అన్వేషించండి

Kadapa News: యువకులతో వెళ్లిన యువతి శవమై తేలింది, అసలేం జరిగిందంటే?

Kadapa News: ఐదుగురు యువకులతో పాటు ఓ కోటను చూసేందుకు వెళ్లిన అమ్మాయి శవంగా కనిపించింది. మృతదేహం తలపై వెంట్రుకలు లేకుండా ఓ వైపు కాలిపోయి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

Kadapa News: రోజూలాగే ఇంటి నుంచి కళాశాలకు వెళ్లిన అమ్మాయి.. అక్కడి ఐదుగురు యువకులతో కలిసి కోటను చూసేందుకు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె జాడ కనిపించడం లేదు. తీవ్ర భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి మృతదేహం లభ్యమైంది. మృతదేహం తలపై వెంట్రుకలు లేకపోవడం, ఓ వైపు మొహమంతా కాలి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. 

కాలేజీకి వెళ్లిన డిగ్రీ విద్యార్థిని తిరిగిరాలేదు 
వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం మారాటిపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష బద్వేల్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఈనెల 20వ తేదీన రోజూలాగే కళాశాలకు వెళ్లింది. కానీ సాయంత్రం గడుస్తున్నా అమ్మాయి ఇంటికి రాలేదు. ఆమె స్నేహితులకు, కళాశాల యాజమాన్యానికి, బంధువలకు ఫోన్ చేశారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలే రోజులు బాగోలేవని.. పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిదని భావించిన తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే మూడు రోజుల తరువాత సిద్ధవటం మండలం జంగాలపల్లి వద్ద పెన్నా నదిలో అనూష శవమై కనిపించింది. మృతదేహం తమ కుమార్తెదేనని అనూష తల్లిదండ్రులు గుర్తించారు. మృతదేహంపై తలపైన వెంట్రుకలు ఈడిపోయి ఉండడం, మొహానికి ఓవైపు కాలినట్లు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

దీనంతటికి బద్వేల్ మండలం పాపిరెడ్డి పల్లెకు చెందిన గురు మహేశ్వర్ రెడ్డియే కారణం అని అనూష తల్లిదండ్రులు సిద్ధవటం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుమహేశ్వర్ రెడ్డి, అనూష ఇద్దరూ ఓకే కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. అయితే ఈనెల 20వ తేదీన గురు మహే్ృశ్వర్ రెడ్డి, అనూష, మరో నలుగురు యువకులు కలిసి సిద్ధవటం కోటకు వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. సిద్ధవటం కోటకు వెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటనా స్ఖలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనూష తల్లిదండ్రుల ఫిర్యాదుతో గురు మహేశ్వర్ రెడ్డితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు తీరుపై అనూష కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసుపై దర్యాప్తు జరుగుతోందన్న డీఎస్పీ వంశీధర్ గౌడ్.. గురు మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. 

పక్కింటివారే హత్య చేశారు - గోతాంలో కట్టి పెన్నాలో పడేశారు

నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ హత్య స్ధానికంగా కలకలం రేపింది. పక్క పక్కన ఇళ్లలో నివసించే వారి మధ్య గొడవ మొదలై చివరకు ఓ నిండు ప్రాణం బలైంది. హత్య పథకం వేసిన అన్నదమ్ములు, మూడో కంటికి తెలియకుండా ఆ పథకం అమలు చేశారు. చివరకు పాత కక్షల వల్ల పక్కింటి వ్యక్తిని హత్య చేశారని తెలుసుకుని బాధిత కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. పైకి నమ్మకంగా ఉంటూ చివరకు హత్య చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు సమీపంలోని స్టౌబీడీ కాలనీకి చెందిన షేక్‌ గౌస్‌ మొహియుద్దీన్‌ కనిపించడంలేదని అతని భార్య సలీమా ఈనెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సహజంగా ఇరుగు పొరుగువారిని విచారించారు. వారంతా ఆయనతో శతృత్వం లేనట్టే చెప్పారు. అయితే హంతకులు తమకు తామే బయటపడ్డారు. పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టే సరికి భయంతో నిజం చెప్పేశారు.

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Embed widget