అన్వేషించండి

Intermediate Board: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం... వచ్చే ఏప్రిల్ లో మరోసారి ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలపై ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు మరోసారి పరీక్షలు రాసేందుకు అవకాశం ఇచ్చింది.

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ లో ఫెయిలైన విద్యార్థుల కోసం ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన విద్యార్థులకు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. గురువారం ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 49 శాతం మంది విద్యార్థులు పాసైయ్యారు. దీంతో వివాదం నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేశారు. ఫలితాలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని బోర్డు అధికారులు తెలిపారు. అనుమానం ఉంటే ఫీజు చెల్లించి జవాబు పత్రాలు పొందవచ్చన్నారు. పరీక్షల్లో సిలబస్‌ 70 శాతానికి తగ్గించామని, ఛాయిస్‌ కూడా ఇచ్చామని పేర్కొన్నారు. 

తల్లిదండ్రులు ఆందోళనలు

తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఏకంగా 51 శాతం మంది ఫెయిలవడం వివాదాస్పదంగా మారింది.  విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళనలు ప్రారంభించారు.  గత ఏడాది 60 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ఈ సారి  49 శాతానికే పరిమితమయింది. కరోనా టైమ్‌లో విద్యార్ధులు ఎన్నో ఇబ్బందులు పడి పరీక్షలు రాస్తే.. మరీ ఇంత తక్కువ మందిని పాస్ చేస్తారా అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభ్యంతరం తెలుపుతున్నారు. పేపర్ వాల్యుయేషన్ కఠినంగా చేశారనీ బాగా చదివే పిల్లలు కూడా  ఫెయిల్ అయ్యారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నెల రోజులే టైమ్ ఇచ్చి పరీక్షలు పెట్టారని ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగానే ఇంత మంది ఫెయిల్ అయ్యారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు ప్రారంభించాయి. 

తగ్గిన ఉత్తీర్ణత

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఉత్తీర్ణత బాగా తగ్గిపోయింది. ఈసారి జనరల్‌, ఒకేషనల్‌ కలిపి 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం మంది పాస్ అయ్యారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 60.01 కాగా ఈ సంవత్సరం 11 శాతం తగ్గింది. గురువారం మధ్యాహ్నం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఫస్ట్ ఇయర్ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్ లో మొత్తం 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. బాలికలు 56 శాతం, బాలురు 42శాతం ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఫలితాలను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్ ఫలితాలను tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా http://results.cgg.gov.in లేదా http://examresults.ts.nic.in  ఫలితాలు చూసుకోవచ్చు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు అక్టోబ‌ర్ 25, 2021 నుంచి న‌వంబ‌ర్ 3, 2021 వ‌ర‌కు నిర్వహించారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 4,59,242 విద్యార్థులు హాజరయ్యారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG EAPCET 2026 Toppers List: తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
TS EAPCET 2026 Results : తెలంగాణ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
CBSE New Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
AP ICET 2026 Results: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS PBKS Result Update: ఆర్సీబీ ధ‌మాకా.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జ‌ట్టుగా రికార్డు.. పంజాబ్ పై ఘ‌న‌విజ‌యం.. రాణించిన శ‌శాంక్, సలామ్, భువీ
ఆర్సీబీ ధ‌మాకా.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జ‌ట్టుగా రికార్డు.. పంజాబ్ పై ఘ‌న‌విజ‌యం.. రాణించిన శ‌శాంక్, సలామ్, భువీ
Vidadala Rajini: డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
Nara Devanash YouTube Channel: కంటెంట్ క్రియేటర్‌గా మారిన నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రారంభం
కంటెంట్ క్రియేటర్‌గా నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రారంభం
Vishal - CM Joseph Vijay: తమిళనాడు సీఎం విజయ్ మంత్రివర్గ కూర్పుపై విశాల్ అసంతృప్తి... దళపతి ముందు మూడు డిమాండ్స్
తమిళనాడు సీఎం విజయ్ మంత్రివర్గ కూర్పుపై విశాల్ అసంతృప్తి... దళపతి ముందు మూడు డిమాండ్స్
Fire Accident: యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
TG EAPCET 2026 Toppers List: తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
Embed widget