By: ABP Desam | Updated at : 02 Jul 2022 05:16 PM (IST)
ఉదయ్ పూర్ హంతకులు బీజేపీ సభ్యులంటున్న కాంగ్రెస్
Udaipur killer BJP member : రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ను మంగళవారం దారుణంగా తల నరికి చంపిన హంతకులు రియాజ్ అఖ్తరీ, గోస్ మొహమ్మద్లకు బీజేపీతో సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. నిందితులు బీజేపీ నేతలతో కలిసి దిగిన ఫొటోల ఆధారాలను కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
BJP President @JPNadda ji,
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) July 2, 2022
Kindly see the pictures of the terror accused from #Udaipur with Your BJP MLA and Opposition leader in Rajasthan assembly Gulab Singh Kataria .
What #NationalExecutiveMeeting will discuss?
How 2give safe passage to him ?
What a shameless party BJPis? pic.twitter.com/StwnLsakAn
కన్హయ్యను చంపిన కిల్లర్స్లో ఒకరైన రియాజ్ అఖ్తరీ రాజస్థాన్ బీజేపీ మైనారిటీ సెల్లో కీలక సభ్యుడని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ మైనార్టీ సెల్ నేతలైన ఇర్షాద్ చైన్వాలా, మహ్మద్ తాహిర్తో ప్రధాన నిందితుడు దిగిన ఫొటోలను మీడియా ఎదుట బయటపెట్టారు. అంతేగాక రాజస్థాన్ బీజేపీ నేత, మాజీ మంత్రి గులాబ్చంద్ కటారియా కార్యక్రమాల్లో కూడా రియాజ్ పాల్గొన్న ఫోటోలు కూడా విడుదల చేశారు.
श्री @Pawankhera जी ने आज की प्रेस कॉन्फ्रेंस के सनसनीखेज खुलासे में #उदयपुर हॉरर आरोपी मोहम्मद रफीक के बीजेपी के गुलाब चंद कटारिया के साथ संबंध और पार्टी के कई कार्यक्रमों में उनकी भागीदारी पर सबूत साझा किए। pic.twitter.com/UPbrPLKVlH
— TeriMonk (@teri_monk) July 2, 2022
Udaipur's BJP leader Terror Riyaz Attari, who killed tailor Kanhaiyalal.
— Gaurav Pandhi (@GauravPandhi) July 2, 2022
The NIA should probe how Pakistan based terror outfit & BJP are working hand in glove to spread communal hatred in India! pic.twitter.com/CALcKgBX2x
హంతకులు బీజేపీకి చెందిన వారు కాబట్టే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కేసును తొక్కిపెట్టేందుకు ఎన్ఐఏ దర్యాప్తునకు అప్పగించిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతల ఆరోపణలను బీజేపీ ఖండించింది. ప్రవక్తపై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన కన్హయ్య లాల్ను చంపిన నిందితులు బీజేపీ సభ్యులు కాదని ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్నవన్నీ తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలని విమర్శించారు. ఫోటోలు సాక్ష్యాలు కాదని స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో ఉగ్రకోణం ఉందని.. కేంద్రం భావిస్తోంది. అందుకే ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది.
Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య
Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!
Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..
Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?
Kamareddy Bus Accident : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు బోల్తా, 25 మందికి గాయాలు
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!
Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇక ఆన్లైన్లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!