అన్వేషించండి

Ap High Court: పోస్టల్ బ్యాలెట్ అంశంపై పిటిషన్ - వైసీపీకి హైకోర్టులో చుక్కెదురు, సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన!

Andhra Pradesh News: పోస్టల్ బ్యాలెట్ అంశానికి సంబంధించి వైసీపీకి హైకోర్టులో చుక్కెదురైంది. ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

Ap High Court Dismissed Ysrcp Petition On Postal Ballot Issue: పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) చెల్లుబాటుపై సీఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు (AP High Court) తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓటు సీల్ చేయకున్నా కౌంటింగ్ కు అర్హత ఉందన్న ఎన్నికల సంఘం ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు వీల్లేదని, పిటిషనర్‌కు అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలన్న ఈసీ తరఫు న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే ఎన్నికలు ముగిశాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకునేందుకు స్వేచ్ఛనిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు శనివారం తీర్పు వెలువరించింది.

వైసీపీ అభ్యంతరం ఏంటంటే.?

ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించి 'ఫాం - 13ఏ'పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, ఆయన పేరు, హోదా, సీల్ (అధికారిక ముద్ర) లేకపోయినా అలాంటి పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో వాటిని పరిగణలోకి తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వీటిని సవాల్ చేస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ఇరువర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును శనివారం వెలువరించింది.

ఈసీ వాదనేంటి అంటే.?

'ఎన్నికల ప్రక్రియ సాగుతుండగా ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేయడానికి వీల్లేదు. ఈ దశలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. అధికరణ 329(బి) ప్రకారం ఎన్నికలు సవాల్ చేయాలంటే కేవలం ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే సాధ్యం. ఎలాంటి సందర్భాల్లో ఎన్నిక చెల్లుబాటు కాదో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 100 స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో ఈ పిటిషన్ కు అర్హత లేదు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద అటెస్టింగ్ అధికారిని రిటర్నింగ్ అధికారే నియమించారు. ఫాం 13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుంది. ఆ అధికారి పేరు, హోదా, సీల్ ఉండాల్సిన అవసరం లేదు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అంతా వీడియో రికార్డైంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఫాం 13ఏ పై మాత్రం ఆర్ఓ నియమించిన అధికారే అటెస్టేషన్ చేశారు. ఈ క్రమంలో దీనిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు' అని ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు.

వైసీపీ వాదనేంటి అంటే.?

'ఏపీలో సుమారు 5.5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. గెలుపోటములను నిర్ణయించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, ఆయన పేరు, హోదా, సీలు లేకపోయినా పరవాలేదంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్స్ చెల్లుబాటు నిబంధనలు మార్చే అధికారం ఈసీకి లేదు. ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల నిబంధనలు సవరించడానికి వీల్లేదు. ఎన్నికల నిర్వహణ నిబంధనలకు విరుద్దంగా ఈసీ చర్యలున్నాయి. ఈపీ దాఖలు చేసుకోవాలన్న ఈసీ వాదన సరికాదు. ఎన్నికల సంఘం ఉత్తర్వులు నిలిపేయాలి.' అని పిటిషనర్ అప్పిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. అయితే, హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget