Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సాత్తూరు సమీపంలో ఉన్న ఒక బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. శిథిలాల కింద కార్మికులు చిక్కుకున్నారు.

విరుదునగర్: తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సాత్తూరు సమీపంలో ఉన్న ఒక బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా దట్టమైన పొగ కమ్మేయడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.
ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని కనీసం 10 గదులు పూర్తిగా ధ్వంసమై, బిల్డింగ్ శిథిలాలు పరిసరాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే, ఈ ఫ్యాక్టరీ ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఎలాంటి చెల్లుబాటు అయ్యే లైసెన్స్లు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
#WATCH | Tamil Nadu | An explosion occured at a fireworks factory near Sattur in Virudhunagar district. More details awaited.
— ANI (@ANI) April 13, 2026
(Video Source: Fire Department) pic.twitter.com/rwuvHHHtaL
అనుమతులు లేని ఫ్యాక్టరీ?
ప్రాథమిక విచారణలో ఈ తయారీ కేంద్రం ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ యూనిట్కు చెల్లుబాటు అయ్యే లైసెన్స్లు కానీ, ప్రభుత్వ ఆమోదాలు కానీ లేవని వారు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 60 మంది వరకు కార్మికులు తయారీ కేంద్రంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















