద్ద హిట్ అయింది. విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్న సినిమా అది. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు కృష్ణవంశీ. నాలుగేళ్ల క్రితమే సినిమాను మొదలుపెట్టారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. కానీ ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు. ఇప్పుడు ఈ సినిమాకి ఓటీటీ రూపంలో మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజే చేయడానికి రూ.20 కోట్లు ఆఫర్ చేసిందని తెలుస్తోంది. ఈ డీల్ గనుక కుదిరితే నిర్మాతలు లాభాలతో బయటపడే ఛాన్స్ ఉంది. నిజానికి ఇదొక ప్రయోగాత్మక సినిమా. ఇలాంటి కథలను థియేటర్లో ఎంతవరకు ఆదరిస్తారో చెప్పలేని పరిస్థితి. ఓటీటీలో రిలీజ్ చేస్తే గనుక ఇది మంచి డీల్ అనే చెప్పాలి. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లాంటి తారలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర చాలా కొత్తగా ఉంటుందని.. ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయమని చెబుతున్నారు. ఇటీవల ఈ సినిమా రషెస్ ను కృష్ణవంశీ తన స్నేహితులు కొంతమందికి చూపించారు. చూసిన ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అయిందట. ఇళయరాజా సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెబుతున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటివరకు ఒక్క పోస్టర్ కానీ, టీజర్ కానీ రిలీజ్ కాలేదు. అయినప్పటికీ ఈ రేంజ్ బజ్ రావడమంటే విశేషమనే చెప్పాలి. అందుకే క్రేజీ ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి. మరి ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: మహేష్ కుమార్తె డ్రీమ్ ఏంటో తెలుసా? క్లారిటీగా చెప్పిన సితార
Also Read: 'మురారి' ప్లేస్లో 'మ మ మహేశా', ముందు 'కళావతి' నచ్చలేదు - మహేష్
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















