By: ABP Desam | Updated at : 06 Apr 2022 01:42 PM (IST)
జేఈఈ మెయిన్ ఎగ్జామ్ వాయిదా కోసం ఉద్యమం
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ 2022 పరీక్ష ఈ నెలలో నిర్వహించనున్నారు. ఇదే ఇప్పుడు విద్యార్థులను భయపెడుతోంది. సీబీఎస్ఈ పరీక్షల టైంలోనే ఈ పరీక్ష కూడా ఉండటంతో విద్యార్థల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
#JEEStudentsWantJustice #PostponeJEEMain2022 #JEEMainsAfterBoards2022
— Rakshita Runa (@RakshitaRuna) April 5, 2022
Plzzz help us atleast try to understand our situation 🙏🙏 @DG_NTA @dpradhanbjp @EduMinOfIndia @PMOIndia
It's a big request! https://t.co/xu7kX3lM1B
సీబీఎస్ఈ ఇంటర్ రెండో టెర్మ్ పరీక్షలను ఏప్రిల్ 26 నుంచి జూన్ 15 వరకు జరపనుంది. ఎన్టీఏ కూడా ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపైనే విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రెండు పరీక్షలు ఒకే టైంలో నిర్వహించడంపై సోషల్ మీడియాలో తీవ్రంమైన చర్చ నడుస్తోంది. విద్యాశాఖ మంత్రికి, ఎన్టీఏకు విన్నపాలు చేస్తున్నారు. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ వాయిదా వేయాలని కోరుతున్నారు.
#JEEStudentsWantJustice#JEEMainsAfterBoards2022#PostponeJEEMain2022#NTAHelpJeeMainsStudent https://t.co/sTLnhq0Lve
— Anjana Shrivastava (@AnjanaS20245376) April 5, 2022
దీన్ని ఓ ఉద్యమంలా తీసుకెళ్తున్నారు. దీంతో #PostponeJEEMain2022హ్యాస్టాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఈ రెండు పరీక్షల మధ్య సరిపడా గ్యాపర్ ఉండాలని కోరుతున్నారు విద్యార్థులు. సీబీఎస్ఈ, ఎన్టీఏ మాట్లాడుకొని ఓ నిర్ణయానికి రావాలని సూచిస్తున్నారు.
ఇలాంటి కీలకమైన పరీక్షలను అధికారులు చాలా క్లిష్టతరం చేస్తున్నారని అందుకే చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. కాస్త ఆలస్యమైతే పరీక్షలకు ఎలాంటి ముప్పు ఉండదని... ఇలా చేస్తే మాత్రం విద్యార్థులు పిచ్చెక్కిపోతారని అంటున్నారు. ఈ టెన్షన్లో మార్కులు రాకపోతే చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉందని హెచ్చరించారు విద్యార్థులు.
#JEEStudentsWantJustice #PostponeJEEMain2022 #JEEAfterBoards2022 @DG_NTA @dpradhanbjp @PMOIndia @EduMinOfIndia please postpone the exams! Listen to us 🙏🙏🙁 https://t.co/PRood175Z4
— Rakshita Runa (@RakshitaRuna) April 5, 2022
ఈ వివాదంపై ఫన్నీ ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. సీరియస్గా నడుస్తున్న టాపిక్కు హాస్యం జోడించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మరికొందరు విద్యార్థులు.
Literally situation of jee aspirants right now #PostponeJEEMains2022#NTAHelpJeeMainsStudents #JEEStudentsWantJustice @supersiri20 @IITianpragyan @ark_tara pic.twitter.com/hpN12EtbsZ
— Aman Gupta (@Amanguptaonline) April 5, 2022
జేఈఈ మెయిన్స్ పరీక్షకు సంబందించిన షెడ్యూల్ను గత నెలలోనే ఎన్టీఏ విడుదల చేసింది. అది జరిగిన కొన్ని రోజులకే సీబీఎస్ఈ పరీక్ష షెడ్యూల్ వచ్చింది. దీంతో ఈ రెండు పరీక్షలపై విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది.
Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు
TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే
Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు
Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు
Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు
KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్లో ప్రకటించిన కేటీఆర్
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్లో బిగ్ డీల్
Heart Failure: పెళ్లి కాని వ్యక్తులు గుండె వైఫల్యంతో మరణించే ప్రమాదం ఎక్కువ, కొత్త పరిశోధన ఫలితం
Thank You: 'థాంక్యూ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?