అన్వేషించండి

వసుంధర రాజేకు దియాకుమారి ప్రత్యామ్నాయం అవుతారా? - రాజస్థాన్ లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు

Rajasthan Elections: వసుంధరా రాజేకు ప్రత్యామ్నాయంగా దియా కుమారిని చూపించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న వసుంధరా రాజేకు రెండో జాబితాలో చోటు కల్పించింది.

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. నవంబరు 25న పోలింగ్, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్నాయి. ప్రత్యర్థిని మట్టికరిపించి అధికారంలోకి రావడమే ధ్యేయంగా పని చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వసుంధరా రాజేకు ప్రత్యామ్నాయంగా దియా కుమారిని చూపించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న వసుంధరా రాజేకు రెండో జాబితాలో చోటు కల్పించింది. ఆమె మద్దతుదారుల్లో కొందరికి సీటు కేటాయించింది. వసుంధర రాజేను పక్కన పెట్టడం ద్వారా ఏర్పడిన ఖాళీని భర్తీ చేసుకునేందుకే, రాజవంశానికి చెందిన దియా కుమారిని అందలమెక్కిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వ్యూహం మార్చిన కమలం పార్టీ

రాజ్‌సమంద్‌ లోక్‌సభ స్థానం గెలుపొందిన దియా కుమారిని కమలం పార్టీ అధిష్ఠానం అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపింది. దియాకుమారిని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపడం వెనుక బీజేపీ పెద్ద వ్యూహామే రచించింది. ప్రతిష్ఠాత్మక విద్యాధర్‌ నగర్‌ స్థానం నుంచి పోటీకి నిలిపింది. 2018 ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాలకు తొలి విడతగా అభ్యర్థులను ప్రకటించింది. 40 చోట్ల పరాజయం పాలైంది. రాజసమంద్ అసెంబ్లీలో మాత్రమే ఘన విజయం సాధించింది. ఆ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన నర్పత్‌ సింగ్‌ రజ్వీ 30 వేల ఓట్ల ఆధిక్యం సాధించారు. రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్‌ సింగ్‌ షెకావత్‌కు రజ్వీ స్వయానా అల్లుడు. ప్రస్తుతం వసుంధరా రాజే వర్గంలో ఆయన కీలకనేతగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వ్యక్తిని కాదని, బీజేపీకి కంచుకోటగా ఉన్న ఆ స్థానాన్ని దియా కుమారికి కేటాయించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

అనుభవం లేకపోయినా..!

వసుంధరా రాజే, దియా కుమారి ఇద్దరూ ప్రముఖ రాజకుటుంబాల నుంచి వచ్చిన వారే. అయితే రాజేకు ఉన్న రాజకీయ అనుభవం దియా కుమారికి లేదు. దియాకుమారి ఇప్పటి వరకు కేవలం రెండు ఎన్నికల్లో మాత్రమే పోటీ చేశారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె, వ్యక్తిగత కారణాలతో 2018 అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాజసమంద్ స్థానం నుంచి  లోక్‌సభ ఎంపీగా విజయం సాధించారు. తాజాగా మళ్లీ  విద్యాధర్‌ నగర్‌ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు. అపార అనుభవం ఉన్న రాజేను పక్కన పెట్టి, పెద్దగా రాజకీయ అనుభవం లేని దియాకు ప్రాధాన్యత ఇవ్వడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది.

వసుంధర వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత

బీజేపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై వసుంధరా రాజే వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భైరాన్‌ సింగ్‌ షెకావత్‌ వారసత్వాన్ని కమలం పార్టీ అగ్రనేతలు చులకనగా చూస్తున్నారంటూ రజ్వీ విమర్శలు ఎక్కుపెట్టారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసిన షెకావత్‌ను అవమానిస్తున్నారంటూ నర్పత్‌ సింగ్‌ రజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మొహం పెట్టుకొని షెకావత్‌ శతవసంతాల వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని రజ్వీ ఘాటు వ్యాఖ్యలు సంధిస్తున్నారు.  ఏ అర్హతతో ఆ స్థానాన్ని దియా కుమారికి ఆ స్థానాన్ని కట్టబెట్టారని ప్రశ్నలు సంధించారు. అధిష్ఠానంతో విభేదాల నేపథ్యంలో గత కొన్నాళ్లుగా వసుంధర రాజేను బీజేపీ పక్కన పెట్టింది. ఆమెకు ప్రత్యామ్నాయంగా ప్రముఖ రాజ కుటుంబానికి చెందిన దియా కుమారిని తెరమీదకు తీసుకొచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా దియాకుమారిని అసెంబ్లీ బరిలోకి దింపడంతో, వసుంధర రాజే వర్గం అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Anti Cancer Drug:జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
India vs Sri Lanka Highlights: మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
Embed widget