అన్వేషించండి

Karnataka Election 2023 : పార్టీ పెట్టిన ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా గెలిచిన గాలి జనార్ధన్ రెడ్డి - ఆయన పార్టీ పరిస్థితేమిటో తెలుసా ?

పార్టీ పెట్టిన ఆరు నెలల్లో గాలి జనార్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మిగతా అందరు అభ్యర్థులు ఓడిపోయారు.

Karnataka Election 2023 :   కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా ఉన్నాయి. దిగ్గజ నేతలు కొంత మంది పరాజయం పాలయ్యారు. చాలా కాలం నుంచి టిక్కెట్ ఇవ్వకుండా పక్కన పెడుతున్న గాలి జనార్ధన్ రెడ్డి ఈ సారి బీజేపీని తీవ్రంగా దెబ్బకొట్టారు. ఆయన సొంత పార్టీ పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. బీజేపీ అభ్యర్థుల్ని ఓడించారు. 

కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్దన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి గాలి జనార్దన్ రెడ్డి సోదరులు, బళ్లారి శ్రీరాములు శక్తి వంచన లేకుండా పని చేసేవారు. అయితే అక్రమ మైనింగ్ కేసుల్లో జైలుకు వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి రాజకీయ జీవితం పూర్తిగా తల్లకిందులు అయ్యింది.  గత డిసెంబర్ నెలలో బీజేపీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ (కేఆర్ పీపీ) పెట్టి బీజేపీ నాయకులకు షాక్ ఇచ్చారు. కోప్పళ జిల్లాలోని గంగావతి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఫుట్ బాల్ సింబల్ మీద పోటీ చేసిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి 8 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. గంగావ‌తిలో బీజేపీ మూడ‌వ స్థానంలో నిలిచింది.                              
 
కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీల నుంచి ఎంతో సీనియర్ నాయకులు పోటీలో ఉన్నా గంగావతిలో సొంత పార్టీ పెట్టిన గాలి జనార్దన్ రెడ్డి  విజయం సాధించారు.  సిద్దరామయ్యను సీఎం చేస్తే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆయన మద్దతు కాంగ్రెస్ కు అవసరం లేదు. గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ తరపున అనేక నియోజక వర్గాల్లో చాలా మంది పోటీ చేశారు.  బళ్లారిలో పోటీ చేసిన గాలి జనార్ధన్ రెడ్డి  భార్య లక్ష్మీ అరుణ ఓడిపోయారు. అయితే గట్టి పోటీ ఇచ్చారు.  వచ్చే ఎన్నికల్లో కేఆర్ పీ పార్టీ అభ్యర్థులు అందర్ని గెలిపించుకోవడానికి ఇప్పటి నుంచి తాను పని చేస్తానని గాలి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.                                            

తాను బెంగళూరులోని విధాన సౌధలో త్వరలోనే అడుగుపెడుతానని, తన నియోజక వర్గం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయని, ఏదో ఒకపార్టీకి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తే ప్రజలకే మంచిది అని గాలి జనార్దన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.  తాను బీజేపీ అనే ఇంటి నుంచి బయటకు వచ్చేశానని, ఆ ఇంటికి తనకు ఎలాంటి సంబంధం లేదని, బీజేపీ నాయకులకు దురంహకారం ఎక్కువ అయ్యిందని, అందుకే ఆ పార్టీకి ఈ పరిస్థితి ఎదురైయ్యిందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. అందరి ఉసురు తగిలి బీజేపీకి ఇలాంటి గతిపట్టిందని గాలి జనార్దన్ రెడ్డి శాపాలు పెడుతున్నారు.          

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget