By: ABP Desam | Updated at : 19 Aug 2023 11:53 PM (IST)
Edited By: omeprakash
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్
తెలంగాణలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 19న ప్రారంభమైంది. ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు 19 నుంచి డిసెంబర్ 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. 2023 - 24 విద్యా సంవత్సరంలో కొత్తగా ఉపకార వేతనాల కోసం, రెన్యువల్ చేసుకునే వారు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు ఉపకారవేతనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పోర్టల్లో కళాశాలలు, విద్యార్థులకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
అర్హతలు..
తెలంగాణ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారు కింది అర్హతలు కలిగి ఉండాలి.
స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేయడానికి క్రింది పత్రాలు అవసరం: -
ALSO READ:
పేద బాలికల చదువుకు ఇన్ఫోసిస్ చేయూత, 'స్టెమ్ స్టార్స్' స్కాలర్షిప్ ద్వారా రూ.100 కోట్ల సాయం
దేశంలో బలహీన వర్గాలకు చెందిన బాలికల విద్య కోసం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా బాలికలకు ఉపకారవేతనాలను అందించనుంది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టెమ్ స్టార్స్ (STEM Stars) పేరుతో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించనుంది.
ఈ స్కాలర్షిప్ల ద్వారా బాలికల చదువుకు ఆర్థిక సాయం అందుతుందని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపింది. ‘ఆడపిల్లల చదువు వారి పిల్లల జీవితంపై ప్రభావం చూపుతుంది. అందుకే మేం 'స్టెమ్ స్టార్స్' స్కాలర్షిప్ను తీసుకొచ్చినట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్పష్టం చేసింది. బాలికల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అవసరమైన ట్యూషన్ ఫీజు, వసతి ఖర్చులు, స్టడీ మెటీరియల్ ఇలా.. అన్నింటికీ కలిపి ఏడాదికి లక్ష రూపాయలు.. నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయాన్ని అందిస్తామని వెల్లడించింది.
స్టెమ్ స్టార్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ మొదటి దశలో భాగంగా 2,000 మందికి పైగా బాలికల చదువుకు చేయూత అందించనుంది. దేశంలోని ప్రముఖ కళాశాలల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం ఏ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించినా.. ఫౌండేషన్ ద్వారా ఆర్ధికసాయం పొందుతారు. తొలి ఏడాదిలో ఐఐటీ, బిట్స్ పిలానీ, ఎన్ఐటీతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ గుర్తింపు పొందిన ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో చదవాలనుకున్న విద్యార్థులకు సహకారం అందించనున్నట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుమిత్ విర్మనీ తెలిపారు.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్-2023 నోటిఫికేషన్, పరీక్ష ఎప్పుడంటే?
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్షిప్గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్షిప్ అందుతుంది. ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే!
Paper Pens: ఏపీలో వెరైటీగా పేపర్ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా
TS ICET: ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం - అందుబాటులో 10,762 సీట్లు
KNRUHS: కటాఫ్ స్కోర్ తగ్గించిన కేంద్రం, మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్
MANAGE: మేనేజ్లో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సు, వివరాలు ఇలా
Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్ఇండియా టార్గెట్ 279
ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు
2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?
/body>