అన్వేషించండి

పార్టీల తాత్కాలిక హెడ్‌ఆఫీస్‌గా మునుగోడు- పల్లెల్లో పొలిటికల్ హీట్

రాజకీయవర్గాల్లో ఒకటే చర్చ. మునుగోడు ఉపఎన్నిక గురించే. మునుగోడుకు ఎప్పుడెప్పుడు ఏ ఏ పెద్దలు వస్తున్నారు. ఏం కబుర్లు చెబుతారు అన్న మాటలు హాట్‌ హాట్‌ గా వినిపిస్తున్నాయి.

మునుగోడు ఉపఎన్నిక నవంబర్‌ 3న జరగనుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయడంతోపాటు ప్రచారాన్ని కూడా తీవ్ర చేశాయి. ప్రస్తుతం మునుగోడులో ఎన్నికల పండగ వాతావరణం నెలకొంది. ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలతో మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల కళ సంతరించుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక తథ్యమని తేలడంతో ఒక్కసారిగా అందరిచూపు మునుగోడుపై పడింది. అప్పటి నుంచి మొదలైన హడావుడి ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో వేడి ఒక్కసారిగా పెరిగింది. దీనికి తోడు నిన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న బీఆర్‌ఎస్ కూడా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో మునుగోడు ఉపఎన్నిక పోరు మరింత రసవత్తరంగా మారింది.

జాతీయపార్టీగా టీఆర్‌ఎస్‌ మారిన తర్వాత జరుగుతున్న తొలి ఉపఎన్నిక కావడంతో ఆపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే కెసిఆర్‌ మునుగోడులో గెలుపు కోసం సూపర్‌ ప్లాన్‌ వేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వపథకాలు, అభివృద్ధిపై విమర్శలు చేస్తోన్న ప్రతిపక్షాలకు సమాధానం చెప్పేలా మునుగోడు నియోజకవర్గంలో లబ్ది పొందుతున్న దాదాపు 4లక్షల మందికి కెసిఆర్‌ స్వయంగా లేఖలు రాయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 30న చుండూరులో జరగనున్న భారీ బహిరంగ సభలో కెసిఆర్‌ పాల్గొననున్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ఈ సభ జరగనుంది. ఈ సభ ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు కెసిఆర్‌ దీటైన సమాధానం ఇవ్వనున్నారని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్ట్‌ మొదటి వారంలో ప్రజాదీవెన సభ మునుగోడు నిర్వహించారు. ఇక ప్రతి ఎంపీటీసీ పరిధిలో ఒక ఎమ్మెల్యేను టీఆర్ఎస్ పార్టీ ఇన్ ఛార్జీలుగా రంగంలోకి దింపింది. వారు క్ష్రేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు.  కేటిఆర్‌, హరీశ్‌ రావు కూడా రోడ్‌ షో ద్వారా మునుగోడు ప్రజలకు బీఆర్‌ ఎస్‌ ని గెలిపించమని కోరనున్నారట.

ఇంకోవైపు బీజేపీ కూడా మునుగోడులో కెసిఆర్‌ బహిరంగ సభకు దీటుగా ప్రజాసభని నిర్వహించాలని ప్లాన్‌ చేస్తోందట. ఈ సభకు జాతీయ అధ్యక్ష్యుడు జేపీ నడ్డా వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సభ ద్వారా మరోసారి తెలంగాణ సిఎం కెసిఆర్‌ తీరును ప్రజలకు వివరించబోతున్నారట. కాంగ్రెస్‌ కూడా ఈ రెండు పార్టీలకు దీటుగా బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తోందట. రాహుల్‌ గాంధీ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించనున్న సందర్భంగా ఆయన్ని కూడా మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేలా చేయాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారట. 

ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది మునుగోడు నియోజకవర్గానికి నేతల వరద పారుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో పెద్ద నేతలు ఓటర్ల ఇంటి బాట పట్టారు. ఒక్కో ఓటు చాలా కీలకం కానుండటంతో ప్రతి ఓటర్ను టచ్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ 20 రోజులు నేతల హామీల మాటలు, తియ్యటి కబుర్లు వినాల్సిందేనని మునుగోడు ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే చైతన్యవంతమైన నియోజకవర్గం అనుకున్న మునుగోడులో తీర్పు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో మునుగోడు ఓటర్లను మెప్పించేందుకు ఆయాపార్టీల పెద్దలు రంగంలోకి దింపడమే కాకుండా వారి చేత స్వీట్ స్వీట్ మాటాలు కూడా కూయిస్తోంది మునుగోడు ఉపఎన్నిక.

మునుగోడు బై పోల్ కు నవంబర్‌ 3వ తేదీన పోలింగ్‌, 6 తేదీన కౌంటింగ్‌ జరగనుంది. ఈ గెలుపుని సెమిఫైనల్‌ గా భావిస్తోన్న ప్రధాన పార్టీలు గెలుపు మీద అంతే ధీమాగా ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
Arvind Kejriwal: గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
AP Local Body Elections: స్థానిక పోరుకు కూటమి వ్యూహాలు. విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కీలక భేటీ
స్థానిక పోరుకు కూటమి వ్యూహాలు. విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కీలక భేటీ
Janasena Coordination Committees: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
Navya Swamy: ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
Embed widget