అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

UGC NET 2023: యూజీసీ నెట్- 2023 దరఖాస్తుకు రేపటితో ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించనున్న యూజీసీ నెట్ (డిసెంబరు)-2023 ఆన్‌లైన్ దరఖాస్తు గడువు అక్టోబరు 28తో ముగియనుంది.

దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించనున్న యూజీసీ నెట్ (డిసెంబరు)-2023 ఆన్‌లైన్ దరఖాస్తు గడువు అక్టోబరు 28తో ముగియనుంది. అయితే అక్టోబరు 29న రాత్రి 12 గంటల్లోపు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రకటించిన షెడ్యూలు డిసెంబరు 6 నుంచి 22 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుంది. మొదటి షిఫ్టులో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్టులో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

వివరాలు..

* యూజీసీ నెట్ - డిసెంబరు 2023

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: జేఆర్‌ఎఫ్ పోస్టులకు 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్-రూ.1,150; ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(నాన్-క్రిమిలేయర్)-రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్-రూ.325 చెల్లించాలి.

పరీక్ష విధానం..

➥ ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.

➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్. 

ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు-చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడురు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తూర్పుగోదావి-సూరంపాలెం, పశ్చిమగోదావరి-తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ముఖ్యమైన తేదీలివే..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 30.09.2023.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 28.10.2023 (5.00 PM) 

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 29.10.2023 (11.50 PM) 

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 30 - 31.10.2023 (11.50 PM) 

➥ ఎగ్జామ్ సిటీ వివరాల వెల్లడి: నవంబరు చివరి వారంలో.

➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: డిసెంబరు మొదటి వారంలో.

➥ యూజీసీ నెట్-డిసెంబరు 2023 పరీక్షలు: 06.12.2023 - 22.12.2023. 

➥ ఆన్సర్ కీ వెల్లడి: తర్వాత తెలియజేస్తారు.

Notification

Online Application

Website

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Blast Case Update : ఉగ్ర కుట్ర భగ్నంతో దుబాయ్‌ పారిపోయేందుకు షాహీన్‌ ప్లాన్- పసిగట్టి ముందే అరెస్టు చేసిన అధికారులు 
ఉగ్ర కుట్ర భగ్నంతో దుబాయ్‌ పారిపోయేందుకు షాహీన్‌ ప్లాన్- పసిగట్టి ముందే అరెస్టు చేసిన అధికారులు 
Deputy CM Pawan Kalyan : పిఠాపురంలో మరోసారి భూమి కొనుగోలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! ఏం చేయబోతున్నారు?
పిఠాపురంలో మరోసారి భూమి కొనుగోలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! ఏం చేయబోతున్నారు?
Telangana High Court website hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
Bappm TV: I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు -కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు-కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
Advertisement

వీడియోలు

India vs South Africa | కోల్‌కత్తా టెస్టులో బుమ్రా అదిరిపోయే పర్ఫామెన్స్
Vaibhav Suryavanshi Asia Cup Rising Stars 2025 | వైభవ్ సెంచరీ.. బద్దలయిన వరల్డ్ రికార్డ్
Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Blast Case Update : ఉగ్ర కుట్ర భగ్నంతో దుబాయ్‌ పారిపోయేందుకు షాహీన్‌ ప్లాన్- పసిగట్టి ముందే అరెస్టు చేసిన అధికారులు 
ఉగ్ర కుట్ర భగ్నంతో దుబాయ్‌ పారిపోయేందుకు షాహీన్‌ ప్లాన్- పసిగట్టి ముందే అరెస్టు చేసిన అధికారులు 
Deputy CM Pawan Kalyan : పిఠాపురంలో మరోసారి భూమి కొనుగోలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! ఏం చేయబోతున్నారు?
పిఠాపురంలో మరోసారి భూమి కొనుగోలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! ఏం చేయబోతున్నారు?
Telangana High Court website hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
Bappm TV: I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు -కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు-కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న..  క్రికెటర్ శ్రీ చరణీ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. క్రికెటర్ శ్రీ చరణీ
Adilabad Tigers Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
IPL 2026: సీఎస్కేలోకి సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్‌లోకి జడేజా, సామ్ కర్రన్‌
సీఎస్కేలోకి సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్‌లోకి జడేజా, సామ్ కర్రన్‌
Visakhapatnam CII Partnership Summit: అనంతపురం జిల్లాలో రేమాండ్ ప్రాజెక్టులు- విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం
అనంతపురం జిల్లాలో రేమాండ్ ప్రాజెక్టులు- విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం
Embed widget