అన్వేషించండి

Telangana University: తెలంగాణ వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా వాకాటి కరుణ నియామకం!

తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌గా విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా కమిషనర్‌ వాకాటి కరుణను నియమిస్తూ.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (జులై 14న) ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ విశ్వవిద్యాలయం(టీయూ)లో గత రెండేళ్ల కుంటుపడిన పరిపాలనను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌గా విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా కమిషనర్‌ వాకాటి కరుణను నియమిస్తూ.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (జులై 14న) ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత కాలం వీసీగా పనిచేసిన డాక్టర్‌ రవీందర్‌ గుప్తా, ఓ ప్రైవేటు కళాశాలకు పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేయడానికి రూ.50 వేలు లంచం తీసుకుంటూ జూన్‌ 17న ఏసీబీకి పట్టుబడి, జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి వీసీ లేకపోవడంతో వర్సిటీలో కార్యకలాపాలు స్తంభించడం, ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపులో ఇబ్బందులు వస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త వీసీని నియమించే వరకూ ఆమె ఆ హోదాలో కొనసాగనున్నారు. అయితే దాదాపు నెల రోజులు జైల్లో ఉన్న రవీందర్‌ గుప్తా బెయిల్‌పై విడుదలైన రోజే వాకాటి కరుణను ఇంచార్జి వీసీగా నియమించడం గమనార్హం. టీయూ ఇన్‌చార్జి వీసీగా ఐఏఎస్‌ అధికారి నియమితులవ్వడం ఇది ఐదోసారి.

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణను ఇన్‌చార్జి వీసీగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో టీయూలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. వీసీ రవీందర్‌ తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోగా అవినీతి, అక్రమాలతో అరెస్టు కావడంతో ఆయనను సర్వీసుల నుంచి తప్పించింది. వీసీని అవినీతి కేసులో బాధ్యతల నుంచి తప్పించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. వాకాటి కరుణ నేతృత్వంలో పరిపాలనను చక్కబెట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈసీ మీటింగ్‌లకు వీసీ హోదాలో రవీందర్‌గుప్తా డుమ్మా కొట్టిన సందర్భాల్లో వాకాటి కరుణ అధ్యక్షతన పాలకవర్గ సమావేశాలు జరిగాయి. టీయూలో జరిగిన ప్రతి అంశంపై విద్యా శాఖ కార్యదర్శిగా పూర్తిస్థాయిలో ఆమెకు అవగాహన ఉండడంతో కీలక బాధ్యతలను సర్కారు కట్టబెట్టింది.

టీయూకు వీసీలుగా ఉన్నది వీరే..

➥ టీయూకు తొలి వీసీగా సులేమాన్‌ సిద్ధిఖీ 3 నెలలపాటు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 4 నెలలు పాటుగా సులోచనారెడ్డి పనిచేశారు. 

➥ ఆ తర్వాత శాశ్వత వీసీగా కాశీరామ్‌ 2006, నవంబర్‌ 6న బాధ్యతలు స్వీకరించి 2009 నవంబర్‌ 3 వరకు అత్యధిక కాలం పనిచేశారు. ఆయన ఉద్యోగ విరమణ తర్వాత ఎన్‌.లింగమూర్తికి ఇన్‌చార్జిగా బాధ్యతలివ్వగా ఏడాదిపాటు పనిచేశారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తిరుపతి రావు ఇన్‌చార్జిగా 3 నెలలపాటు విధులు నిర్వహించారు. అనంతరం 6 నెలలు వి.గోపాల్‌రెడ్డి ఇన్‌చార్జిగానే విధులు నిర్వహించారు.

➥ అక్బర్‌ అలీఖాన్‌ను 2011, జూలై 15న ప్రభుత్వం వీసీగా నియమించగా 2014 జూలై 14 వరకు పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఆరు నెలలపాటు ఐఏఎస్‌ శైలజా రామయ్యర్‌ పని చేసిన తర్వాత రెండేండ్ల పాటు ఐఏఎస్‌ పార్థసారథి సైతం ఇన్‌చార్జి వీసీగా విధుల్లో చేరారు. 

➥ ప్రభుత్వం 2016, జూలై 25న పి.సాంబయ్యను వీసీగా నియమించింది. ఆయన 2019, జూలై 24న ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం ఐఏఎస్‌ అధికారుల వి.అనిల్‌ కుమార్‌ ఆరు నెలలు, నీతూ కుమారి ప్రసాద్‌ ఏడాదిన్నర కాలంపాటు పని చేసిన తర్వాత 2021, మే 22న రవీందర్‌ గుప్తాను ప్రభుత్వం వీసీగా నియమించింది. 

➥ ఏసీబీ కేసుల నేపథ్యంలో ఆయనను బాధ్యతల నుంచి తప్పించడంతో తాజాగా ఐఏఎస్‌ అధికారిణి వాకాటి కరుణ ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 14 మంది వీసీలుగా నియమితులైతే ముగ్గురు రెగ్యులర్‌ ప్రాతిపదికన ఉన్నారు. మిగిలిన వారంతా ఇన్‌చార్జి వీసీలుగానే కొనసాగగా ఇందులో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులున్నారు.

టాప్ హెడ్ లైన్స్

NEET JEE Weightage Changes: NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
NEET UG 2026 Result: నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ ఫలితాలు జూలై 20 నాటికి విడుదల! ఎంబిబిఎస్ అడ్మిషన్లు, కొత్త సెషన్స్‌పై కీలక ప్రకటన!
నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ ఫలితాలు జూలై 20 నాటికి విడుదల! ఎంబిబిఎస్ అడ్మిషన్లు, కొత్త సెషన్స్‌పై కీలక ప్రకటన!
CBSE Parenting Calendar 2026: సీబీఎస్ఈ కొత్త పేరెంటింగ్ క్యాలెండర్‌ విడుదల! 2026-27 విద్యా సంవత్సరంలో వచ్చే మార్పులు ఇవే! 
సీబీఎస్ఈ కొత్త పేరెంటింగ్ క్యాలెండర్‌ విడుదల! 2026-27 విద్యా సంవత్సరంలో వచ్చే మార్పులు ఇవే! 

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget