Goa Poll 2022: 'రాహుల్ గాంధీకి 'మోదీ ఫోబియా' పట్టుకుంది.. గోల్డెన్ గోవా మాకే సాధ్యం'
గాంధీ కుటుంబం.. గోవాను కేవలం టూరిస్ట్ స్పాట్గానే చూస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. రాహుల్ గాంధీకి మోదీ ఫోబియా పట్టుకుందన్నారు.

గోవాలో స్థిరమైన అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్పై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ కుటుంబానికి గోవా కేవలం 'వెకేషన్ స్పాట్' మాత్రమేనని ఎద్దేవా చేశారు.
ఆయనకు మోదీ ఫోబియా..
మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా అమిత్ షా విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ.. మోదీ ఫోబియాతో బాధపడుతున్నారని షా అన్నారు. అలానే గోవా ఎన్నికల్లో పోటీ చేస్తోన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), ఆమ్ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్పైనా సెటైర్లు వేశారు.
40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

