అన్వేషించండి

Telangana Inter Results: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులంతా పాస్ - తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్,లు రాసిన వారినందర్నీ పాస్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీేసుకుంది. ఫలితాలపై వివాదం ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులందర్నీ పాస్ చేయాలని  తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇటీవల తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను ప్రకటించింది. అయితే 49శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 51 శాతం మంది ఫెయిలయ్యారు. దీంతో విద్యార్థులకు సరైన సమయం ఇవ్వలేదని..  క్లాసులు సరిగ్గా చెప్పలేదని విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. పలువురు విద్యార్థులు తాము ఫెయిలయ్యామన్న బాధతో.. తక్కువ మార్కులు వచ్చాయన్న ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారు .  విపక్ష పార్టీలు ఈ ఇంటర్ ఫలితాల అంశాన్ని రాజకీయంగా తీసుకుని ఆందోళనలు ప్రారంభించాయి.

Also Read: తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని మృతి... ఫస్టియర్ లో ఫెయిల్ అవ్వడంతో ఆత్మహత్య ..!

కరోనా కాలంలో విద్యార్థులకు సరిగ్గా పాఠాలు చెప్పలేకపోయినందున ఈ సారికి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులందర్నీ పాస్ చే్యాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ అంశంపై సమీక్ష నిర్వహించిన ఉన్నత విద్యా శాఖ అధికారులు,  మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందర్నీ పాస్  చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్, కెరియర్ కోసమే తాము పరీక్షలు పెట్టామని.. తామేదో తప్పు చేసినట్లుగా నిందించడం సరి కాదని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా సమయం అయినప్పటికీ విద్యార్థుల కోసం  ఆన్‌లైన్‌తో పాటు టీవీ చానల్స్‌లో... వెబ్ సైట్లలోనూ పాఠాలు  చెప్పామన్నారు. 

Also Read: అవన్నీ ప్రభుత్వ హత్యలే.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతోంది.. బండి సంజయ్

అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించామన్నారు. విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించిన వారు ఎంతో మంది ఉన్నారని..90 శాతానికిపైగా మార్కులు సాధించిన వారు 10వేలకుపైగా ఉన్నారని మంత్రి సబితాఇంద్రారెడ్డి గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే ఆలోచించాలి కానీ రాజకీయ పార్టీలు.. రాజకీయం చేయకూడదని మంత్రి హితవు పలికారు.,  విద్యార్థుల భవిష్యత్ గురించే అందరూ ఆలోచించాలన్నారు. రాజకీయ పార్టీలు .. ప్రభుత్వం, ఇంటర్ బోర్డుపై ఆరోపణలు చేస్తూ ధర్నాలు చేయడాన్ని మంత్రి తప్పు పట్టారు. 

Also Read: Inter Results 2021: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల... రిజెల్ట్స్ కోసం ఇలా చెక్ చేసుకోండి

పరీక్షలు పాస్ అయిన వారి మార్కులు యథాతథంగా ఉంటాయి. ఫెయిలైన వారికి మాత్రం పాస్ మార్కులు కేటాయించే అవకాశం ఉంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా విద్యార్థుల్ని పరీక్షలు లేకుండా పాస్ చేస్తూ వస్తున్నారు. ఈ సారి పరీక్షలు పెట్టడంతో ఎక్కువ మంది ఫెయిలయ్యారు. చివరికి అందర్నీ పాస్ చేయాల్సి వచ్చింది. 

Also Read: కరోనా కాలం చదవులా ? ఇంటర్ బోర్డు పొరపాటా? వివాదంగా మారిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget