అన్వేషించండి

Students Suicide: అవన్నీ ప్రభుత్వ హత్యలే.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతోంది.. బండి సంజయ్

ఫలితాలు చూసి విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని... నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సూచించారు.

Students Suicide: తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాలు విషాదాన్ని నింపుతున్నాయి. ఏకంగా 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే తన గుండె తరుక్కు పోతోందన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఫలితాలు చూసి విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని... నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తప్పిదం కారణంగా విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని, ప్రభుత్వ తప్పిదం కారణంగానే ఇంటర్‌ విద్యార్థుల బలవన్మరనం చెందుతున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందన్నారు. ఇంటర్ ఫెయిలైన విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే అధికంగా ఉన్నారు. తమ చావుకు కారణం తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ అని, వీళ్లు బాధ్యత వహించాలంటూ స్వయంగా విద్యార్ధి ట్వీట్ చేయడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తల దించుకోవాలి.

‘గతంలో మంత్రి కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా నిర్వాకంతో 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు బలయ్యారు. విద్యార్థుల ఆత్మహత్యలు, పరీక్షల్లో ఫెయిలవడానికి ప్రభుత్వం బాధ్యత వహించి తీరాల్సిందే. ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి?. విద్యార్థుల వద్ద నుంచీ ఒక్క ఉచితంగా రీ వాల్యుయేషన్‌ చేయించాలి. విద్యార్థులకు  బీజేపీ అండగా ఉంటుంది... అవసరమైతే న్యాయపోరాటం చేసేందుకూ వెనుకాడబోం. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని’ఓ ప్రకటనలో ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు.

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఈసారి జనరల్‌, ఒకేషనల్‌ కలిపి 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం మంది పాస్ అయ్యారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 60.01 కాగా ఈ సంవత్సరం 11 శాతం తగ్గింది. గురువారం మధ్యాహ్నం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఫస్ట్ ఇయర్ ఫలితాలను వెల్లడించారు. ఈ ఫలితాలను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు.
Also Read: Inter Results 2021: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల... రిజెల్ట్స్ కోసం ఇలా చెక్ చేసుకోండి

Also Read: Intermediate Board: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం... వచ్చే ఏప్రిల్ లో మరోసారి ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Mango Pickle Season: అమెరికా నుంచి అనకాపల్లి వరకూ నోరూరిస్తున్న హైదరాబాద్ ఆవకాయ్‌! పచ్చళ్ల సీజన్‌లో సరికొత్త ట్రెండ్!
అమెరికా నుంచి అనకాపల్లి వరకూ నోరూరిస్తున్న హైదరాబాద్ ఆవకాయ్‌! పచ్చళ్ల సీజన్‌లో సరికొత్త ట్రెండ్!
Telangana Modi tour: తెలంగాణపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ - ఐదు రాష్ట్రాల ఫలితాల వెంటే మోదీ జనాగ్రహ సభ !
తెలంగాణపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ - ఐదు రాష్ట్రాల ఫలితాల వెంటే మోదీ జనాగ్రహ సభ !
Telangana Politics: అటు మల్లారెడ్డి.. ఇటు రాజగోపాల్ రెడ్డి - ఇద్దరూ ఇద్దరే.. పార్టీలకు తీరని తలనొప్పి!
అటు మల్లారెడ్డి.. ఇటు రాజగోపాల్ రెడ్డి - ఇద్దరూ ఇద్దరే.. పార్టీలకు తీరని తలనొప్పి!
Hyderabad Metro:ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ?
ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ?

వీడియోలు

Ryan Rickelton Breaks Record IPL 2026 | 18 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన ర్యాన్ రికెల్టన్
Vaibhav Suryavanshi Performance IPl 2026 | వైభవ్ విధ్వంసానికి గవాస్కర్ ఫిదా
SRH vs MI Highlights IPL 2026 | ముంబైపై సన్‌రైజర్స్ అదిరే విక్టరీ
RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
AP SSC Exam Results 2026: కాసేపట్లో ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
కాసేపట్లో ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
MAVIGUN News: మావిగన్‌పై అంతా గప్‌చుప్‌! అసలు రీజన్ ఇదే!
మావిగన్‌పై అంతా గప్‌చుప్‌! అసలు రీజన్ ఇదే!
Viral News: పెళ్లి బారాత్‌ డీజేతో కోళ్లు చచ్చిపోయాయి! వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు!
పెళ్లి బారాత్‌ డీజేతో కోళ్లు చచ్చిపోయాయి! వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు!
Hyderabad Metro:ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ?
ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ?
AP Local Polls: స్థానిక సంస్థలకు ఎన్నికల సెగ - వేసవి సెలవుల్లోనే పండగ పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం?
స్థానిక సంస్థలకు ఎన్నికల సెగ - వేసవి సెలవుల్లోనే పండగ పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం?
మీ ఇంటి షోకేస్‌లో ట్రోఫీలు, సర్టిఫికేట్‌లను ఏ దిశలో పెట్టాలో తెలుసా?
మీ ఇంటి షోకేస్‌లో ట్రోఫీలు, సర్టిఫికేట్‌లను ఏ దిశలో పెట్టాలో తెలుసా?
Heatwave Alert : వడగాలుల హెచ్చరిక.. ప్రాణాపాయం పెంచేస్తోన్న ఎండలు, Heat Stroke రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి
వడగాలుల హెచ్చరిక.. ప్రాణాపాయం పెంచేస్తోన్న ఎండలు, Heat Stroke రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి
Embed widget