అన్వేషించండి

UP Encounter List: యూపీ గ్యాంగ్‌స్టర్‌ల వెన్నులో వణుకు, యోగి హయాంలో 183 మంది ఎన్‌కౌంటర్

UP Encounter List: యూపీలో ఆరేళ్ల యోగి హయాంలో 183 మంది గ్యాంగ్‌స్టర్‌లను ఎన్‌కౌంటర్ చేశారు.

UP Encounter List:

మాఫియాను మట్టి కరిపిస్తున్న యోగి..

"ఈ మాఫియాను మట్టి కరిపిస్తా". ఈ ఏడాది ఫిబ్రవరిలో యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ మాఫియా డాన్‌లకు ఈ వార్నింగ్ ఇచ్చారు. అలా వార్నింగ్ ఇచ్చిన 50 రోజుల్లోనే మూడు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఉమేష్ పాల్‌ హత్య జరిగింది. ఆ తరవాత రెండ్రోజులకే ఈ హత్యతో సంబంధం ఉన్న అర్బాజ్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 13న అసద్‌, గులాంను కూడా కాల్చి పారేశారు. మాఫియాపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తోంది యోగి సర్కార్. బెదిరింపులు, హత్యలు లాంటివి చేస్తే కాల్చి పారేస్తాం అని గన్‌తోనే సమాధానమిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకూ దాదాపు 183 మందిని ఎన్‌కౌంటర్ చేశారు యూపీ పోలీసులు. 2020 నుంచి మాఫియాపై జీరో టాలరెన్స్‌ విధానం అమలు చేస్తోంది యోగీ ప్రభుత్వం. 

వరుస ఎన్‌కౌంటర్‌లు 

1. 2020లో జులై 10వ తేదీన గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబేను కాన్పూర్‌లో ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. పోలీస్ వాహనంలో తీసుకెళ్తుండగా దూబే తప్పించుకోడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో దూబే మృతి చెందాడు. 

2.2020లోనే జులై 25వ తేదీన గ్యాంగ్‌స్టర్‌ టింకు కపాలాను యూపీ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ జాయింట్‌ ఆపరేషన్ నిర్వహించి ఎన్‌కౌంటర్ చేశారు. 

3.2021లో అక్టోబర్ 18న బంగ్లాదేశ్ గ్యాంగ్‌స్టర్ హమ్‌జాను యూపీ పోలీసులు లఖ్‌నవూలో ఎన్‌కౌంటర్ చేశారు. 

4. సిద్ధ్‌పూర పోలీస్‌ స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్‌ని హత్య చేయడంతో పాటు ఓ పోలీస్‌ను గాయపరిచాడు గ్యాంగ్‌స్టర్ మోతి సింగ్. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు 2021 ఫిబ్రవరి 21న యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఇదే ఏడాది మార్చి 21న ఓ క్రిమినల్‌ని వారణాసిలో కాల్చి పారేశారు. 

5.2022 సెప్టెంబర్ 30న గ్యాంగ్‌స్టర్ వినోద్ కుమార్‌ సింగ్‌ని కూడా ఇలాగే ఎన్‌కౌంటర్ చేశారు. ఇక లేటెస్ట్‌గా అసద్‌ అహ్మద్, గులాంను ఎన్‌కౌంటర్ చేశారు. 

2017 నుంచి..

పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం...యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గ్యాంగ్‌స్టర్‌ల ఎన్‌కౌంటర్‌లు పెరిగాయి. ఈ ఆరేళ్లలో 183 మంది క్రిమినల్స్‌ ఆట కట్టించారు. 10,713 ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లలో చనిపోయిన వాళ్లంతా బడా క్రిమినల్సే. 13 రోజులకో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. 23,069 మంది అరెస్ట్ అయ్యారు. 2017 మార్చి 20 నుంచి 2023 మార్చి 6 మధ్య కాలంలో ఈ ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. వీటిలో 15 మంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 2017లో 28 మంది, 2018లో 41 మంది, 2019లో 34 మంది, 2020లో 26 మంది, 2021లో 26 మంది క్రిమినల్స్ పోలీసుల చేతుల్లో ప్రాణాలొదిలారు. ఇకపైనా ఇదే దూకుడుతో ఉండాలని పోలీసులకు చెప్పారు యోగి ఆదిత్యనాథ్. ఆ మధ్య ఇండియా టుడే సర్వేలో దేశంలోనే ది బెస్ట్ సీఎంగా రికార్డుకెక్కారు యోగి ఆదిత్యనాథ్. పని తీరులో ప్రజల ప్రశంసలు అందుకుంటున్న ముఖ్యమంత్రిగానూ నిలిచారు. ఇప్పుడు యూపీలో క్రైమ్ రేట్ తగ్గిస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. 

Also Read: Amazon LayOffs: కఠిన నిర్ణయం అని తెలుసు, కానీ తప్పడం లేదు - లేఆఫ్‌లపై అమెజాన్ సీఈవో కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
Lowest scores in IPL:ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
Lowest scores in IPL:ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
Tata Advanced Systems Limited:  టాటాలో ఉద్యోగాలు.డైరక్ట్ వాక్ ఇన్ …  ఎప్పుడు.. ఎక్కడంటే.. ?
టాటాలో ఉద్యోగాలు.డైరక్ట్ వాక్ ఇన్ … ఎప్పుడు.. ఎక్కడంటే.. ?
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
Ramya Moksha Kancharla: అలేఖ్య కాదు... రమ్య మోక్ష పికిల్స్... కమ్ బ్యాక్ అనౌన్స్ చేసిన చిట్టి చెల్లెలు
అలేఖ్య కాదు... రమ్య మోక్ష పికిల్స్... కమ్ బ్యాక్ అనౌన్స్ చేసిన చిట్టి చెల్లెలు
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
Embed widget