అన్వేషించండి

Kurnool News: కర్నూలు సిటీ వైసిపిలో వర్గ విభేదాలు- ఎస్ వి, ఎస్ వి వర్గీయుల సహాయ నిరాకరణ 

Kurnool Assembly Constituency: కర్నలూ జిల్లా వైసీపీలో ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీని కారణంగా కర్నూలు అభ్యర్థి ఇంతియాజ్‌ ఒంటరి అయ్యారు.

Andhra Pradesh News: కర్నూలు జిల్లాలో వర్గ విభేదాలతో కర్నూలు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్‌కి తలనొప్పి తెప్పిస్తున్నాయి. ఇప్పటికే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి ఉంది. ఇప్పుడు మరో కొత్త తలనొప్పి పార్టీకి ఛాలెంజ్‌ విసుసుతోంది. 

కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్న బివై రామయ్యను కర్నూలు పార్లమెంట్ వైకాపా అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఆయన స్థానం ఖాళీ అయ్యింది. అప్పటి వరకు రామయ్య మేయర్‌గా కూడా ఉన్నారు. ఎంపి అభ్యర్థిగా ఆయన్ను ఎంపిక చేసిన వెంటనే ఆ స్థానంలో కురువ సామాజిక వర్గానికి చెందిన నగర పార్టీ అధ్యక్షురాలు సత్యనారాయణమ్మను ఎంపిక చేశారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి ఇవ్వనున్నట్లు పార్టీ లీక్‌లు ఇచ్చింది. మేయర్ స్థానానికి ఎన్నిక చేపట్టాలంటే చాలా సమయం కావాలి. నిర్ణయాన్ని వెనక్కితీసుకుంటే రాజికీయంగా సమస్యలు వస్తాయని ప్రత్యామ్నాయ మార్గాలు వెతికింది. 
కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కురువలను ప్రసన్నం చేసుకునేందుకు సత్యనారాయణమ్మను జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ఈ నిర్ణయంతోనే పార్టీలో చిచ్చు రేగింది. ఐదేళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎస్వీ మోహన్‌రెడ్డిని కాదని మరొకరిని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడాన్ని ఆయన వర్గం జీర్ణించుకోలేకపోతోంది.

కర్నూలు వైసీపీ టికెట్ కోసం ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సహా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కేడీసీసీబీ ఛైర్‌పర్శన్ ఎస్వీ విజయమనోహరి దంపతులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. 2019 ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ గెలుపు కోసం అప్పటి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి గట్టిగా కృషి చేశారు. ఎమ్మెల్యే హఫీజాఖాన్ గెలిచాక ఎస్వీ వర్గాన్ని పూర్తిగా పక్కన పెడుతూ వచ్చారు. దీంతో వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరికి కాకుండా కృష్ణా జిల్లా కలెక్టరుగా పని చేసిన ఐఏఎస్ అధికారి ఏఎం ఇంతియాజ్ అహ్మద్‌తో రాజీనామా చేయించిన సీఎం జగన్ కర్నూలు వైసీపీ అభ్యర్థిగా బరిలో దింపారు. 

కర్నూలు టికెట్ ఆశించిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు రాజ్యసభ సీటు ఇస్తానని, మాజీ ఎస్వీ మోహన్ రెడ్డికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామని ఆ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. దీంతో ఇద్దరు కూడా ఇంతియాజ్‌తో కలసి ప్రచారం చేపట్టారు. మార్చి 29న ఎమ్మిగనూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో హఫీజ్ ఖాన్‌కు టికెట్ ఇవ్వలేకపోయానని, మన ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో రాజ్యసభకు పంపుతానని జగన్ ప్రకటించారు. అదే క్రమంలో ఎస్వీ మోహన్ రెడ్డిని వైసీపీ జిల్లా అధ్యక్షుడిని చేస్తానని జగన్ ప్రకటిస్తారని ఆయన వర్గీయులు ఆశించారు. అయితే ఆ సభలో జగన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ రోజే ఎస్వీ మోహన్ రెడ్డి, ఆయన వర్గీయులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. 

జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న ఎస్వీ మోహన్ రెడ్డికి ఆశాభంగం ఎదురైంది. జిల్లా అధ్యక్షురాలిగా కార్పొరేటర్ సత్యనారాయణమ్మను ఎంపిక చేస్తూ వైసీపీ అధిష్టానం గురువారం ప్రకటన విడుదల చేసింది. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎస్వీ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. హఫీజ్ ఖాన్ వర్గానికి చెందిన కార్పొరేటర్ సత్యనారాయణమ్మ ఆ పార్టీ నగర అధ్యక్షురాలిగా ఉన్నారు. అదేవిధంగా మేయర్‌గా ఎంపిక చేశారు. ఈ రెండుపదవులకు తోడు తాజాగా జిల్లా అధ్యక్ష పదవి కూడా ఆమెకే కేటాయించడంతో వైసీపీలో ఎస్వీ మోహన్ రెడ్డికి ఉన్న ప్రాధాన్యం పేకమేడలా ఒక్కసారిగా కూలిపోయింది. పార్టీలో వరుస పరాభవాలతో ఎస్వీ అనుచరులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ తన నివాసంలో ఎస్వీ వర్గీయులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహంతో ఎస్వీ వర్గం రగిలిపోయినట్లు తెలుస్తుంది. మా నాయకుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఆయన ఆదేశాల మేరకు మేము ఎలాంటి పదవి ఆశించకుండా ఐదేళ్లు పార్టీ కోసం పని చేశాం. ఆధిష్టానం మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించగానే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ప్రచారం చేశాం. ఏ పదవి అడగకపోయినా మా నాయకుడు ఎస్వీ మోహన్ రెడ్డికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామని సంకేతాలు ఇచ్చారు కానీ దక్కలేదు...

మా నాయకుడుకి ఏ హోదా లేకుండా ఏమని ఓట్లు అడగాలంటూ ఎస్వీ వర్గం రగిలిపోతుంది. రాజకీయ కుట్రలో భాగమే అణచివేస్తున్నారు అంటూ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ ఎదుట ఎస్వీ వర్గం ఆవేదన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఎన్నికల తరువాత ఎస్వీ మోహన్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని ఇంతియాజ్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయం కూడా ఆనాటి అభ్యర్థి హఫీజ్ ఖాన్ ఇలాంటి మాటలే చెప్పి గెలిచాక మోసం చేశారని ఎస్వీ వర్గీయులు దీటుగా సమాధానమిచ్చారు. ఈ విభేధాలతో కర్నూలు అభ్యర్థి తల పట్టుకుంటున్నాడు. మరి పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget