అన్వేషించండి

JEE Main 2026 సెషన్-2 కోసం దరఖాస్తులు ప్రారంభం.. అప్లికేషన్ ఫీజు, ముఖ్యమైన తేదీలు ఇవే

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE Main 2026 (జేఈఈ మెయిన్ 2026) సెషన్-2 పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. అయితే అభ్యర్థుల అర్హతలు, ఫీజు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ రంగంలో కెరీర్ కోసం కలలు కనే విద్యార్థులకు ఇది ముఖ్యమైన వార్త. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE మెయిన్ 2026 సెషన్ II కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటు, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత సమయంలో జేఈఈ మెయిన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. JEE మెయిన్ ఎగ్జామ్ ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది.

పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA నిర్వహించే JEE మెయిన్ 2026 సెషన్-2 పరీక్ష ఏప్రిల్ నెలలో ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది. NTA JEE మెయిన్ 2026 సెషన్-2 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 25, 2026 రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. JEE మెయిన్ సెషన్-2 పరీక్ష ఏప్రిల్ 02 నుండి ఏప్రిల్ 09, 2026 వరకు ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించనున్నారు. పరీక్ష కోసం అడ్మిట్ కార్డులు పరీక్షకు 3 రోజుల ముందు అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతారు. పరీక్ష ముగిసిన తర్వాత, సమాధానాల కోసం ఆన్సర్ కీ విడుదల చేయనున్నారు. అయితే ఫలితాలు త్వరగానే ప్రకటిస్తారు. 

దరఖాస్తు రుసుము ఎంత?

NTA JEE మెయిన్ 2026 సెషన్-2 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా కేటగిరీల ప్రకారం ఎగ్జామ్ ఫీజును చెల్లించాలి. JEE మెయిన్ 2026 సెషన్-2లో పేపర్-1 (B.E./B.Tech) కోసం మాత్రమే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ కేటగిరీ ప్రకారం ఫీజులు ఉంటాయి. జనరల్ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజరు రూ. 1000 ఉండగా,  జనరల్, OBC, EWS కేటగిరీలకు చెందిన మహిళా అభ్యర్థులు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు SC, ST కేటగిరీలకు చెందిన పురుషులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 500 చెల్లించాలి . అభ్యర్థులు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ-చలాన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

 2 పేపర్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు.. 
పేపర్-1 (B.E./B.Tech)తో పాటు పేపర్-2 (B.Arch / B.Planning) కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రెండు పేపర్లకు నిర్ణీత ఫీజు చెల్లించాలి. జనరల్, OBC, EWS కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులకు ఈ రుసుము రూ. 2000. ఈ కేటగిరీకి చెందిన మహిళా అభ్యర్థులు రూ. 1600 దరఖాస్తు రుసుము చెల్లించాలి. దీనితో పాటు SC, ST కేటగిరీలకు చెందిన పురుషులు, మహిళా అభ్యర్థులకు రెండు పేపర్లకు రూ. 1000 చెల్లించాలి. 

అర్హత ఏమిటి?

JEE మెయిన్ 2026 సెషన్-2 కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితో పాటు, 2026లో 12వ తరగతి (ఇంటర్) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష రాయాలంటే అభ్యర్థి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (PCM) సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. P C M సబ్జెక్టులు లేని అభ్యర్థులు JEE మెయిన్ పరీక్షకు అర్హులుగా పరిగణించరు.

దరఖాస్తు ప్రక్రియ

  • JEE మెయిన్ అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.nic.in/ ను సందర్శించండి.
  • తరువాత రిజిస్ట్రేషన్ చేసుకోండి. అనంతరం మీ వివరాలతో లాగిన్ అవ్వండి.
  • అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి 
  • అభ్యర్తి ఫోటో, సంతకం, సంబంధిత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
  • మీ కేటగిరి ఆధారంగా తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
  • అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేసిన తరువాత, ప్రింట్ అవుట్‌ తీసి భవిష్యత్ అవసరరాల కోసం భద్రపరచుకోండి.


About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Railway Projects: ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు 4 రైల్వే లైన్లు, రైల్వే క్రాసింగ్స్‌ లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు
ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు 4 రైల్వే లైన్లు, రైల్వే క్రాసింగ్స్‌ లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు
IND vs PAK T20 World Cup: భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Asaduddin Owaisi: గన్‌తో ముస్లింలకు గురిపెట్టిన హిమంత బిశ్వ శర్మ! పోలీసులకు అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు
గన్‌తో ముస్లింలకు గురిపెట్టిన హిమంత బిశ్వ శర్మ! పోలీసులకు అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు
Shahid Kapoor: షాహిద్ కపూర్ సంచలన వ్యాఖ్యలు... సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదేనా?
షాహిద్ కపూర్ సంచలన వ్యాఖ్యలు... సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదేనా?
Advertisement

వీడియోలు

T20 World Cup 2026 Jasprit Bumrah, Abhishek Sharma Health Update | కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ
T20 World Cup 2026 Jasprit Bumrah Health Update | కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ
Pakistan Conditions to Play with India | భారత్‌తో మ్యాచ్ ..షరతులు పెట్టిన పాక్
Nepal vs England T20 World Cup | ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన నేపాల్
Sourav Ganguly slams Pakistan | పాకిస్తాన్ పై సౌరబ్ గంగూలీ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Railway Projects: ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు 4 రైల్వే లైన్లు, రైల్వే క్రాసింగ్స్‌ లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు
ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు 4 రైల్వే లైన్లు, రైల్వే క్రాసింగ్స్‌ లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు
IND vs PAK T20 World Cup: భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Asaduddin Owaisi: గన్‌తో ముస్లింలకు గురిపెట్టిన హిమంత బిశ్వ శర్మ! పోలీసులకు అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు
గన్‌తో ముస్లింలకు గురిపెట్టిన హిమంత బిశ్వ శర్మ! పోలీసులకు అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు
Shahid Kapoor: షాహిద్ కపూర్ సంచలన వ్యాఖ్యలు... సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదేనా?
షాహిద్ కపూర్ సంచలన వ్యాఖ్యలు... సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదేనా?
Leopard In Medak: అకోలా- హైదరాబాద్ 161 నేషనల్ హైవే పక్కన చిరుత సంచారం.. జాగ్రత్తగా ఉండండి
అకోలా- హైదరాబాద్ 161 నేషనల్ హైవే పక్కన చిరుత సంచారం.. జాగ్రత్తగా ఉండండి
YSRCP Leader Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
Krishna Crime News: బ్లాక్ మెయిల్ చేసి సోదరిపై పలుమార్లు అత్యాచారం, విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు
బ్లాక్ మెయిల్ చేసి సోదరిపై పలుమార్లు అత్యాచారం, విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు
Srisailam Lathi charge: శ్రీశైలంలో భక్తులపై లాఠీ ఛార్జ్‌- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు !
శ్రీశైలంలో భక్తులపై లాఠీ ఛార్జ్‌- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు !
Embed widget