అన్వేషించండి

Crime News: 5 నెలలుగా అపార్ట్‌మెంట్‌లో తండ్రీకూతురు మృతదేహాలు- కుళ్లిపోయి అస్తిపంజరాలుగా మారడంతో పోలీసులు షాక్

Tamil Nadu News | తమిళనాడులో దారుణం జరిగింది. చెన్నై తిరుముల్లైవాయల్‌లో ఐదు నెలలుగా తండ్రి, కూతురు మృతదేహాలు ఉంచడంతో

Man and daughter found dead inside flat in Chennai | చెన్నై: ఐదు నెలల నుంచి తండ్రి, కుమార్తె మృతదేహాలు ఓ అపార్ట్‌మెంట్ లో ఉంచిన ఘటన తమిళనాడు (Tamil Nadu)లో జరిగింది. వాసన రాకుండా మృతదేహాలపై రసాయనాలు చల్లుతూ కొన్ని నెలలుగా ఎవరికీ అనుమానం రాకుండా నిందితుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ ఏసీ పనిచేయకపోవడం, చుట్టుపక్కల వారికి వాసన రావడంతో ఎట్టకేలకు అపార్ట్‌మెంట్లో అస్తి పంజరాల మ్యాటర్ బయటకు వచ్చింది. వేలూరుకు చెందిన శామ్యూల్ శంకర్(70), ఆయన కుమార్తె సింధియా (37) ఎన్నో నెలల కిందటే చనిపోగా, వీరి మృతదేహాలు కుళ్లిపోయి, అస్తిపంజరాలుగా మారాయి.

అసలేం జరిగిందంటే..
వేలూరుకు చెందిన శామ్యూల్ శంకర్ కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నాడు. ఆయన కుమార్తె సింథియా తండ్రికి మెరుగైన వైద్యం కోసం చూస్తుండగా.. సోషల్ మీడియాలో పరిచయమైన డాక్టరు శామ్యూల్‌ ఎబినేజర్‌కు విషయం చెప్పింది. తన ఇంట్లో ఉంట్లో చికిత్స తీసుకోవాలని శామ్యూల్ శంకర్‌ను చెన్నై తిరుముల్లైవాయల్‌లోని తన అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చాడు ఎబినేజర్. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న శామ్యూల్ శంకర్ చనిపోయారు. 

తల్లికి తెలిస్తే ఆమె ప్రాణాలకు ప్రమాదమని భావించిన డాక్టర్

ఆయనది సహజ మరణమే అయినా, తన తండ్రి మృతికి కారణమని ఆరోపిస్తూ డాక్టర్ శామ్యూల్ ఎబినేజర్‌ తో గొడవకు దిగింది సింధియా. వీరి మధ్య జరిగిన వాగ్వాదంలో డాక్టర్ ఆమెను నెట్టివేయడంతో కింద పడగా, తలకు బలమైన గాయమై మృతిచెందింది సింధియా. ఇద్దరి మృతి బయటకు తెలిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని మాస్టర్ ప్లాన్ వేశాడు డాక్టర్ శామ్యూల్‌ ఎబినేజర్‌. డెడ్ బాడీస్‌ను తన అపార్ట్‌మెంట్‌లోనే ఉంచాడు. దుర్వాసన రాకుండా ఉండాలని అప్పుడప్పుడూ అక్కడికి వచ్చి వాటిపై రసాయనం చల్లుతూ వస్తున్నాడు. ఏసీ ఆన్ చేసి ఉంచి, తాను కాంచీపురంలో ఉండేవాడు. కొన్ని రోజుల కింద హార్ట్ సర్జరీ చేయించుకున్న తన తల్లికి విషయం తెలిస్తే ఆమెకు ప్రమాదమని ఐదు నెలల నుంచి విషయం బయటకు రానివ్వలేదు. ఎలాంటి అనుమానం రాకూడదని బంధువులు, స్నేహితులతో తరచుగా ఫోన్ కాల్, వాట్సాప్ కాల్ లో క్యాజువల్‌గా మాట్లాడుతుండేవాడు.

ఎలా బయటకు వచ్చిందంటే..
కొన్ని నెలలుగా ఏసీ ఆన్‌లోనే ఉండటంతో జనవరి 29న పాడయింది. డాక్టర్ అపార్ట్ మెంట్ నుంచి వాసన వస్తుందని పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. శామ్యూల్ ఎబినేజర్ రూం తాళాలు పగలగొట్టి వెళ్లి చూసిన పోలీసులు, స్థానికులు షాకయ్యారు. డాక్టర్ ఫ్లాట్‌లో ఇద్దరి శవాలు కుళ్లిపోయి అస్తిపంజరాలుగా కనిపించాయి. డాక్టర్ ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి, తరువాత పుళల్ జైలుకు తరలించారు. ఆ మృతదేహాలు శామ్యూల్ శంకర్, సింథియాలవని చెప్పిన నిందితుడు.. తాను ఎవరినీ హత్య చేయలేదన్నాడు. శామ్యూల్ శంకర్ అనారోగ్యంతో చనిపోగా, తనతో జరిగిన గొడవలో కిందపడి తలకు గాయమై సింథియా చనిపోయినట్లు విచారణలో నిందితుడు తెలిపాడు.

Also Read: Real Estate: ప్లాట్లు అమ్ముడుపోలేదని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య - సూసైడ్ నోట్ లభ్యం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
అస్సాంలో కూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. ఇద్దరు IAF పైలట్లు మృతి
అస్సాంలో కూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. ఇద్దరు IAF పైలట్లు మృతి
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget