అన్వేషించండి

Yadadri Crime News: ప్రేమ వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్య , గతంలోనూ ఓసారి ఆత్మహత్యాయత్నం

Yadadri Crime News: యువకుడి ప్రేమ వేధింపులు భరించలేక పదో తరగతిని విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గంతోనూ ఓసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా.. అదృష్టవశాత్తు బతికింది. కానీ..! 

Yadadri Crime News: ఆ అమ్మాయి పదో తరగతి చదువుతోంది. అయితే అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు చాలా కాలంగా ఈ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఎన్ని సార్లు ఇది మానుకోవాలని చెప్పినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఓసారి ధైర్యం చేసిన అమ్మాయి గట్టిగా గొడవ పడింది. అయినా అతడు వేధింపులకు పాల్పడుతూనే ఉన్నాడు. దీంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థిని గతనెల 31వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చగా.. అదృష్టవశాత్తు బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈనెల 2వ తేదీనే డిశ్చార్జీ అయింది. ఇంత జరిగినా సదరు యువకుడు వేధింపులు ఆపలేదు. దీంతో మరోసారి బాలిక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..?

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లిక్ పల్లి గ్రామానికి చెందిన 16 ఏళ్ల ఉప్పునూతల కావ్య.. చౌటుప్పల్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో పదో తరగతి చదువుతోంది. అయితే బాలిక అప్పుడప్పుడూ సోషల్ మీడియా వాడేది. ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి యాప్స్ వాడేది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన మాచర్ల శివమణి.. కావ్యకు ఇన్ స్టా గ్రామ్ ద్వారా మెసేజ్ లు పంపించేవాడు. పెళ్లి చేసుకోవాలంటూ వేధించేవాడు. అయితే అమ్మాయి అతడి ప్రేమను నిరాకరించింది. దీంతో శివమణి బెదిరింపులకు పాల్పడేవాడు, మీ అన్నను, నాన్నను చంపేస్తానంటూ వేధించేవాడు. డబ్బులు కూడా ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. భయపడ్డ కావ్య ఇటీవలే ఆ విషయాన్ని తన సోదరుడు నరేష్ కు తెలిపింది. దీంతో తన చెల్లికి మెసేజ్ పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని శివమణిని నరేష్ హెచ్చరించాడు. 

ఇదే క్రమంలో డిసెంబర్ 31వ తేదీన నరేష్, శివమణి మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం సద్దుమణిగాక ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. అయితే శివమణి మళ్లీ కావ్యకు ఫోన్ చేసి ఈరోజు మీ అన్నను చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిన కావ్య.. తాను చనిపోతే ఈ సమస్య తీరుతుందని భావించింది. వెంటనే ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు.. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించారు. అదృష్టవశాత్తు కావ్య ప్రాణాలతో బయటపడింది. ఈనెల 2వ తేదీన కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కూడా అయింది. అయితే తమ కూతురు ఆత్మహత్య వరకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు పంచాయతీ పెట్టించారు. 

ఇకపై శివమణి.. కావ్య, ఆమె కుటుంబ సభ్యుల జోలికి పోకుండా చూసుకోవాలని అతడి తల్లిదండ్రులకు తెలిపారు. అయినా శివమణి మెసేజ్ లు చేస్తూనే ఉన్నాడు. ఇంత జరిగినా పట్టించుకోకుండా.. కావ్య వెంట పడుతూనే ఉన్నాడు. దీంతో తీవ్రంగా కలత చెందిన కావ్య ప్రాణాలు తీసుకోవాలనుకుంది. బుధవారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుంది. సాయంత్రం నరేష్ ఇంటికి వచ్చి చూడగా.. కావ్య ప్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన నరేష్ విపరీతంగా ఏడ్చాడు. అది విన్న స్థానికులు కూడా వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకొని కావ్య మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఆస్పత్రికి తరలించారు. 

అయితే గురువారం సాయంత్రం కావ్యకు అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతురాలి తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. కాగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోచంపల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థినులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ... ర్యాలీ నిర్వహించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Husband plans to murder his wife: రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget