అన్వేషించండి

Vizag News: విశాఖ తూర్పు వైసీపీలో ఏమి జరుగుతోంది..? ఆ నేతలు ఎందుకు దూరంగా ఉంటున్నారు?

Vishakhapatnam East : తూర్పు నియోజకవర్గ ఇన్చార్జిగా ఎంవీవీ సత్యనారాయణను నియమించిన తర్వాత ఆ పార్టీలోని కీలక నేతలు మౌనం దాల్చారు. ఈ వ్యవహారమే ఇప్పుడు కేడర్ ను ఆందోళనకు గురి చేస్తోంది.

Andhra Pradesh Elections 2024: సీఎం జగన్మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో వై నాట్‌ 175 నినాదంతో ముందుకు వెళుతున్నారు. అందుకు అనుగుణంగానే సర్వేలు చేయిస్తూ గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, వైసీపీలో నేతల మధ్య ఉన్న విభేదాలు పార్టీకి ముప్పు తెచ్చేలా కనిపిస్తున్నాయంటూ కేడర్‌ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నేతలు మధ్య విభేధాలు ఉన్న నియోజకవర్గాలు జాబితాలో విశాఖలోని తూర్పు నియోజకవర్గం ఒకటిగా చెబుతున్నారు. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు ప్రస్తుత విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. కానీ, ఈయనకు స్థానిక నేతలు ఆశించిన స్థాయిలో సహకారాన్ని అందించడం లేదన్న ప్రచారం ఉంది.

గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అక్కరమాని విజయ నిర్మల, ఆయన భర్త వెంకటరావు గడిచిన కొన్నాళ్లు నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. భీమిలిలో నిర్వహించిన తొలి సిద్ధం సభకు కూడా ఈ దంపతులు హాజరు కాలేదు. అలాగే, ఇదే నియోజకవర్గ పరిధిలో ఉంటున్న మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి దంపతులు కూడా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో అంటీ, ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఎంపీ ఎంవీవీని తూర్పు ఇన్‌చార్జ్‌గా నియమించిన తరువాతే వైసీపీలో కొన్నాళ్లు నుంచి ఉన్న ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్‌యాదవ్‌.. బయటకు వెళ్లిపోయి జనసేనలో చేరారు. ఈ వ్యవహారాలన్నీ తూర్పు వైసీపీలో కొంత ఇబ్బందికరంగా కనిపిస్తున్నట్టు కేడర్‌ చెబుతోంది. 

హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేకు ధీటైన అభ్యర్థిగా ఎంవీవీ

విశాఖ నగర పరిధిలోని తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వ్యవహరిస్తున్నారు. గడిచిన మూడు ఎన్నికల్లోనూ ఈయన ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఎమ్మెల్యే వెలగపూడి చేతిలో రెండు సార్లు వంశీకృష్ణ శ్రీనివాస్‌, ఒకసారి అక్కరమాని విజయనిర్మల ఓటమి చవి చూశారు. సిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడంతోపాటు ఎమ్మెల్యే వెలగపూడి వ్యక్తిగత ఇమేజ్‌ ఆయన విజయానికి దోహదం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వెలగపూడిని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధిష్టానం.. ఇందుకోసం బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా బలంగా ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఇక్కడ ఇన్‌చార్జ్‌గా నియమించింది.

పార్టీ అప్పగించిన బాధ్యతలు మేరకు ఎంవీవీ సత్యనారాయణ తొలి రోజు నుంచే క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ కేడర్‌ను కూడా తన వెంట నడిచేలా చేస్తున్నారు. కానీ, ఇంటి పోరు ఆయనకు ఎంత వరకు ఇబ్బందిని కలిగిస్తుందన్నది తెలియడం లేదు. మొన్నటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న వెలగపూడి, వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఇప్పుడు ఒకే వేదికపైకి (కూటమి) చేరినట్టు అయింది. వీరిద్దరిని తట్టుకుని ఢీ కొట్టడం ఎంవీవీ సత్యనారాయణకు అంత సులభమేమీ కాదు. కానీ, వైసీపీ ప్రభుత్వం చేసిన మేలు కలిసి వస్తుందని ఆయన చెబుతున్నారు. ఎమ్మెల్యే వెలగపూడి మాదిరిగానే ప్రజలతో మమేకం కావడం, అందరికీ అందుబాటులో ఉంటాడన్న పేరు తెచ్చుకోవడం కూడా ఎంపీకి కలిసి వస్తుందని చెబుతున్నారు. 

ఆ నేతల ఆలోచన ఏమిటి..?

తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను నియమించినప్పటి నుంచి నిరాశలో కూరుకుపోయారు ఇక్కడి తాజా మాజీ ఇన్‌చార్జ్‌ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి. ఈ ముగ్గురు నేతలు వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. కానీ, అధిష్టానం నుంచి ఆ దిశగా హామీ లభించకపోవడంతోపాటు ఎంపీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్‌ పార్టీ మారిపోయారు. పార్టీలోనే ఉన్నప్పటికీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న అక్కరమాని దంపతులు, మేయర్‌ దంపతులు మాత్రం మధ్యస్తంగా మెలుగుతూ రాజకీయాలను నెరుపుకుంటూ పోతున్నారు. తూర్పులో కాకపోయినా గాజువాకలో అయినా అవకాశం ఇవ్వాలని మేయర్‌ దంపతులు అధిష్టానాన్ని కోరుతున్నారు. విశాఖ నగరంలో కీలకమైన తూర్పు నియోజకవర్గంలో వైసీపీలో నెలకొన్న అసంతృప్తులను అధిష్టానం ఎంత వరకు సమసిపోయేలా చేస్తుందో.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
West Bengal Election 2026: బెంగాల్ ఫైట్: మైనారిటీ ఓట్లతో దీదీ, పంచముఖ వ్యూహంతో మోదీ!
బెంగాల్ ఫైట్: మైనారిటీ ఓట్లతో దీదీ, పంచముఖ వ్యూహంతో మోదీ!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Embed widget