అన్వేషించండి

Prof Kodandaram: ధరణి పేరుతో హైదరాబాద్ పరిసరాల్లో 7వేల ఎకరాలు కబ్జా! ప్రొ. కోదండరాం సంచలన ఆరోపణలు

Dharani portal In Telangana: ధరణి పేరుతో బీఆర్ఎస్ పెద్దలు హైదరాబాద్ పరిసరాల్లో 7, 8 వేల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. అందుకే ఆయనకు ధరణి ఉండాలని సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేశారు.

Prof Kodandaram News: నల్లగొండ: తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య ధరణి వెబ్ సైట్ (Dharani Portal) పై ఆరోపణల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసివేస్తామని చెబుతోందని, అందుకే వాళ్లకు ఓటు వేయవద్దని సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ధరణి కారణంగా వేలాది మంది తమ స్థలాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ధరణి వెబ్ సైట్ (Prof Kodandaram on Dharani Website)పై సంచలన ఆరోపణలు చేశారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ పెద్దలు హైదరాబాద్ పరిసరాల్లో 7, 8 వేల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. అందుకే ఆయనకు ధరణి ఉండాలని సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో " 10 ఏళ్ల తెలంగాణ - ప్రజల ఆకాంక్షలు - కర్తవ్యాలు " తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొ.కోదండరాం పలు విషయాలను ప్రస్తావించారు. 

భూముల వివరాలు పొందుపరిచే ధరణి వెబ్ సైట్ తెచ్చాక రాష్ట్రంలో సమస్యలు పెరిగాయని, సామాన్యులు భూమిని కోల్పోయారని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి పేద రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్న కారణంగా ధరణిని తొలగించాలని డిమాండ్ చేశారు. ధరణి లేకముందు రాష్ట్రంలో 30 వేల వరకు రెవెన్యూ సమస్యలు ఉండగా, ధరణి వచ్చాక ఆ సమస్యలు 20 లక్షలకు పెరిగిపోయాయని చెప్పారు. పేర్లు తప్పులు రాసి ఎంట్రీ చేయడం వల్ల ధరణిలో వివరాలు మార్చడం వీలుకాదని, సామాన్యుడు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు మార్చే అధికారం ఎమ్మార్వో, కలెక్టర్ దగ్గర లేదని, హైదరాబాద్ కు వెళ్లి మార్చుకోవాల్సి వస్తోందన్నారు. కంప్యూటర్ లో ఎంట్రీ చేయించడానికి తనకే ఒకరోజు సమయం పట్టిందని, సామాన్యులు, రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. మీ సేవా లో ఎవరైనా సరిగ్గా ఎంట్రీ చేయిస్తే.. హైదరాబాద్ వెళ్లి కష్టపడి తమ భూమిని తమ పేరిట మార్పించుకునే ఛాన్స్ ఉంటుందన్నారు. 
Also Read: Telangana Elections 2023: 'బీఆర్ఎస్ పాలనలో అవస్థలు, అవమానాలు తెలుసు' - ప్రజా ప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ధరణి ఎక్కడికి పోదు.. మెరుగైన వ్యవస్థ కావాలి
సీఎం కేసీఆర్ చెబుతున్నట్లుగా ప్రభుత్వం మారితే ధరణి తొలగించరని, అయితే మెరుగైన రెవెన్యూ వ్యవస్థ, సాఫ్ట్ వేర్ రావాలన్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు ఏ ఫీజు లేకుండా సమస్యలు పరిష్కరిస్తే సరిపోతుంది. ప్రత్యేక రెవెన్యూ కోర్టు పెడితే ప్రజల భూముల సమస్యలు తీరుతాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 7 నుంచి 8 వేల వరకు భూములను ఆయన తన పేరిట నమోదు చేసుకున్నారని, అందుకే ధరణి పోవద్దు అని చెబుతున్నారని కోదండరాం చెప్పారు. రికార్డులో తప్పులు దొర్లిన వారున్నారు, కొన్ని భూములకు రిజిస్ట్రేషన్ లేదు. నాపేరు మీద ఎక్కించిన భూమి నాదేనని, సగం నాకు ఇస్తేనే నీకు సగం వాటా ఇస్తానని అసలు భూ యజమాని ఇలా నష్టపోతున్నారని ప్రొఫెసర్ వివరించారు. ఇలాంటి కారణాలతోనే ధరణి వెబ్ సైట్ ను పూర్తిస్థాయిలో మార్చాల్సిన అవసరం ఉందన్నారు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Embed widget