అన్వేషించండి

Civils Coaching: ఉస్మానియా యూనివర్సిటీలో 'సివిల్స్‌' ఉచిత శిక్షణకు నోటిఫికేషన్, వివరాలు ఇలా

Free Civils Coaching: హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌ (Civil Services Prelims) పరీక్షకు సంబంధించి ఉచిత శిక్షణ కోసం ప్రకటన విడుదల చేసింది.

Osmania University Free Civils Coaching: హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌ (Civil Services Prelims) పరీక్షకు సంబంధించి ఉచిత శిక్షణ (Free Training) కోసం ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా ఓయూలోని 'సివిల్ సర్వీస్ అకాడమీ' (Civil Service Academy) ఆధ్వర్యంలో అర్హులైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో పీజీ, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబర్ 2 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఓయూ వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తును పూర్తిచేసి, ధ్రువపత్రాల నకళ్లను ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ కార్యాలయంలో అందజేయాలి. పూర్తి వివరాలకు 8331041332 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.

ఓయూ పీహెచ్‌డీ విద్యార్థులు, క్యాంపస్ కాలేజీలతో పాటు సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కళాశాలలు, నిజాం కళాశాలకు చెందిన పీజీ విద్యార్థులు అర్హులు. డిగ్రీ మార్కులు, పీజీ ఎంట్రన్స్‌లో సాధించిన ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాలను అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నాలుగున్నర నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు.

స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైతే చాలు.. 
విద్యార్థులు ఓయూ సివిల్స్ అకాడమీలో ఉచితంగా శిక్షణ పొందాలంటే ముందుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించనున్న అర్హత పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. ఈ పరీక్షలో పాసైన వారికి ఉచితంగా శిక్షణ పొందేందుకు అవకాశం లభిస్తుంది. ఓయూలో పీజీ చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యే 100 మంది అభ్యర్థులను శిక్షణకు ఎంపికచేస్తారు. వీరికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు విశ్వవిద్యాలయంలోని అనుభవజ్ఞులైన ఆచార్యుల వృత్తి నిపుణుల సహకారం తీసుకోనున్నారు.

ఓయూ పరిధిలో చదువుకుంటున్న విద్యార్థులను సివిల్స్ విజేతలుగా తీర్చిదిద్దేందుకు ఉచిత శిక్షణకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సివిల్ సర్వీసెస్ అకాడమీలో ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించారు. ఐపీఎస్, ఐఏఎస్‌లుగా మారేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే ఓయూ విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెరిగేలా, పరీక్షల్లో విజయం సాధించేలా అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రైవేటు కోచింగ్ కేంద్రాలకు దీటుగా..
సివిల్స్ శిక్షణ ఇస్తున్న ప్రైవేటు కేంద్రాలకు దీటుగా.. విశ్వవిద్యాలయంలో సివిల్స్ అకాడమీని రూపొందించారు. ఏకకాలంలో 500ల మంది విద్యార్థులు చదువుకునేలా విశాలమైన గదులు, అత్యాధునిక సమాచార పరిజ్ఞానంతో కూడిన శిక్షణ తరగతులు, డిజిటల్ లైబ్రరీతో పాటు కేంద్ర గ్రంథాలయం తరహాలో.. గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు.

Notification

Application

Civils Coaching: ఉస్మానియా యూనివర్సిటీలో 'సివిల్స్‌' ఉచిత శిక్షణకు నోటిఫికేషన్, వివరాలు ఇలా

ALSO READ:

ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ 'లేటరల్ ఎంట్రీ' ప్రవేశాలు..
డిప్లొమా అర్హత ఉండి, ఉద్యోగాలు చేస్తూ.. ఇంజినీరింగ్ చదవాలనుకునే వారికోసం 'బీటెక్‌ వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌' పేరుతో బీటెక్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణలోని 12 ఇంజినీరింగ్‌ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవలే అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఉస్మానియా సహా పలు కాలేజీల్లో వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ప్రవేశాలు కల్పించేందుకు (ఏఐసీటీఈ)అనుమతిని మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సరంలో వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ప్రవేశాలు పొందేందుకు నవంబరు 30 వరకు అవకాశం ఇచ్చింది.
ప్రవేశానికి సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

UPSC Prelims 2026: యూపీఎస్సీ పరీక్ష ప్రక్రియలో ఏఐ వాడకం! పరీక్షకు ముందే 569 మంది దరఖాస్తులు తిరస్కరణ!
యూపీఎస్సీ పరీక్ష ప్రక్రియలో ఏఐ వాడకం! పరీక్షకు ముందే 569 మంది దరఖాస్తులు తిరస్కరణ!
NEET JEE Weightage Changes: NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
NEET UG 2026 Result: నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ ఫలితాలు జూలై 20 నాటికి విడుదల! ఎంబిబిఎస్ అడ్మిషన్లు, కొత్త సెషన్స్‌పై కీలక ప్రకటన!
నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ ఫలితాలు జూలై 20 నాటికి విడుదల! ఎంబిబిఎస్ అడ్మిషన్లు, కొత్త సెషన్స్‌పై కీలక ప్రకటన!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Embed widget