అన్వేషించండి

AP Inter Results 2024: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - ఫలితాలు త్వరలోనే వచ్చేస్తున్నాయ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియ్ బోర్డు సమాయత్తమవుతోంది. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి వెలువడనున్నాయి.

AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియ్ బోర్డు సమాయత్తమవుతోంది. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి వెలువడనున్నాయి. ఇంటర్ ఫలితాలను ఏప్రిల్‌ రెండోవారం లేదా మూడో వారంలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ముగియగా.. మరోసారి జవాబుపత్రాల పరిశీలన, మార్కుల నమోదు ప్రక్రియ పూర్తికాగానే ఫలితాలు విడుదల చేయనున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ ప‌బ్లిక్‌ పరీక్షలు జ‌రిగిన విష‌యం తెల్సిందే. ఈ ఏడాది ఇంట‌ర్ విద్యార్థులు మొత్తం 10,52,221 మంది ఉన్నారు. ఇందులో మొదటి  సంవత్సరం 4,73,058 మంది, రెండో  సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. ఒకేషనల్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు దాదాపు లక్ష వరకు ఉన్నారు. ఇంటర్ పరీక్షలు ముగియడంతో.. మూల్యాంకన ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. ఏప్రిల్‌ 4న మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. సుమారుగా 23వేల మంది అధ్యాపకులు  పాల్గొన్నారు. ఒక్కో అధ్యాపకుడూ రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మార్కులు అప్‌లోడ్ చేయనున్నారు. ఇవన్నీ అయిపోగానే ఫలితాలను వెల్లడించనున్నారు.

గతేడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్‌తోపాటు సెకండియర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 26న విడుదల చేశారు. అంటే 22 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించారు. ఈసారి కూడా అంతే సమయంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏప్రిల్ 12 లేదా ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి 
Step 1: ఏపీ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్   https://bie.ap.gov.in/ సందర్శించండి
Step 2: హోం పేజీలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2024 లింక్ (Andhra Pradesh Inter Results 2024 link) మీద క్లిక్ చేయండి
Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి
Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: విద్యార్థులు రిజల్ట్స్‌ స్కోర్ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాల సమయంలో మీ ఇంటర్ స్కోర్ కార్డు అవసరాల కోసం రిజల్ట్ ు ప్రింటౌట్ తీసుకోవడం బెటర్.

ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు..

https://examresults.ap.nic.in

www.bie.ap.gov.in 

ALSO READ:

AP SSC Results: పదోతరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీలో ఇటీవల పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులకు గుడ్‌న్యూస్. పదోతరగతి పరీక్ష ఫలితాల వెల్లడికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్‌, మార్చి 20న ఇంగ్లిష్, మార్చి 22న మ్యాథమెటిక్స్, మార్చి 23న ఫిజికల్ సైన్స్, మార్చి 26న బయాలజీ, మార్చి 27న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించగా.. మార్చి 28, 30 తేదీల్లో వొకేషనల్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలకు ముగియగానే అధికారులు జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ 8తో ముగియనుంది. విద్యార్థుల జవాబుపత్రాలను మరోసారి పరిశీలించి, మార్కుల నమోదు పూర్తిచేయనున్నారు. ఆ వెంటనే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇదంతా పూర్తవడానికి కనీసం రెండువారాల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఏప్రిల్‌ నాలుగో వారంనాటికి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ కుదరనిపక్షలో మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
What Indians Ate On New Year: సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
Best Foods to Eat Raw : ఈ 9 ఆహారాలు పచ్చిగానే తినాలి.. పొరపాటున వండితే పోషకాలు తగ్గిపోతాయట
ఈ 9 ఆహారాలు పచ్చిగానే తినాలి.. పొరపాటున వండితే పోషకాలు తగ్గిపోతాయట
Embed widget