అన్వేషించండి

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికిద్దాం? కాంగ్రెస్‌ చర్చలు ముమ్మరం!

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు భారీ క్యూ ఉంది. అందులో వడపోసి నలుగురు పేర్లను అధిష్ఠానానికి సిఫార్స్‌ చేస్తారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టికెట్ ఎవరికి ఇవ్వాలని చర్చ కాంగ్రెస్‌లో తీవ్రంగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఓ సమావేశం జరిగింది. ఇందులో పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్, ఉపఎన్నికల ఇన్‌ఛార్జ్ మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వ్యక్తిగత కారణంతో మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సమావేశానికి హాజరుకాలేదు. ఈ సందర్భంగా ఉపఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉంది. కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయే విషయంపై చర్చించారు. ముందుగా అభ్యర్థి ఎవరిని పెడితే ఎలా ఉంటుంది, కేంద్ర నాయకత్వానికి ఎవరి పేర్లు సిఫార్సు చేయాలనే విషయంపై కూడా మాట్లాడారు. 

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే విజయమని, సర్వేలు అనుకూలంగా ఉన్నాయని సహచర మంత్రులు, పీసీసీ చీఫ్‌కు ముఖ్యమంత్రి వివరించారు. స్థానిక నాయకులతో జాగ్రత్తగా సమన్వయం చేసుకొని పని చేస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచించారు. ప్రజాబలం, స్థానికుల అండ ఉన్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ఇన్‌ఛార్జ్ మంత్రులు, పీసీసీ చీఫ్‌కు దిశానిర్దేశం చేశారు. 

పోటీలో ఎవరెవరు?

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తున్న తొలి ఉప ఎన్నిక ఇది. అందుకే చాలా మంది ఆశావాహులు ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. గతంలో తృటిలో విజయానికి దూరమైన నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి కూడా పోటీలో ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మిగతా నాయకులు చాలామంది రేసులో ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న బలం, ఆర్థిక బలం, ప్రజల నుంచి మద్దతును పరిగణలోకి తీసుకొని వీళ్ల పేర్లు తుది జాబితాలో ఉన్నాయి. వీరి పేర్లను అధిష్ఠానానికి పంపించిన తర్వాత ఒకరు పేరు ఫైనల్ చేయనున్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి నాయకుడు కృషి చేయాలని ముఖ్యమంత్రి నేతలకు దిశానిర్దేశం చేశారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌  వల్ల జరిగిన నష్టాన్ని, కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని జనం ముందు చర్చకు పెట్టాలని ముఖ్యమంత్రి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనతో అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తూ రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తున్న పనులను వివరించాలని తెలిపారు. రాష్ట్ర నాయకుల నుంచి గల్లీ కార్యకర్త వరకు అందరూ సమన్వయంతో వెళ్తే భారీ మెజార్టీ వస్తుందని చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
Movie Ticket Rates : టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
Movie Ticket Rates : టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
Tamil Nadu Assembly Elections 2026: కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
IAF Wing Commander commits suicide: చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?
చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?
IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
Sensex tumbles: మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
Embed widget