అన్వేషించండి

Elections 2024: ఓటరు చైతన్యం పోటెత్తనుందా? - గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగేనా?

Andhra Pradesh News: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు సిద్ధం అవుతున్న క్రమంలో ఓటరు చైతన్యంపై చర్చ సాగుతోంది. ఏపీలో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Voting Percentage Will May Increase Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో భాగంగా ఏపీలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలు.. తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి ఈ నెల 13న (సోమవారం) పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఓటింగ్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే, గత 3 విడతల పోలింగ్ లో అనుకున్నంత స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా నగరాల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కావడం లేదు. గత గణాంకాలు చూస్తే.. 1952 నుంచి ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో 55 - 68 శాతం ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా గత రెండు ఎన్నికల్లో వరుసగా.. 2019లో 67.4 శాతం నమోదైతే.. 2014లో 66.4 శాతం నమోదైనట్లు ఈసీ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, మారుమూల ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరుగుతోంది. ఈసీ చర్యలు, ప్రజా చైతన్యంతో.. ఓటు వేసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. 

ఏపీలో ఓటెత్తుతారా.?

ఏపీలో ఈసారి పోలింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతుండగా.. ఎన్నికల సంఘం ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత ఏర్పాట్లు చేసింది. మరోవైపు, ఈసారి ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా బరిలో నిలిచాయి. గ్రామాలు, పట్టణాల్లోని యువత, మహిళలు ఎక్కువగా ఓటింగ్ వైపు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం సైతం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేలా విస్తృత అవగాహన కల్పిస్తోంది. అటు, అభ్యర్థులు సైతం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచిస్తున్నారు. దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఎండ, వడగాలుల తీవ్రత తగ్గి.. వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు. 

గత గణాంకాలు చూస్తే..

గత ఎన్నికల్లో చూస్తే ప్రతిసారీ ఓటింగ్ శాతం పెరుగుతూనే వస్తోంది. గడిచిన 20 ఏళ్లుగా ఉమ్మడి ఏపీ, విభజన తర్వాత కూడా అదే పంథా కొనసాగింది. 2019 ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ జరిగితే.. ఈసారి 80 శాతం దాటి ఓటింగ్ జరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2004 ఉమ్మడి ఏపీలో 69.96 పోలింగ్ శాతం నమోదైతే.. 2009లో 72.72 పోలింగ్ శాతం నమోదైంది. విభజన తర్వాత 2014లో 78.41 శాతం.. 2019లో 79.64 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి కూడా ఆ స్థాయి దాటి ఓటింగ్ శాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 

తెలంగాణలో..

అటు, తెలంగాణలో ఎన్నికలొప్పుడొచ్చినా నగరవాసులు ఓటింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. గత లోక్ సభ ఎన్నికలు పరిశీలిస్తే.. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరిల్లో 55 శాతానికి మించి ఓటింగ్ నమోదు కావడం లేదు. రాజధాని పరిధిలో 1991లోనే అత్యధికంగా 77 శాతం ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్ లో 1984లో 76.8 శాతం, 1989లో 71.3 శాతం, 1998లో 73.2 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక, సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో 2004లోనే అత్యధికంగా 59.9 పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా ఎన్నికల అధికారులు అవగాహన కల్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 71.34 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యదికంగా యాదాద్రి జిల్లాలో 90.36 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో కేవలం 47.88 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందా.? లేదా.? అనేది ఆసక్తిగా మారింది.

Also Read: Election Campaign Ends: ఏపీ, తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget