అన్వేషించండి

TDP In NDA: పొత్తుపై కదలిక, వచ్చే వారం ఎన్‌డీఏలో చేరనున్న టీడీపీ

TDP Join To NDA : ఈ నెల 19 లేదా 20న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారన్న వార్తలు వస్తుండడంతో పొత్తు ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు. 

TDP News: ఎన్‌డీఏలో తెలుగుదేశం పార్టీ చేరికపై సందిగ్ధత కొనసాగుతోంది. బీజేపీ నుంచి పొత్తు కోసం తెలుగుదేశం, జనసేన పార్టీలు ముందు నుంచీ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఆ పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ రెండు పార్టీలే వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్ధమయ్యాయి. ఈ తరుణంలో రెండు వారాలు కిందట తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు బీజజేపీ పెద్దలు నుంచి ఆహ్వానం వచ్చింది. వెంటనే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు బీజేపీ అగ్ర నాయకులు అమిత్‌షా, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ చర్చలు సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఖాయమని, సీట్ల పంపకాలు తరువాయి అన్న ప్రచారం జరిగింది. రోజులు గడిచాయి కానీ ఇప్పటి వరకు పొత్తుపై టీడీపీ గానీ, బీజేపీ గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇరుపార్టీల మధ్య సీట్లకు సంబంధించిన చర్చలు సానుకూలంగా జరగకపోవడమే దీనికి కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారన్న వార్తలు వస్తుండడంతో పొత్తు ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు. 

రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు

ఈ నెల 19 లేదా 20 తేదీల్లో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు, బీజేపీ పెద్దలు మధ్య సీట్ల పంపకాలు వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురానున్నారు. అదే రోజు చంద్రబాబు ఎన్‌డీఏలో చేరయడం ఖాయమంటున్నారు. తెలుగుదేశం, జనసేన నేతలతో బీజేపీ సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. చంద్రబాబుతోపాటు పవన్‌ కల్యాణ్‌ కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు పార్టీల నేతల చర్చలు తరువాత ఏయే సీట్లలో ఎవరెవరు పోటీ చేస్తారన్న దానిపై ప్రకటన గానీ, ముఖ్య నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి గానీ వెళ్లడించనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో సీట్ల పంపకాల ప్రక్రియ కొలిక్కి రాకపోతే ఇబ్బంది కలుగుతుందన్న భావనతో మూడు పార్టీల అగ్ర నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 


ఈ సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్టేనా

బీజేపీ, టీడీపీ మధ్య ఇన్ని రోజులపాటు చర్చలు ప్రక్రియ తేలకపోవడానికి ప్రధాన కారణం బీజేపీ అగ్రనాయకత్వం కోరిన సీట్లుగానే చెబుతున్నారు. ఎనిమిది నుంచి పది వరకు పార్లమెంట్‌ స్థానాలు, మరో 15 నుంచి 20 వరకు అసెంబ్లీ స్థానాలను బీజేపీ అగ్రనాయకత్వం కోరినట్టు చెబుతున్నారు. ఇదే ఇరు పార్టీల మధ్య పొత్తు ప్రతిష్టంభనకు కారణమైంది. రానున్న ఎన్నికల్లో విజయం సాధించడం తెలుగుదేశం పార్టీకి ఎంత ముఖ్యమో, అంతే స్థాయిలో పార్లమెంట్‌ స్థానాలను సాధించడం కూడా ముఖ్యం. కేంద్రంలో బీజేపీ నుంచి పనులు చేయించుకోవాలంటే ఎంపీ స్థానాలు అధికంగా కావాలి. కానీ, బీజేపీ, జనసేన పార్టీలకు సగం వరకు ఎంపీ స్థానాలు ఇవ్వడం వల్ల టీడీపీ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చంద్రబాబు భావించారు. ఇదే విషయంపై టీడీపీ కీలక నాయకులతో మాట్లాడిన చంద్రబాబు.. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. అందుకే ఢిల్లీకి వెళ్లడానికి రెడీ అయినట్టు పార్టీ వర్గాల బోగట్టా. బీజేపీ కోరినట్టు అన్ని స్థానాలు ఇస్తారా..? లేక మరో మార్గం గుండా బీజేపీ నాయకత్వాన్ని ఒప్పిస్తారా..? అన్నది వేచి చూడాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Vishnu Vinyasam Box Office Collection : శ్రీవిష్ణు విష్ణు విన్యాసం డీసెంట్ కలెక్షన్స్ - రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
శ్రీవిష్ణు విష్ణు విన్యాసం డీసెంట్ కలెక్షన్స్ - రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget