అన్వేషించండి

Vikarabad News : ప్రియుడి ఇంట్లో యువతి ఆత్మహత్యాయత్నం, పెళ్లికి పది లక్షల కట్నం డిమాండ్ చేసిన యువకుడు!

Vikarabad News : ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకునేందుకు కట్నం డిమాండ్ చేయడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడి ఇంట్లోనే గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Vikarabad News : వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లిలో దారుణం జరిగింది. దోమ గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడి ఇంటి వద్ద అతని ప్రియురాలు గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. హైదరాబాద్ ఈసీఐఎల్ కు చెందిన యువతిని నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువతి తల్లి ఆరోపిస్తుంది. ఇప్పుడు కట్నం పేరుతో మోహం చాటేస్తున్నాడని అందుకే యువతి మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిపింది. బంజారా హిల్స్ లో ఓ సూపర్ మార్కెట్ లో పని చేస్తున్న వీరువురికి ఆరు నెలల క్రితం పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన నవీన్ ఇప్పుడు మోహం చాటేశాడు. 

పది లక్షల కట్నం డిమాండ్

వారం రోజుల క్రితం యువతి ఇంట్లో చెప్పకుండా యువకుడి ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటానని మొండికేసింది. గ్రామ సర్పంచ్, కొందరు పెద్దలు మీ ఇంట్లో పెద్దవారిని తీసుకుని వస్తే మాట్లాడి ఒప్పిద్దామని యువతికి నచ్చజెప్పి తిరిగి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు యువతితో కలిసి యువకుడి ఇంటికి వచ్చారు. పది లక్షల కట్నం, పది తులాల బంగారం ఇస్తే గాని పెళ్లి చేసుకునేది లేదంటూ యువకుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆవేశానికి లోనైన యువతి అక్కడే ఉన్న బ్లేడ్ తో గొంతు కోసుకుంది. యువతిని వెంటనే పరిగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు ఆమె కుటుంబసభ్యులు. ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చి ప్రథమ చికిత్స అందజేసి హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. 

ప్రియుడి భార్య మర్డర్ 

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నం ఆకుల వారి వీధిలో ఇల్లు దగ్ధమై ఇద్దరు సజీవ దహనమయ్యారు. ముందు ప్రమాదం అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో కళ్లుబైర్లకమ్మే వాస్తవాలు వెలుగు చూశాయి.  వివాహేతర సంబంధం కారణంగానే అదే గ్రామానికి చెందిన మహిళ ఈ దారుణానికి ఒడిగట్టిందని తేల్చారు. తన ఇద్దరి కుమార్తెలతో కలిసి కుట్ర చేసినట్టు విచారణలో వెల్లడైంది. 

కేసులో నిందితులుగా ఉన్న సుంకర నాగలక్ష్మి, ఆమె ఇద్దరు కుమార్తెలు సుంకర సౌజన్య, దివి హరితను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వీరికి రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈనెల రెండో తేదీ కొమరగిరి పట్నం గ్రామంలో సాధనాల మంగాదేవి, ఆమె కుమార్తె మేడిశెట్టి జ్యోతి ఒకే గదిలో నిద్రిస్తుండగా అగ్ని కీలలు అంటుకున్నాయి. వేరే గదిలో పడుకున్న మృతురాలు మంగాదేవి భర్త లింగయ్యలో ప్రాణాలతో బయటపడ్డాడు. చాలా మంది ఇది ప్రమాదమే అనుకున్నారు. కానీ ఫ్యామిలీ మెంబర్స్‌ మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. 

మంగాదేవి భర్త లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించారు. సాక్ష్యుల చెప్పిన వివరాలతో జ్యోతి భర్త మేడిశెట్టి సురేష్‌ని విచారించారు పోలీసులు. అతను చెప్పిన మాటలకు పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న జ్యోతిని ప్రేమించి పెళ్లి తాను గోడితిప్ప గ్రామంలో కాపురం పెట్టామన్నాడు. అక్కడ తను ఆటోలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన భార్య జ్యోతికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానం కలిగేలా ప్రేమలేఖలు రాశారని చెప్పాడు. తాము ఉంటున్న ఇంటి పరిసరాల్లో కూడా పడేశారని వెల్లడించాడు. 

ఈ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయి నిజాలు తెలిశాయి. మృతురాలు జ్యోతి భర్త సురేష్‌కి, సుంకర నాగలక్ష్మి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తేలింది. కుటుంబం అవసరాలకు సురేష్ డబ్బులు ఇచ్చే వాడని కూడా స్పష్టమైంది. జ్యోతితో పెళ్లైన తర్వాత ఈ సంబంధానికి బ్రేక్ పడింది. సుంకర నాగ లక్ష్మితో మాట్లాడటం మానేశాడు సురేష్. డబ్బులు కూడా ఇవ్వడం మానేశాడు. దీంతో సురేష్‌, జ్యోతి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసింది నాగలక్ష్మి. తన ఇద్దరు కుమార్తెలను అందుకు వాడుకుంంది. గ్రామంలో ఒక షాపులో కలర్స్ పేపర్లు కొని సురేష్‌కు జ్యోతిపై అనుమానం వచ్చేలా లెటర్స్‌ రాసింది. అయినా సురేష్‌ జ్యోతిపై అనుమానం రాలేదు... నాగలక్ష్మివైపు చూడటం లేదు. దీంతో జ్యోతిని ఎలిమినేట్ చేస్తే తప్ప తన లైన్‌ క్లియర్ కాదని భావించింది. ఈ నెల రెండున తెల్లవారుజామున కుమార్తెల సాయంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. ఆ మంటల్లో సురేష్ భార్య జ్యోతి, జ్యోతి అమ్మ మంగాదేవి చనిపోయారు. ఇంటికి మంటలు అంటుకొన్నప్పుడు జ్యోతి తండ్రి లింగయ్య ఆ మంటలకు నిద్రలేచి తన భార్య కుమార్తెలను రక్షించే ప్రయత్నం చేసినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది.  అతను ప్రాణాపాయం తప్పించుకొని బయట పడ్డాడు.

 

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget