అన్వేషించండి

Srikakulam Beach Tragedy : సిక్కోలు తీరంలో మృత్యుఘోష, విహారయాత్రల్లో వరుస విషాదాలు!

Srikakulam Beach Tragedy : సిక్కోలు సముద్ర తీరంలో వరుస ప్రమాదాల స్థానికులను కలవరపెడుతున్నాయి. కార్తీక మాసం కావడంతో విహారయాత్రకు వస్తున్న కొందరు అజాగ్రత్తతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

 Srikakulam Beach Tragedy : సిక్కోలు సముద్రతీరంలో మృత్యు ఘోష విన్పిస్తోంది. విహారయాత్రలకు వచ్చి సముద్రం స్నానాలకి దిగి మృత్యువాత పడుతున్న సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల వ్యవధిలో శ్రీకాకులం జిల్లాలోని ఎచ్చెర్ల, గార మండలాల పరిధిలోని బుడగట్ల పాలెం, మొగదాలపాడు ప్రాంతాలలో పలువురు మృత్యువాతపడ్డారు. ఈ వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రతి ఏడాది పిక్నిక్ సీజన్ లో ఇటువంటి ప్రమాదాలు జిల్లాలో చోటుచేసుకుంటునే ఉన్నాయి. వాటిని గమనించి జాగ్రత్తలు పాటించాల్సిన ప్రజలు అజాగ్రత్తతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సరదాగా సముద్ర స్నానాలు చేస్తూ అందని లోకాలకు చేరుకుంటున్నారు. కన్నవారికి కుటుంబ సభ్యుల గుండె కోతకి కారణమవుతున్నారు. 

కార్తీక మాసం కావడంతో 

కార్తీక మాసం సందర్భంగా ఆదివారం పిక్నిక్ లు పెద్ద ఎత్తున జిల్లాలో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో విహారాలకు వెళ్తున్నారు. రణస్థలం నుంచి ఇచ్చాపురం వరకూ అనేక చోట్ల బీచ్ లకు ప్రజలు క్యూ కడుతున్నారు. బుడగట్లపాలెం, డి.మత్స్యలేశం, బొంతల కోడూరు, పెద్దగణగళ్లవానిపేట, కుందువానిపేట, మొగదాలపాడు, కళింగపట్నం, బారువ, భావనపాడు ప్రాంతాలు ఆదివారం పూట కోలాహలంగా కన్పిస్తుంటాయి. సాధారణ రోజులలో కూడా విందులు, వినోదాల కోసం మిత్రులు, స్నేహితుల గ్రూపులు తీర ప్రాంతానికి వస్తుంటారు. అలా వచ్చిన వారిలో కొందరు మద్యం సేవించి స్నానాలకు దిగుతుంటారు. ఒక్కొసారి వారు పెద్ద పెద్ద కెరటాల బారిన పడి లోపలకి కొట్టుకుపోయి గల్లంతవుతున్నారు. తర్వాత ప్రాణాలు కోల్పోయి ఒడ్డుకు మృతదేహాలుగా చేరుతున్నారు. దీంతో విహారం కాస్తా విషాదంగా మారిపోతుంది. 

వరుస ఘటనలు 

ఆదివారం ఎచ్చెర్ల మండలంలోని బుడగట్లపాలెం తీరంలో పిక్నిక్ కి వచ్చిన వారిలో కొందరు సముద్ర స్నానాలకు దిగారు. అలా దిగిన వారిలో ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటకి చెందిన బెండి తేజేశ్వరరావు(19)తో పాటు లావేరు మండలంలోని మురపాక పంచాయితీ చెల్లయ్య అగ్రహారానికి చెందిన కలమటి ప్రసాదరావు(16) లు గల్లంతైయ్యారు. వారిద్దరూ కూడా విద్యార్థులే. తేజేశ్వరరావు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ప్రసాదరావు ఇంటర్ చదువుతున్నాడు. వారిద్దరిలో తేజేశ్వరరావు మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ప్రసాదరావు ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. దీంతో ఆ కుటుంబాలలో విషాదం నెలకొంది. అదేవిధంగా గార మండలంలోని మొగదాలపాడు తీరంలో బుధవారం విహార యాత్రకు స్నేహితులు వెళ్లారు. వారు సముద్ర స్నానాలకి దిగగా వారిలో శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని తోటపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు శంకరరావు, ఆమదాలవలస పట్టణం పరిధిలోని మెట్టక్కివనలకి చెందిన గొల్లపల్లి మనోజ్ కుమార్ లు గల్లంతయ్యారు. వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వరుసగా జరిగిన ఈ ఘటనలు విహార యాత్రలకి వెళ్లే వారిలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 

