అన్వేషించండి

Election Campaign Ends: ఏపీ, తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు

Andhra Elections 2024: ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు నాలుగో దశలో ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రచారం ముగిసింది. మే 13న దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

Lok Sabha Elections 2024 Phase 4 campaign ends for 96 seats and polling on May 13 | హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 10 రాష్ట్రాల్లో 96 నియోజకవర్గాల్లో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్న చోట ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. పార్టీల ప్రచార జోరు ముగిసి మైకులు మూగబోయాయి. మే 13న ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్ సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీఆర్ఎస్, జనసేన ఇతర పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. మే 13న ఉదయం 7 గంటల నుంచి కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ కు అనుమతి ఇచ్చింది ఈసీ.

అక్కడ ముందే ముగిసిన ప్రచారం
ఏపీ వ్యాప్తంగా శనివారం (మే 11న) సాయంత్రం 6గంటలకు ప్రచారం ముగిసింది. అయితే సమస్యాత్మక ప్రాంతాలైన పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటల వరకే ప్రచారానికి ఈసీ సమయం ఇచ్చింది. పాడేరు, అరకు, రంపచోడవరం లాంటి నియోజకవర్గాల్లో సాయంత్రం 4కే ప్రచారం ముగిసినట్లు ఈసీ పేర్కొంది.

ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా మీడియాతో మాట్లాడారు. ఫెసిలిటేషన్‌ సెంటర్లలో 4,44,216 పోస్టల్‌ బ్యాలెట్లు పోలయ్యాయని చెప్పారు. ఏపీలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 4,44,216 ఓట్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 4,44218 పోస్టల్‌ బ్యాలెట్లు పోలైనట్లు వివరించారు. సాయంత్రం 6 తర్వాత సభలు, సమావేశాలు పెట్టకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రచార సమయం ముగియడంతో స్థానికేతరులు నియోజకవర్గాల్లో ఉండేందుకు వీలులేదని పేర్కొన్నారు. బయటి నుంచి వచ్చిన వారంతా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని తెలిపింది. 

తెలంగాణలో అక్కడ ముందే ముగిసిన ప్రచారం
ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగిసింది. 5 లోక్ సభ నియోజకవర్గాల్లోని 13 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం ముగిసింది. సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని అసెంబ్లీ స్థానాలల్లో ముందే ప్రచారం ముగిసింది. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని భూపాలపల్లి అసెంబ్లీ పరిధిలో, మహబూబాబాద్ ఎంపీ స్థానం పరిధిలో భద్రాచలం, ములుగు, పినపాక, ఇల్లందు, అసెంబ్లీ సెగ్మెంట్లలో, ఖమ్మం ఎంపీ స్థానంలో పరిధిలో కొత్తగూడెం, అశ్వరావుపేటలో ఈసీ ఆదేశాలతో మిగతా స్థానాల కంటే ముందే ప్రచారం ముగించారు. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసి మైకులు మూగబోయాయి.

అమల్లోకి 144 సెక్షన్ 
ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాష్ట్రం అంతటా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమలు అవుతుంది. నలుగురి కంటే ఎక్కువ వ్యక్తులు ఒకేసారి కలిసి తిరుగొద్దు. మీడియాలో ఆరు గంటల నుంచి ఎలాంటి ప్రచారం చేయొద్దు. కొన్ని సంస్థలు మే 13న సెలవు ఇవ్వడం లేదని గుర్తించిన ఈసీ, చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget