అన్వేషించండి

Chandrababu: 'సైకో పాలన పోయి కూటమి పాలన రావాలి' - ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకూ ప్రభుత్వ పథకాలు అందిస్తామన్న చంద్రబాబు

Andhrapradesh News: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా దెందులూరు కూటమి మేనిఫెస్టోను వివరించారు.

Chandrababu Comments In Denduluru Prajagalam: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సైకో పాలన పోయి.. కూటమి పాలన రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రజలకు పిలుపునిచ్చారు. ఏలూరు (Eluru) జిల్లా దెందులూరులో (Denduluru) మంగళవారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను హత్య చేసిన వైసీపీ గూండాలకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తామని.. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే, సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ ఇస్తామని, ఆశ వర్కర్లకు కనీస వేతనం పెంపునకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మరిన్ని హామీలను చంద్రబాబు ప్రస్తావించారు.

'రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు'

'మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తాం. విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మిస్తాం. నూర్ బాషా కార్పొరేషన్ కు ఏటా రూ.100 కోట్లు మంజూరు చేస్తాం. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్ మెంట్ ఇస్తాం. పశువుల కొనుగోలు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు ఇస్తాం. గోకులాల ఏర్పాటు, మేత కోసం బంజరు భూములు కేటాయిస్తాం. 'గోపాలమిత్ర' పునర్నియామకం దిశగా చర్యలు చేపడతాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం. ఇమామ్ లకు రూ.10 వేలు, మౌజమ్ లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తాం. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తాం. అలాగే, మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు ఇస్తాం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

'9 గంటల ఉచిత విద్యుత్'

అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 'కాపు సంక్షేమం కోసం ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల నిధులు కేటాయిస్తాం. కాపు భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేస్తాం. కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాం. అమరావతిలో 5 ఎకరాల్లో అల్లూరి స్మృతివనం ఏర్పాటు చేస్తాం. భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. అగ్రకులాల కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తాం. పేదల గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం కేటాయిస్తాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయులను నియమిస్తాం.' అని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కాంక్షించే మేనిఫెస్టోను రూపొందించామని.. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సంపద సృష్టించి పేదలకు పంచుతామని ఆయన పునరుద్ఘాటించారు.

Also Read: Nara Bramhani : మంగళగిరిలో నారా బ్రాహ్మణి ప్రచారం - మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Embed widget