అన్వేషించండి

Nirmal Election: నిర్మల్‌ జిల్లా ప్రజలు ఏ పార్టీకి జై కొట్టనున్నారు-గత ఎన్నికలు ఫలితాలే రిపీటవుతాయా

నిర్మల్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నా.. బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. దీంతో గెలుపు ఎవరది అన్నది ఉత్కంఠగా మారింది. ఈ ఎన్నికల్లో నిర్మల్‌ జిల్లా ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో చూడాలి.

నిర్మల్ జిల్లాలో రాజకీయాలు రోజురోజుకూ మారుతున్నాయి. ఈ జిల్లాలో రెండు నియోజకవర్గాలే ఉన్నాయి. అవి ఒకటి నిర్మల్‌. రెండు ముధోల్‌. బీఆర్ఎస్ ​అధికారంలో ఉండడం, నిర్మల్​ఎమ్మెల్యే మంత్రి కావడంతో జిల్లాలో ఆ పార్టీ బలంగానే ఉంది. కానీ, కొంతకాలంగా బీజేపీ బీఆర్ఎస్​కు గట్టి పోటీ ఇస్తోంది. 2014 ఎన్నికల్లో నిర్మల్‌ నియోజకవర్గంలో బీఎస్పీ గెలుపొందగా.. ముధోల్‌లో కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. ఇక 2018 ఎన్నికల్లో నిర్మల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి (టీఆర్‌ఎస్), ముథోల్‌ నుంచి జి.విఠల్ రెడ్డి (టీఆర్‌ఎస్) విజయం సాధించారు.

నిర్మల్ నియోజకవర్గంలో 2.38 ల‌క్ష‌ల ఓట్లు ఉన్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన‌ అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్త‌ిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 1999, 2004లో  కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి గెలిచారు. 2009లో  ప్ర‌జారాజ్యం పార్టీ అభ్యార్థి ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని కాద‌ని, ప్ర‌జారాజ్యం త‌ర‌పున గెలిచిన‌ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. దీంతో ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బీఎస్‌పి త‌ర‌పున పోటీ చేసి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూచడి శ్రీ‌హ‌రిరావుపై 8,628 ఓట్ల ఆధిక్య‌త‌తో గెలిచారు. ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి 61,368 ఓట్లు రాగా, కూచడి శ్రీ‌హ‌రిరావుకు 52,871 ఓట్లు వ‌చ్చాయి. కాంగ్రెస్ అభ్య‌ర్థి ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి 38,951 ఓట్ల‌తో మూడో స్థానాన్ని స‌రిపెట్టుకున్నారు. ఆ త‌రువాత ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి టిఆర్ఎస్‌లో చేరి కెసిఆర్ మంత్రివ‌ర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 2018 ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్ త‌ర‌పున ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డే గెలిచారు.  కాంగ్రెస్ అభ్య‌ర్థి ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డిపై 9,271 ఓట్ల మెజార్టీతో ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి విజ‌యం సాధించారు. ఈ ఎన్నిక‌ల్లో ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి 79,985 ఓట్లు రాగా, మ‌హేశ్వ‌ర్‌రెడ్డికి 70,714 ఓట్లు వ‌చ్చాయి. కేసిఆర్ రెండో మంత్రివ‌ర్గంలో కూడా స్థానం ద‌క్కించుకున్న ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా బిఆర్ఎస్ టిక్కెట్టు ద‌క్కించుకున్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి ఆరోసారి నిర్మల్‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ముధోల్‌ నియోజకవర్గంలో 1,86,418 మంది ఓట‌ర్లు ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో ముథోల్‌లో కాంగ్రెస్‌ గెలించింది. ఆనాడు కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన గ‌డ్డం విఠ‌ల్‌రెడ్డి.. బీజేపీ అభ్య‌ర్థి ర‌మాదేవిపై 14,686 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విఠ‌ల్‌రెడ్డి 63,322 ఓట్లు రాగా, ర‌మాదేవికి 48,485 ఓట్లు వ‌చ్చాయి. టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఎస్‌.వేణుగోపాల చారికి 43,540 ఓట్లు వ‌చ్చాయి. అయితే ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత విఠ‌ల్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. 2018 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌పున బరిలోకి దిగారు విఠల్‌రెడ్డి. బీజేపీ అభ్య‌ర్థి ర‌మాదేవిపై 43,364 ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. ఈ ఎన్నిక‌ల్లో విఠ‌ల్‌రెడ్డికి 83,703 ఓట్లు రాగా, రమాదేవికి 40,339 ఓట్లు వ‌చ్చాయి. 43,364 ఓట్ల భారీ మెజార్టీతో బీజేపీ అభ్య‌ర్థి ర‌మాదేవిని ఓడించారు విఠల్‌రెడ్డి. కాంగ్రెస్ అభ్య‌ర్థి పటేల్ ప‌వార్ 36,396 ఓట్ల‌తో మూడో స్థానంలో నిలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డిగారి విఠ‌ల్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఇక... ముధోల్‌ టికెట్‌ కోసం బీజేపీ నేతల్లో పోటీ ఎక్కువగా ఉంది. రెండుసార్లు పోటీచేసి ఓడిన జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, డీసీసీ అధ్యక్షుడిగా ఉండి కమలదళంలో చేరిన రామారావుపటేల్‌, నియోజకవర్గ సీనియర్‌నేత మోహన్‌రావుపటేల్‌ పార్టీ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక.. కాంగ్రెస్‌ మాత్రం ముధోల్‌ నియోజకవర్గంలో సీనియర్‌ నేతలు లేరు. దీంతో ఈ ఎన్నికల్లో ముధోల్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPS Ajay Pal Sharma : పశ్చిమ బెంగాల్‌ పోలీస్ అబ్జర్వర్‌గా యూపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌! అజయ్‌పాల్ శర్మ నియామకంతో దీదీ కంచుకోట హై అలర్ట్‌!
పశ్చిమ బెంగాల్‌ పోలీస్ అబ్జర్వర్‌గా యూపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌! అజయ్‌పాల్ శర్మ నియామకంతో దీదీ కంచుకోట హై అలర్ట్‌!
Assembly Elections Polling 2026:తమిళనాడు, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం! రాజకీయ దిగ్గజాల భవితవ్యం నిర్ణయిస్తున్న ఓటర్లు!
తమిళనాడు, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం! రాజకీయ దిగ్గజాల భవితవ్యం నిర్ణయిస్తున్న ఓటర్లు!
Chandrababu In Chennai: నచ్చకున్నా మోదీనే ప్రధాని..! పీఎం హిందీకి తమిళనాడులో క్రేజ్ - చెన్నైలో చంద్రబాబు
నచ్చకున్నా మోదీనే ప్రధాని..! పీఎం హిందీకి తమిళనాడులో క్రేజ్ - చెన్నైలో చంద్రబాబు
Chandrababu On Delimitation: కొత్త సెన్సస్‌తో దక్షిణాదికే నష్టం! కానీ - చెన్నైలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కొత్త సెన్సస్‌తో దక్షిణాదికే నష్టం! కానీ - చెన్నైలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Rahul: కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
Andhra University:
"శతాయుష్మాన్ భవ" ఏయూను దీవించిన ప్రముఖులు! ఘనంగా ముగిసిన శతాబ్ది వసంతాల వేడుకలు! ప్రత్యేక ఆకర్షణగా సచిన్, త్రివిక్రమ్
Hyderabad IT Corridor: హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
live in relationship: సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
Mumbai News: బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
Tips for Child Sleep : పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే.. తల్లిదండ్రులు తప్పకుండా పాటించాల్సిన టిప్స్
పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే.. తల్లిదండ్రులు తప్పకుండా పాటించాల్సిన టిప్స్
Social Post : మోడ్రన్ డ్రెస్‌లో వామికా - నేచర్ ఎంజాయ్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ... ఫోటోస్ వైరల్
మోడ్రన్ డ్రెస్‌లో వామికా - నేచర్ ఎంజాయ్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ... ఫోటోస్ వైరల్
KCR : కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు తెలంగాణ పౌరుషం లేదా? - బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ నిప్పులు
కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు తెలంగాణ పౌరుషం లేదా? బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ నిప్పులు
Embed widget