అన్వేషించండి

UGC Scholarships: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..

కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సిద్ధమైంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్కాలర్‌షిప్‌‌ రూపంలో ఆర్థిక తోడ్పాటు అందించనుంది. దీనికి సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఒంటరి బాలికల కోసం (Single Girl Child) పీజీ ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్‌‌.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం పీజీ స్కాలర్‌షిప్‌ (SC, ST Scholarship Scheme).. ఈశాన్య ప్రాంత విద్యార్థుల కోసం ఇషాన్ ఉదయ్ స్పెషల్ స్కాలర్‌షిప్‌ (Ishan Uday).. యూనివర్సీటీల ర్యాంక్ హోల్డర్ల కోసం పీజీ స్కాలర్‌షిప్‌ (University Rank Holders) వంటి నాలుగు పథకాలతో స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు జాతీయ స్కాలర్‌షిప్‌ (NSP) పోర్టల్ అయిన scholarships.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూజీసీ సూచించింది. ఈ నాలుగు స్కాలర్‌షిప్‌‌ స్కీంల వివరాలు మీకోసం.. 

1. ఒంటరి బాలికలకు పీజీ ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్‌.. (Post graduate Indira Gandhi Scholarship For Single Girl Child)
పోస్టు గ్రాడ్యుయేషన్ చదివే ఒంటరి అమ్మాయిల కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబంలో ఒకే కుమార్తె ఉన్న విద్యార్థినులు, కవల అమ్మాయిలు ఈ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా మొత్తం 3000 మందికి సాయం అందిస్తారు. దీని కింద ఎంపికైన వారికి ఏడాదికి రూ.36,200 చొప్పున రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్‌ వస్తుంది. ఆసక్తి ఉన్న వారు నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. 

Also Read: Scholarship Programs: విద్యార్థులకు అదిరిపోయే అవకాశం.. చదువు కోసం స్కాలర్‌షిప్స్.. ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోండి..

2. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎస్సీ, ఎస్టీ స్కాలర్‌షిప్‌ స్కీమ్ (Postgraduate SC, ST Scholarship Scheme)
ప్రొఫెషనల్ కోర్సులను చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు యూజీసీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద వెయ్యి మందికి స్కాలర్‌షిప్‌‌లు అందిస్తుంది. ఎంఈ, ఎంటెక్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదువుకుంటున్న వారికి నెలకు రూ.7,800 స్కాలర్‌షిప్‌‌ అందిస్తారు. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎంఎస్‌డబ్ల్యూ వంటి నాన్ ప్రొఫెషనల్ కోర్సులు చదువుకుంటున్న వారు ఈ పథకానికి అనర్హులు. దీనికి కూడా నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

3. యూజీసీ ఇషాన్ ఉదయ్ స్కాలర్‌షిప్‌ (UGC Ishan Uday Scholarship)
ఈశాన్య ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. మొత్తం 10,000 మందికి ఈ స్కీం కింద ఆర్థిక చేయూత అందిస్తున్నారు. 2014-15 విద్యా సంవత్సరం నుంచి దీని ద్వారా స్కాలర్‌షిప్‌‌ ఇస్తున్నారు. జనరల్ డిగ్రీ కోర్సులు చదివే వారికి నెలకు రూ.5,400.. టెక్నికల్, పారామెడికల్, ప్రొఫెషనల్ కోర్సులు చేసే వారికి రూ.7,800 ఆర్థిక సాయం అందిస్తారు. ఈశాన్య ప్రాంతాల విద్యార్థులకు ఉన్నతావకాశాలు కల్పించడం, స్థూల నమోదు నిష్పత్తి (GER) పెంచడమే లక్ష్యంగా యూజీసీ దీనిని రూపొందించింది. ఆసక్తి ఉన్న వారు నవంబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. 

Also Read: Career Guidance: జ్యుయెలరీ డిజైనింగ్ అంటే మీకు ఇష్టమా? ఇందులో కూడా డిప్లొమా, డిగ్రీ చేయొచ్చు.. ఆభరణాల డిజైనర్లకు ఫుల్ డిమాండ్..

4. యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్స్ స్కాలర్‌షిప్‌ (UGC Scholarship For University Rank Holders)
అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన (outstanding performance) ఇచ్చిన వారితో పాటు పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులు చదువుతున్న వారి కోసం యూజీసీ ఈ స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రవేశ పెట్టింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేటు యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలు లేదా పీజీ కాలేజ్ రెగ్యులర్ వంటి వాటిలో ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన ఫస్ట్, సెకండ్ ర్యాంకు సాధించిన వారు ఈ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి రెండేళ్ల పాటు నెలకు రూ.3,100 చొప్పున చెల్లిస్తారు. అయితే దూర విద్య, వృత్తి విద్య ద్వారా విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ స్కీం పరిధిలోకి రారు. ఆసక్తి ఉన్న వారు నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..

Also Read: Career Guidance: చరిత్ర అంటే ఇష్టమా? ఇది కూడా బెస్ట్ కెరీర్ ఆప్షనే.. మీకేం కావాలో ఎంచుకోండి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget