అన్వేషించండి

Warangal News : మందుల కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి, రోడ్డు ప్రమాదంలో తాత మనవరాలు మృతి!

Warangal News : వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందుల కోసం వచ్చి తాత మనుమరాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

 Warangal News : వరంగల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. నర్సంపేట మండలంలోని ఆకులతండాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నర్సంపేట- మల్లంపల్లి హైవేపై ఇటుకాలపల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత, మూడేళ్ల మనవరాలు మృతి చెందారు. ఆకులతండాకు చెందిన ధరావత్ పాచ్య, నాగమ్మ దంపతులు తమ కుమారుడైన యాకూబ్ కూతురు పూర్ణిమతో కలిసి బైక్ పై శుక్రవారం మందుల కోసం ఇటుకాలపల్లిలోని మెడికల్ షాపునకు వెళ్లారు. మెడికల్ షాపులో మందులు తీసుకుని ముగ్గురు బైకుపై తిరిగి ఆకులతండాకు బయలుదేరారు.

సిమెంటు లారీ ఢీకొని ఇద్దరు మృతి

ముగ్గురు ప్రయాణిస్తున్న బైక్ ను ఇటుకాలపల్లిలోని హైవేపై సిమెంటు లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి పూర్ణిమ ఘటనాస్థలంలోనే చనిపోయింది. తీవ్రంగా గాయపడిన పాచ్య, నాగమ్మ దంపతులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలో పాచ్య(62) మరణించాడు. తీవ్రగాయాలు పాలైన భార్య నాగమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు అంటున్నారు. పాచ్య, నాగమ్మ దంపతుల కుమారుడు యాకూబ్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా ఛత్తీస్ గడ్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మనవరాలు పూర్ణిమ ఆకులతండాలో తాత, నానమ్మ వద్ద తల్లితో సహా ఉంటుంది. మందుల కోసం మనవరాలిని వెంట తీసుకుని ఇటుకాలపల్లిలోని మెడికల్ షాపునకు వెళ్లగా లారీ రూపంలో మృత్యువు కబలించడంతో ఆకులతండాలో విషాదం నెలకొంది.  

Warangal News : మందుల కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి, రోడ్డు ప్రమాదంలో తాత మనవరాలు మృతి!

రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని విద్యార్థిని మృతి

 విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ లో నిన్న జరిగిన ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. అయితే రైలు దిగే క్రమంలో ప్రమాద వశాత్తు జారిపడి ప్లాట్ ఫాంకు రైలుకు మధ్య ఇరుక్కొని గంటలపాటు నరకం చూసిన విద్యార్థిని శశికళ గురువారం మృతి చెందింది. చికిత్స పొందతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే చదువుకునేందుకు కళాశాలకు వెళ్లిన అమ్మాయి ఇలా ప్రమాదానికి గురై చనిపోవడాన్ని ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. అచేతనంగా పడి ఉన్న కూతురును చూస్తూ కన్నీరుమున్నీరవుతున్నారు. విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు ప్రమాదం జరిగింది. రైలు దిగబోతుండగా ఓ యువతి ప్రమాదవశాత్తు జారి పడింది. దీంతో రైలుకు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయింది. విషయం గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అమ్మాయిని అందులోంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ ఎంత ప్రయత్నించినా కుదరలేదు. దీంతో కూలీలను రప్పించి ప్లాట్ ఫాంను పగులగొట్టారు. ఇలా అమ్మాయిని బయటకు తీశారు. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన యువతి పేరు శశికళ. ఆమె కళాశాలకు వచ్చేందుకు గోపాలపట్నం నుంచి దువ్వాడకు వస్తోంది. ఈ క్రమంలోనే ప్రమాదం జరగడం.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఇలాంటి కష్టం మరొకరికి రాకూడదని కోరుకుంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
The Raja Saab Box Office Collection Day 1: వంద కోట్లు కంటే ఎక్కువ వచ్చాయ్ - ఫస్ట్ డే కలెక్షన్స్ అనౌన్స్ చేసిన 'రాజా సాబ్' నిర్మాత
వంద కోట్లు కంటే ఎక్కువ వచ్చాయ్ - ఫస్ట్ డే కలెక్షన్స్ అనౌన్స్ చేసిన 'రాజా సాబ్' నిర్మాత
Sankranti Rush: సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట

వీడియోలు

MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు
Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
The Raja Saab Box Office Collection Day 1: వంద కోట్లు కంటే ఎక్కువ వచ్చాయ్ - ఫస్ట్ డే కలెక్షన్స్ అనౌన్స్ చేసిన 'రాజా సాబ్' నిర్మాత
వంద కోట్లు కంటే ఎక్కువ వచ్చాయ్ - ఫస్ట్ డే కలెక్షన్స్ అనౌన్స్ చేసిన 'రాజా సాబ్' నిర్మాత
Sankranti Rush: సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
Dhandoraa OTT : ఓటీటీలోకి 'దండోరా' - తెలుగుతో పాటు ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'దండోరా' - తెలుగుతో పాటు ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Telangana Latest News: అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
The Raja Saab BO Day 1 In Hindi: ప్రభాస్ 'ది రాజా సాబ్' సంచలనం... 11 ఏళ్ల రికార్డు బద్దలు - హిందీలో 100 కోట్లు సాధిస్తుందా?
ప్రభాస్ 'ది రాజా సాబ్' సంచలనం... 11 ఏళ్ల రికార్డు బద్దలు - హిందీలో 100 కోట్లు సాధిస్తుందా?
Bandla Ganesh : బండ్ల గణేష్ మహా పాదయాత్ర - షాద్ నగర్ To తిరుపతి... ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో...
బండ్ల గణేష్ మహా పాదయాత్ర - షాద్ నగర్ To తిరుపతి... ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో...
Embed widget