అన్వేషించండి

పార్టీల తాత్కాలిక హెడ్‌ఆఫీస్‌గా మునుగోడు- పల్లెల్లో పొలిటికల్ హీట్

రాజకీయవర్గాల్లో ఒకటే చర్చ. మునుగోడు ఉపఎన్నిక గురించే. మునుగోడుకు ఎప్పుడెప్పుడు ఏ ఏ పెద్దలు వస్తున్నారు. ఏం కబుర్లు చెబుతారు అన్న మాటలు హాట్‌ హాట్‌ గా వినిపిస్తున్నాయి.

మునుగోడు ఉపఎన్నిక నవంబర్‌ 3న జరగనుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయడంతోపాటు ప్రచారాన్ని కూడా తీవ్ర చేశాయి. ప్రస్తుతం మునుగోడులో ఎన్నికల పండగ వాతావరణం నెలకొంది. ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలతో మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల కళ సంతరించుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక తథ్యమని తేలడంతో ఒక్కసారిగా అందరిచూపు మునుగోడుపై పడింది. అప్పటి నుంచి మొదలైన హడావుడి ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో వేడి ఒక్కసారిగా పెరిగింది. దీనికి తోడు నిన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న బీఆర్‌ఎస్ కూడా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో మునుగోడు ఉపఎన్నిక పోరు మరింత రసవత్తరంగా మారింది.

జాతీయపార్టీగా టీఆర్‌ఎస్‌ మారిన తర్వాత జరుగుతున్న తొలి ఉపఎన్నిక కావడంతో ఆపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే కెసిఆర్‌ మునుగోడులో గెలుపు కోసం సూపర్‌ ప్లాన్‌ వేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వపథకాలు, అభివృద్ధిపై విమర్శలు చేస్తోన్న ప్రతిపక్షాలకు సమాధానం చెప్పేలా మునుగోడు నియోజకవర్గంలో లబ్ది పొందుతున్న దాదాపు 4లక్షల మందికి కెసిఆర్‌ స్వయంగా లేఖలు రాయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 30న చుండూరులో జరగనున్న భారీ బహిరంగ సభలో కెసిఆర్‌ పాల్గొననున్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ఈ సభ జరగనుంది. ఈ సభ ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు కెసిఆర్‌ దీటైన సమాధానం ఇవ్వనున్నారని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్ట్‌ మొదటి వారంలో ప్రజాదీవెన సభ మునుగోడు నిర్వహించారు. ఇక ప్రతి ఎంపీటీసీ పరిధిలో ఒక ఎమ్మెల్యేను టీఆర్ఎస్ పార్టీ ఇన్ ఛార్జీలుగా రంగంలోకి దింపింది. వారు క్ష్రేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు.  కేటిఆర్‌, హరీశ్‌ రావు కూడా రోడ్‌ షో ద్వారా మునుగోడు ప్రజలకు బీఆర్‌ ఎస్‌ ని గెలిపించమని కోరనున్నారట.

ఇంకోవైపు బీజేపీ కూడా మునుగోడులో కెసిఆర్‌ బహిరంగ సభకు దీటుగా ప్రజాసభని నిర్వహించాలని ప్లాన్‌ చేస్తోందట. ఈ సభకు జాతీయ అధ్యక్ష్యుడు జేపీ నడ్డా వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సభ ద్వారా మరోసారి తెలంగాణ సిఎం కెసిఆర్‌ తీరును ప్రజలకు వివరించబోతున్నారట. కాంగ్రెస్‌ కూడా ఈ రెండు పార్టీలకు దీటుగా బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తోందట. రాహుల్‌ గాంధీ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించనున్న సందర్భంగా ఆయన్ని కూడా మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేలా చేయాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారట. 

ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది మునుగోడు నియోజకవర్గానికి నేతల వరద పారుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో పెద్ద నేతలు ఓటర్ల ఇంటి బాట పట్టారు. ఒక్కో ఓటు చాలా కీలకం కానుండటంతో ప్రతి ఓటర్ను టచ్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ 20 రోజులు నేతల హామీల మాటలు, తియ్యటి కబుర్లు వినాల్సిందేనని మునుగోడు ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే చైతన్యవంతమైన నియోజకవర్గం అనుకున్న మునుగోడులో తీర్పు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో మునుగోడు ఓటర్లను మెప్పించేందుకు ఆయాపార్టీల పెద్దలు రంగంలోకి దింపడమే కాకుండా వారి చేత స్వీట్ స్వీట్ మాటాలు కూడా కూయిస్తోంది మునుగోడు ఉపఎన్నిక.

మునుగోడు బై పోల్ కు నవంబర్‌ 3వ తేదీన పోలింగ్‌, 6 తేదీన కౌంటింగ్‌ జరగనుంది. ఈ గెలుపుని సెమిఫైనల్‌ గా భావిస్తోన్న ప్రధాన పార్టీలు గెలుపు మీద అంతే ధీమాగా ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget