అన్వేషించండి

Crime News: 5 నెలలుగా అపార్ట్‌మెంట్‌లో తండ్రీకూతురు మృతదేహాలు- కుళ్లిపోయి అస్తిపంజరాలుగా మారడంతో పోలీసులు షాక్

Tamil Nadu News | తమిళనాడులో దారుణం జరిగింది. చెన్నై తిరుముల్లైవాయల్‌లో ఐదు నెలలుగా తండ్రి, కూతురు మృతదేహాలు ఉంచడంతో

Man and daughter found dead inside flat in Chennai | చెన్నై: ఐదు నెలల నుంచి తండ్రి, కుమార్తె మృతదేహాలు ఓ అపార్ట్‌మెంట్ లో ఉంచిన ఘటన తమిళనాడు (Tamil Nadu)లో జరిగింది. వాసన రాకుండా మృతదేహాలపై రసాయనాలు చల్లుతూ కొన్ని నెలలుగా ఎవరికీ అనుమానం రాకుండా నిందితుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ ఏసీ పనిచేయకపోవడం, చుట్టుపక్కల వారికి వాసన రావడంతో ఎట్టకేలకు అపార్ట్‌మెంట్లో అస్తి పంజరాల మ్యాటర్ బయటకు వచ్చింది. వేలూరుకు చెందిన శామ్యూల్ శంకర్(70), ఆయన కుమార్తె సింధియా (37) ఎన్నో నెలల కిందటే చనిపోగా, వీరి మృతదేహాలు కుళ్లిపోయి, అస్తిపంజరాలుగా మారాయి.

అసలేం జరిగిందంటే..
వేలూరుకు చెందిన శామ్యూల్ శంకర్ కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నాడు. ఆయన కుమార్తె సింథియా తండ్రికి మెరుగైన వైద్యం కోసం చూస్తుండగా.. సోషల్ మీడియాలో పరిచయమైన డాక్టరు శామ్యూల్‌ ఎబినేజర్‌కు విషయం చెప్పింది. తన ఇంట్లో ఉంట్లో చికిత్స తీసుకోవాలని శామ్యూల్ శంకర్‌ను చెన్నై తిరుముల్లైవాయల్‌లోని తన అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చాడు ఎబినేజర్. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న శామ్యూల్ శంకర్ చనిపోయారు. 

తల్లికి తెలిస్తే ఆమె ప్రాణాలకు ప్రమాదమని భావించిన డాక్టర్

ఆయనది సహజ మరణమే అయినా, తన తండ్రి మృతికి కారణమని ఆరోపిస్తూ డాక్టర్ శామ్యూల్ ఎబినేజర్‌ తో గొడవకు దిగింది సింధియా. వీరి మధ్య జరిగిన వాగ్వాదంలో డాక్టర్ ఆమెను నెట్టివేయడంతో కింద పడగా, తలకు బలమైన గాయమై మృతిచెందింది సింధియా. ఇద్దరి మృతి బయటకు తెలిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని మాస్టర్ ప్లాన్ వేశాడు డాక్టర్ శామ్యూల్‌ ఎబినేజర్‌. డెడ్ బాడీస్‌ను తన అపార్ట్‌మెంట్‌లోనే ఉంచాడు. దుర్వాసన రాకుండా ఉండాలని అప్పుడప్పుడూ అక్కడికి వచ్చి వాటిపై రసాయనం చల్లుతూ వస్తున్నాడు. ఏసీ ఆన్ చేసి ఉంచి, తాను కాంచీపురంలో ఉండేవాడు. కొన్ని రోజుల కింద హార్ట్ సర్జరీ చేయించుకున్న తన తల్లికి విషయం తెలిస్తే ఆమెకు ప్రమాదమని ఐదు నెలల నుంచి విషయం బయటకు రానివ్వలేదు. ఎలాంటి అనుమానం రాకూడదని బంధువులు, స్నేహితులతో తరచుగా ఫోన్ కాల్, వాట్సాప్ కాల్ లో క్యాజువల్‌గా మాట్లాడుతుండేవాడు.

ఎలా బయటకు వచ్చిందంటే..
కొన్ని నెలలుగా ఏసీ ఆన్‌లోనే ఉండటంతో జనవరి 29న పాడయింది. డాక్టర్ అపార్ట్ మెంట్ నుంచి వాసన వస్తుందని పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. శామ్యూల్ ఎబినేజర్ రూం తాళాలు పగలగొట్టి వెళ్లి చూసిన పోలీసులు, స్థానికులు షాకయ్యారు. డాక్టర్ ఫ్లాట్‌లో ఇద్దరి శవాలు కుళ్లిపోయి అస్తిపంజరాలుగా కనిపించాయి. డాక్టర్ ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి, తరువాత పుళల్ జైలుకు తరలించారు. ఆ మృతదేహాలు శామ్యూల్ శంకర్, సింథియాలవని చెప్పిన నిందితుడు.. తాను ఎవరినీ హత్య చేయలేదన్నాడు. శామ్యూల్ శంకర్ అనారోగ్యంతో చనిపోగా, తనతో జరిగిన గొడవలో కిందపడి తలకు గాయమై సింథియా చనిపోయినట్లు విచారణలో నిందితుడు తెలిపాడు.

Also Read: Real Estate: ప్లాట్లు అమ్ముడుపోలేదని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య - సూసైడ్ నోట్ లభ్యం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Upcoming Cars in India: 3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!
3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!
Embed widget