అన్వేషించండి

పరీక్ష రాస్తుంది రాజగోపాల్‌ రెడ్డి- టెన్షన్ పడుతుంది టీఆర్‌ఎస్‌

ఆ టీఆర్ఎస్ నేతల భవితవ్యం తేల్చేంది ఈ 2,41,855 మంది ఓటర్లేనా? మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాలకు ఏరి కోరి పేర్చిమరీ ఇన్ ఛార్జ్ లను వేసింది టీఆర్ఎస్ పార్టీ.

 

మునుగోడు ఉపఎన్నిక ఫలితం ఏ పార్టీకి ఎలా ఉన్నా కానీ టీఆర్‌ఎస్‌కి మాత్రం కీలకంగా మారనుంది. ఎందుకంటే ఈ ఉపఎన్నిక ఫలితంపైనే ఇప్పుడు నేతల భవితవ్యం ఆధారపడి ఉంది. ముఖ్యంగా మునుగోడు ఉపఎన్నిక బాధ్యతనెత్తుకున్న ఎమ్మెల్యేలపై ఈ ప్రభావం తప్పకుండా ఉంటుందని ఇన్‌ సైడ్‌ టాక్‌. 

మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి బరిలో ఉన్నారు. కమ్యూనిస్ట్‌ల పొత్తుతో రంగంలోకి దిగిన కారు పార్టీకి ఈ ఫలితం ఎలా వస్తుందోనని పార్టీ నేతలంతా టెన్షన్‌ పడుతున్నారు. ముఖ్యంగా మునుగోడు బాధ్యతని మోస్తోన్న మంత్రి జగదీష్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావుతోపాటు జిల్లా నేతలు హైరానా పడుతున్నారు. 100మంది ఓటర్లని ఒక్కో యూనిట్‌గా విభజించిన టీఆర్‌ఎస్‌ జిల్లానేతలతోపాటు పలువురు ఎమ్మెల్యేలను కూడా రంగంలోకి దింపింది. వీరందరిని నడిపించే బాధ్యతలను మంత్రులు కెటిఆర్‌, హరీశ్‌రావుకు అప్పజెప్పారు కెసిఆర్‌. 

గులాబీ బాస్‌ చెప్పినట్లుగా మునుగోడులో ప్రచారం సాగింది. ఇక ఓటర్లు ఎవరిని గెలిపిస్తారన్నదే ఆ పార్టీని టెన్షన్‌ పెడుతోంది.
గెలిస్తే సరే కానీ ఒక వేళ మునుగుడులో కారు పార్టీకి మళ్లీ చేదు అనుభవమే ఎదురైతే పరిస్థితి ఏంటన్నదానిపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ గెలుపే బాధ్యతలు తీసుకున్న నేతల భవిష్యత్‌ని నిర్ణయించబోతోంది. 

ఆ విషయాన్ని స్వయంగా కెసిఆరే స్పష్టం చేయడంతో రేపటి ఎన్నికల్లో టిక్కెట్‌ వస్తుందా రాదా అన్నదానిపై ఆపార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు. వలస నేతలతోపాటు మునుగోడు బాధ్యతలను నెత్తికెత్తున్న కొంతమంది ప్రజాప్రతినిధులంతా కూడా జంప్‌ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే క్యాడర్‌తో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఎవరెవరు బైబై చెప్పబోతున్నారన్నది మునుగోడు విక్టరీ నిర్ణయించనుంది.

దుబ్బాక, హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో కెటిఆర్‌-హరీశ్‌రావు కలిసి ప్రచారం నిర్వహించ లేదు. ఇప్పుడు బావ-బావమరుదులు కలిసి ప్రచారం నిర్వహించడంతో ఈసారి అనుకూల ఫలితం వస్తుందని శ్రేణులు ధీమాతో ఉన్నారు. అంతే కాదు వీళ్లిద్దరిపైనే కెసిఆర్‌ ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడంతో వారికి కూడా ఈ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా కాబోయే సిఎం కెటిఆర్‌ అని ఇప్పటికే పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కాబట్టి కెటిఆర్‌కి ఈ గెలుపు అనివార్యమని రాజకీయవిశ్లేషకులు కూడా భావిస్తున్నారు. దుబ్బాకలో పార్టీని గెలిపించలేకపోయిన హరీశ్‌రావు ఈ మునుగోడు ఉపఎన్నికలో గెలిచి మామ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్న కసితో పని చేశారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.  

పరీక్ష రాజగోపాల్‌ రెడ్డి రాస్తుంటే... టీఆర్‌ఎస్‌ నేతలు టెన్షన్ పడుతున్నారనే టాక్‌ గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి మునుగోడు ఉపఎన్నిక ఫలితం పార్టీకే కాదు టీఆర్‌ఎస్‌ నేతలకు కూడా అగ్నిపరీక్షగా మారింది. రాజకీయ భవిష్యత్‌కి ఆశాజ్యోతిలా కనిపిస్తోంది. ఏడాది మాత్రమే మునుగోడుకి ఎమ్మెల్యేగా ఉండే ఆ ప్రజాప్రతినిధి ఎవరు అన్నది తేలాలంటే నవంబర్‌ 6 వరకు ఆగాల్సిందే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget