అన్వేషించండి

Prof Kodandaram: ధరణి పేరుతో హైదరాబాద్ పరిసరాల్లో 7వేల ఎకరాలు కబ్జా! ప్రొ. కోదండరాం సంచలన ఆరోపణలు

Dharani portal In Telangana: ధరణి పేరుతో బీఆర్ఎస్ పెద్దలు హైదరాబాద్ పరిసరాల్లో 7, 8 వేల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. అందుకే ఆయనకు ధరణి ఉండాలని సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేశారు.

Prof Kodandaram News: నల్లగొండ: తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య ధరణి వెబ్ సైట్ (Dharani Portal) పై ఆరోపణల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసివేస్తామని చెబుతోందని, అందుకే వాళ్లకు ఓటు వేయవద్దని సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ధరణి కారణంగా వేలాది మంది తమ స్థలాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ధరణి వెబ్ సైట్ (Prof Kodandaram on Dharani Website)పై సంచలన ఆరోపణలు చేశారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ పెద్దలు హైదరాబాద్ పరిసరాల్లో 7, 8 వేల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. అందుకే ఆయనకు ధరణి ఉండాలని సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో " 10 ఏళ్ల తెలంగాణ - ప్రజల ఆకాంక్షలు - కర్తవ్యాలు " తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొ.కోదండరాం పలు విషయాలను ప్రస్తావించారు. 

భూముల వివరాలు పొందుపరిచే ధరణి వెబ్ సైట్ తెచ్చాక రాష్ట్రంలో సమస్యలు పెరిగాయని, సామాన్యులు భూమిని కోల్పోయారని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి పేద రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్న కారణంగా ధరణిని తొలగించాలని డిమాండ్ చేశారు. ధరణి లేకముందు రాష్ట్రంలో 30 వేల వరకు రెవెన్యూ సమస్యలు ఉండగా, ధరణి వచ్చాక ఆ సమస్యలు 20 లక్షలకు పెరిగిపోయాయని చెప్పారు. పేర్లు తప్పులు రాసి ఎంట్రీ చేయడం వల్ల ధరణిలో వివరాలు మార్చడం వీలుకాదని, సామాన్యుడు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు మార్చే అధికారం ఎమ్మార్వో, కలెక్టర్ దగ్గర లేదని, హైదరాబాద్ కు వెళ్లి మార్చుకోవాల్సి వస్తోందన్నారు. కంప్యూటర్ లో ఎంట్రీ చేయించడానికి తనకే ఒకరోజు సమయం పట్టిందని, సామాన్యులు, రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. మీ సేవా లో ఎవరైనా సరిగ్గా ఎంట్రీ చేయిస్తే.. హైదరాబాద్ వెళ్లి కష్టపడి తమ భూమిని తమ పేరిట మార్పించుకునే ఛాన్స్ ఉంటుందన్నారు. 
Also Read: Telangana Elections 2023: 'బీఆర్ఎస్ పాలనలో అవస్థలు, అవమానాలు తెలుసు' - ప్రజా ప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ధరణి ఎక్కడికి పోదు.. మెరుగైన వ్యవస్థ కావాలి
సీఎం కేసీఆర్ చెబుతున్నట్లుగా ప్రభుత్వం మారితే ధరణి తొలగించరని, అయితే మెరుగైన రెవెన్యూ వ్యవస్థ, సాఫ్ట్ వేర్ రావాలన్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు ఏ ఫీజు లేకుండా సమస్యలు పరిష్కరిస్తే సరిపోతుంది. ప్రత్యేక రెవెన్యూ కోర్టు పెడితే ప్రజల భూముల సమస్యలు తీరుతాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 7 నుంచి 8 వేల వరకు భూములను ఆయన తన పేరిట నమోదు చేసుకున్నారని, అందుకే ధరణి పోవద్దు అని చెబుతున్నారని కోదండరాం చెప్పారు. రికార్డులో తప్పులు దొర్లిన వారున్నారు, కొన్ని భూములకు రిజిస్ట్రేషన్ లేదు. నాపేరు మీద ఎక్కించిన భూమి నాదేనని, సగం నాకు ఇస్తేనే నీకు సగం వాటా ఇస్తానని అసలు భూ యజమాని ఇలా నష్టపోతున్నారని ప్రొఫెసర్ వివరించారు. ఇలాంటి కారణాలతోనే ధరణి వెబ్ సైట్ ను పూర్తిస్థాయిలో మార్చాల్సిన అవసరం ఉందన్నారు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget