అన్వేషించండి

JEE Main 2026 సెషన్-2 కోసం దరఖాస్తులు ప్రారంభం.. అప్లికేషన్ ఫీజు, ముఖ్యమైన తేదీలు ఇవే

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE Main 2026 (జేఈఈ మెయిన్ 2026) సెషన్-2 పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. అయితే అభ్యర్థుల అర్హతలు, ఫీజు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ రంగంలో కెరీర్ కోసం కలలు కనే విద్యార్థులకు ఇది ముఖ్యమైన వార్త. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE మెయిన్ 2026 సెషన్ II కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటు, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత సమయంలో జేఈఈ మెయిన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. JEE మెయిన్ ఎగ్జామ్ ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది.

పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA నిర్వహించే JEE మెయిన్ 2026 సెషన్-2 పరీక్ష ఏప్రిల్ నెలలో ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది. NTA JEE మెయిన్ 2026 సెషన్-2 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 25, 2026 రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. JEE మెయిన్ సెషన్-2 పరీక్ష ఏప్రిల్ 02 నుండి ఏప్రిల్ 09, 2026 వరకు ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించనున్నారు. పరీక్ష కోసం అడ్మిట్ కార్డులు పరీక్షకు 3 రోజుల ముందు అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతారు. పరీక్ష ముగిసిన తర్వాత, సమాధానాల కోసం ఆన్సర్ కీ విడుదల చేయనున్నారు. అయితే ఫలితాలు త్వరగానే ప్రకటిస్తారు. 

దరఖాస్తు రుసుము ఎంత?

NTA JEE మెయిన్ 2026 సెషన్-2 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా కేటగిరీల ప్రకారం ఎగ్జామ్ ఫీజును చెల్లించాలి. JEE మెయిన్ 2026 సెషన్-2లో పేపర్-1 (B.E./B.Tech) కోసం మాత్రమే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ కేటగిరీ ప్రకారం ఫీజులు ఉంటాయి. జనరల్ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజరు రూ. 1000 ఉండగా,  జనరల్, OBC, EWS కేటగిరీలకు చెందిన మహిళా అభ్యర్థులు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు SC, ST కేటగిరీలకు చెందిన పురుషులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 500 చెల్లించాలి . అభ్యర్థులు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ-చలాన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

 2 పేపర్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు.. 
పేపర్-1 (B.E./B.Tech)తో పాటు పేపర్-2 (B.Arch / B.Planning) కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రెండు పేపర్లకు నిర్ణీత ఫీజు చెల్లించాలి. జనరల్, OBC, EWS కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులకు ఈ రుసుము రూ. 2000. ఈ కేటగిరీకి చెందిన మహిళా అభ్యర్థులు రూ. 1600 దరఖాస్తు రుసుము చెల్లించాలి. దీనితో పాటు SC, ST కేటగిరీలకు చెందిన పురుషులు, మహిళా అభ్యర్థులకు రెండు పేపర్లకు రూ. 1000 చెల్లించాలి. 

అర్హత ఏమిటి?

JEE మెయిన్ 2026 సెషన్-2 కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితో పాటు, 2026లో 12వ తరగతి (ఇంటర్) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష రాయాలంటే అభ్యర్థి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (PCM) సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. P C M సబ్జెక్టులు లేని అభ్యర్థులు JEE మెయిన్ పరీక్షకు అర్హులుగా పరిగణించరు.

దరఖాస్తు ప్రక్రియ

  • JEE మెయిన్ అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.nic.in/ ను సందర్శించండి.
  • తరువాత రిజిస్ట్రేషన్ చేసుకోండి. అనంతరం మీ వివరాలతో లాగిన్ అవ్వండి.
  • అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి 
  • అభ్యర్తి ఫోటో, సంతకం, సంబంధిత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
  • మీ కేటగిరి ఆధారంగా తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
  • అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేసిన తరువాత, ప్రింట్ అవుట్‌ తీసి భవిష్యత్ అవసరరాల కోసం భద్రపరచుకోండి.


About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
Ayodhya Ram Mandir Donation Row: సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
Hang Man OTT : ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget