By: ABP Desam | Updated at : 27 Aug 2022 01:05 PM (IST)
లోదుస్తులు విప్పించిన వివాదంలో విద్యార్థినులకు మళ్లీ నీట్ పరీక్ష
NEET frisking row: మెడికల్ నీట్ పరీక్షల విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షకు హాజరైన సమయంలో లో దుస్తులు తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థినులకు గుడ్ న్యస్ చెప్పింది. తమ లో దుస్తులు తొలగించారని ఆరోపించిన విద్యార్థినుల కోసం నీట్ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని ఎన్టిఎ తెలిపింది. సెప్టెంబర్ 4న ఆ విద్యార్థులకు అవకాశం ఇస్తున్నామని, ఇదే విషయాన్ని సదరు యువతులకు మెయిల్ ద్వారా తెలియజేసింది.
కేరళలో సంచలనం సృష్టించిన నీట్ పరీక్షలో నిర్వాహకుల అత్యుత్సాహం
కేరళలోని కొల్లాం జిల్లాలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి ముందు తమ లో దుస్తులు తొలగించాలని అక్కడి సిబ్బంది అడగటంపై తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంపై జులైలో ఓ వ్యక్తి కొట్టారకర పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాత మంగళంలోని పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు తన కుమార్తెతో సహా పలువురు విద్యార్థినుల లో దుస్తులు తొలగించమని కోరినట్లు పేర్కొన్నారు. దీనిపై సెక్షన్ 354, 509 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఏడుగుర్ని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ఇద్దరు కళాశాల సిబ్బందితో పాటు అక్కడి భద్రతను అప్పగించిన ఏజెన్సీకి చెందిన ముగ్గురు ఉన్నారు. తర్వాత వీరు బెయిల్పై విడుదలయ్యారు. జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ అంశంపై సీరియస్గా స్పందించింది.
NCW has taken serious note of the reported incident where several girl students were forced to remove their innerwear during screening before NEET 2022 exam in Kerala. It is shameful and outrageous to the modesty of young girls. pic.twitter.com/267LzE9l4r
— ANI (@ANI) July 19, 2022
విచారణ జరిపి నిజమేనని తేల్చుకుని ఎన్టీఏ కమిటీ - రీ ఎగ్జామ్ పెట్టాలని నిర్ణయం
ఈ విషయం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వరకు వెళ్లింది. ముగ్గురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని వేసి విచారణ చేపట్టింది. అంతేకాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. బాధిత విద్యార్థినులకు సెప్టెంబర్ 4న తిరిగి నీట్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.
సెప్టెంబర్ ఏడో తేదీన నీట్ యూజీ ఫలితాలు విడుదల చేస్తామన్న ఎన్టీఏ !
నీట్ యూజీ పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక అప్డేట్ వెల్లడించింది. నీట్ యూజీ ఫలితాలను సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆగస్టు 30 నాటికి neet.nta.nic.in వెబ్సైట్లో ఆన్సర్ ‘కీ’తో పాటు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ స్కాన్డ్ ఇమేజెస్, రికార్డెడ్ రెస్పాన్స్లను అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
CSIR UGC NET 2023: సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?
JEE Main 2024: జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
జేఈఈ మెయిన్ దరఖాస్తుకు ముగుస్తోన్న గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
/body>