అన్వేషించండి

AP SSC Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు వారం వాయిదా! ఎప్పటి నుంచి ఉండొచ్చంటే?

AP SSC Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు వారం పాటు వాయిదా పడే అవకాశం ఉంది. ఇంటర్, టెన్త్ పరీక్షలు కొన్ని ఒకే రోజు ఉండడంతో నిర్వహణ సమస్యలు తలెత్తుతున్నాయని విద్యాశాఖ భావిస్తోంది.

AP SSC Exams : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు(10th Class Exams) వారం రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. మే 2 నుంచి జరగాల్సిన పరీక్షలను మే 9 లేదా 13 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విద్యా శాఖ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. పది, ఇంటర్ పరీక్షల్లో కొన్ని ఒకే తేదీన రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అలాగే జేఈఈ పరీక్షల షెడ్యూల్‌ వల్ల ఇంటర్‌ పరీక్షలు వాయిదా(Inter Exams Postponed) వేయండంతో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో కొన్ని ఒకే రోజున వస్తున్నాయి. 

ఇప్పటికే ఇంటర్ పరీక్షలు వాయిదా 

ఏపీలో ఇంటర్‌ పరీక్షలను(Inter Exams) ఏప్రిల్ 8 నుంచి 28 వరకు నిర్వహించాలని విద్యాశాఖ భావించింది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించింది. కానీ జేఈఈ పరీక్షలను(JEE Exams) ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తేదీలను ప్రకటించింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేసింది. ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు ఇంటర్‌ పరీక్షలను నిర్వహించాలని షెడ్యూల్‌ ప్రకటించింది. పదో తరగతి పరీక్షలు మే 2 నుంచి 13వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే ఇంటర్, టెన్త్‌ పరీక్షలకు కొన్ని చోట్ల ఒకే పరీక్ష కేంద్రంలో నిర్వహించాల్సిన కారణంగా పదో తరగతి పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

పోలీసుల భద్రత, వసతి ఇబ్బందులు 

పదో తరగతి పరీక్ష కేంద్రాలను మరో చోటికి మార్చడానికి వీలులేకపోవడంతో పరీక్షలు వారం పాటు వాయిదా వేసేందుకు విద్యాశాఖ ఆలోచిస్తుంది. టెన్త్, ఇంటర్ పరీక్షలు ఒకేసారి జరిగితే పోలీస్ స్టేషన్లలో ప్రశ్నపత్రాలు, జవాబులు రాసే బుక్ లెట్లు, ఇతర పరీక్ష సామగ్రి భద్రపరిచేందుకు వసతి ఇబ్బందులు కలగనున్నాయి. రెండు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు భద్రత, వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకానికి కూడా సమస్య తలెత్తనుంది. ఈ కారణాలతో పదో తరగతి పరీక్షలను వారం పాటు వాయిదా వేయాలని విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది. మే 9 నుంచి లేదా 13వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదించింది. 

ఇంటర్ పరీక్షలు 

ఇప్పటికే ఇంటర్మీడియట్(Intermediate) పరీక్షలు వాయిదా(Postpone) పడ్డాయి. పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్(Adimulapu Suresh) ప్రకటించారు. జేఈఈ మెయిన్స్(JEE Mains) కారణంగా ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినట్లు మంత్రి తెలిపారు. ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. గతంలో విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్‌ పరీక్షలను ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రెండు రోజుల కిందట ప్రకటించింది. దీంతో పరీక్షలను వాయిదా వేసినట్లు  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ గురువారం తెలిపారు. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు మార్చి 11 నుంచి మార్చి 31వరకు జరుగుతాయని మంత్రి సురేశ్‌ తెలిపారు. కోవిడ్(Covid) నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు(Inter Board) తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,400 పరీక్షా కేంద్రాలు, 900 ల్యాబ్‌లను పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి వెల్లడించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

JanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP DesamRayapati Aruna on Pithapuram Sabha | నాగబాబుకు MLC పదవి ఎందుకో చెప్పిన రాయపాటి అరుణ | ABP DesamFood Items Menu Janasena Pithapuram Sabha | పిఠాపురం సభలో 10వేల మందికి భోజనాలు | ABP DesamJanasena Pithapuram Sabha Arrangements | పిఠాపురంలో భారీ రేంజ్ లో జనసేన సభ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Viral News: చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Embed widget