Ind vs nz 2nd odi highlights: రాజ్కోట్లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
భారత్తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. డారిల్ మిచెల్ శతక ఇన్నింగ్స్ ఆడటంతో సిరీస్ 1-1తో సమం అయ్యింది.

India vs New Zealand Highlights: రెండవ వన్డేలో భారత్ అన్ని విభాగాల్లో విఫలమైంది. దాంతో పర్యాటక జట్టు న్యూజిలాండ్ చేతిలో భారత్ 7 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. దీంతో న్యూజిలాండ్ 3 వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. డారిల్ మిచెల్ (Daryl Mitchell) సెంచరీ ఇన్నింగ్స్ తో భారత్కు ఓటమి తప్పలేదు. రాజ్కోట్లో జరిగిన ఈ వన్డే మ్యాచ్లో ఇండియా మొదట బ్యాటింగ్ కు దిగి 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మోస్తరు టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన కిస్వీ జట్టు 48వ ఓవర్లోనే ఈ లక్ష్యాన్ని సాధించింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయిన తర్వాత భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ మంచి తొలి వికెట్ భాగస్వామ్యం అందించారు. 70 పరుగుల వద్ద రోహిత్ ఔట్ కాగా, విరాట్ కోహ్లీ తో కలిసి గిల్ ఇన్నింగ్స్ నడిపించాడు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఈ వన్డేలో విఫలమయ్యారు. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (56 పరుగులు) హాఫ్ సెంచరీ చేశాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్లో విఫలం కావడంతో రాహుల్ మీద బారం పడింది. అతడు జడేజాతో పాటు నితీష్ కుమార్ రెడ్డితో కలిసి భారత ఇన్నింగ్స్ నడిపించాడు. మరో ఎండ్ లో వికెట్ పడకుండా అడ్డుగోడగా నిలిచాడు. కేఎల్ రాహుల్ 112 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి టీమ్ ఇండియాను 284 స్కోరుకు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. రాహుల్ వన్డే కెరీర్లో ఇది 8వ సెంచరీ. కానీ బౌలింగ్ లో విఫలం కావడంతో భారత్కు ఓటమి తప్పలేదు. కివీస్ బ్యాటర్లు యంగ్ 87తో కలిసి డారిల్ మిచెల్ భారత్ ను దెబ్బకొట్టాడు.
New Zealand win the 2nd ODI in Rajkot and level the series 1⃣-1⃣
— BCCI (@BCCI) January 14, 2026
Scorecard ▶️ https://t.co/x1fEenI0xl#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/XZioDArcsG
డారిల్ మిచెల్ శతక ఇన్నింగ్స్
న్యూజిలాండ్ 50 పరుగులకు చేరుకునేలోపే రెండు వికెట్లు కోల్పోయింది. హర్షిత్ రాణా ఓపెనర్ డేవాన్ కాన్వే(16)ను బౌల్డ్ చేశాడు. ఆ తరువాత హెన్రీ నికోల్స్(10)ను ప్రసిద్ద్ కృష్ణ ఔట్ చేశాడు. కానీ భారత బౌలర్లు ఆ తరువాత పూర్తిగా తేలిపోయారు. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లను విల్ యంగ్, డారిల్ మిచెల్ సమర్థంగా ఎదుర్కొన్నారు. మూడో వికెట్ కు డారిల్ మిచెల్, విల్ యంగ్ 162 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం మ్యాచ్ను భారత్ నుంచి లాగేసింది. విల్ యంగ్ 87 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ డారిల్ మిచెల్ మరొక ఎండ్లో అలాగే నిలబడ్డాడు. డారిల్ మిచెల్ 117 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 131 పరుగులతో అజేయంగా నిలిచి న్యూజిలాండ్ కు విజయాన్ని అందించాడు.
భారత్ తరపున కుల్దీప్ యాదవ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. కుల్దీప్ ఒక వికెట్ తీశాడు, కానీ 10 ఓవర్లలో 82 పరుగులు ఇచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తీశారు. తొలి వన్డేలో భారత్ నెగ్గగా, రెండో వన్డేలో కివీస్ విజయం సాధించింది. దాంతో సిరీస్ 1-1తో సమమైంది. జనవరి 18న ఇండోర్ వేదికగా జరిగే వన్డే సిరీస్ విజేతను డిసైడ్ చేస్తుంది.
ఆదుకున్న రాహుల్.. కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీ
రాజ్కోట్లో న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో భారత్ 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ఓపెనర్లలో రోహిత్ (23) విఫలమైనా, కెప్టెన్ శుభ్మన్ గిల్ (56) అర్ధ సెంచరీతో రాణించాడు. అయితే కోహ్లీ (23), అయ్యర్(8) త్వరగా ఔట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో (వన్డేల్లో 8వది) జట్టును ఆదుకున్నాడు. జడేజా (27), నితీష్ రెడ్డి (20) సహకారంతో ఇన్నింగ్స్ నిర్మించిన రాహుల్, చివరిలో గేర్ మార్చి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సెంచరీ తర్వాత రాహుల్ వినూత్నంగా సెలబ్రేట్ చేసుకోవడం హైలైట్గా నిలిచింది. కివీస్ బౌలర్లలో క్లార్క్ 3 వికెట్లు తీయగా, బ్రేస్వెల్, ఫోక్స్, జేమీసన్ లు ఒక్కో వికెట్ పడగొట్టి సమష్టిగా రాణించారు.





