అజాగ్రత్తతో 

సముద్ర స్నానాలకి దిగేటప్పుడు అజాగ్రత్తగా ఉండడంతో పాటు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు అంటున్నారు. తీర ప్రాంతవాసులకి సముద్రపు అలలపై అవగాహన ఉంటుంది. ఆయా ప్రాంతాలకు సమీపంలో ఉన్న వారికి మినహా మిగిలిన వారికి అక్కడి పరిస్థితుల గురించి అంతగా తెలియదు. సముద్ర తీరంలో ఇసుక తిన్నెలు, ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. మునిగిపోయేంత లోతు లేకపోవడంతో ఈత వచ్చినా, రాకపోయినా పిల్లలు సముద్రస్నానం చేస్తారు. కెరటాల రాకపోకలపై అవగాహనలేకపోవడంతో తమకు తెలియకుండానేలోతుకుజారుకుంటారు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

కెరటాల రాకపోకలను గమనించాకే 

సముద్రంలో స్నానం చేసేటప్పుడు కెరటాల తాకిడి, ఎత్తు, కోతను గమనిస్తూ ఉండాలి. ఛాతీలోతు వరకూ వెళ్లి తాము సురక్షితంగా ఉన్నామని భావించడం సరికాదు. అన్ని కెరటాలు ఒకే ఎత్తు ఉండవు. కెరటాన్ని అధిగమించడానికి ఎత్తుకి ఎగిరేవారు కొందరైతే నీటిలో మునిగేవారు ఇంకొందరు. కొన్ని పరిస్థితుల్లో కెరటం తాకిడితో ఒడ్డుకు వచ్చేస్తారు. కొత్తగా సముద్ర స్నానం చేసేవారు ఈ విషయాలన్నీ పరిగణించరు. దీంతో ఎక్కువ మంది ప్రమాదాలకు గురవుతున్నారు. తీరానికి దూసుకువచ్చే కెరటం తిరుగు ప్రయాణంలో నేలను తాకుతూ వేగంగా వెళ్తుంది. ఈ క్రమంలో కాళ్ల దిగువన ఉన్న ఇసుకను తీసుకుపోతుంది. కొన్నిసార్లు లోతు గొయ్యి ఏర్పడుతుంది. ఈ క్రమంలో స్నానం చేసేవ్యక్తి మునిగిపోయి, ప్రవాహంలో సముద్రంలోకి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. తీరం కోతకు గురయ్యేటప్పుడు కెరటం వచ్చే దిశ ఒకలాగుంటే తిరుగు ప్రయాణం వేరే దిశలో ఉంటుంది. స్నానం చేసే వ్యక్తి రెండింటినీ బ్యాలెన్స్ చేయగలగాలి. తీరానికి సమీపంలో ఈత సాధ్యపడదు. ఈత వచ్చినవారు దీమాతో సాహసించి లోతుకు వెళ్తే ప్రమాదానికి గురయ్యే పరిస్థితి లేకపోలేదు.

హెచ్చరిక బోర్డులు కరువు

తీర ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు కూడా పూర్తి స్థాయిలో కన్పించడం లేదు. పిక్నిక్ సీజన్ లో ఆదివారం పూట తీర ప్రాంతంలో స్థానిక పోలీసులు, మైరెన్ పోలీసులు గస్తీగా ఉంటున్నా ఇతర రోజుల్లో మాత్రం గస్తీ కొరవడుతుంది. కనీసం ఈ సీజన్ లోనైనా తీర ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఇదే సందర్భంలో తీర ప్రాంతానికి వచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మద్యం మత్తులో సముద్ర స్నానాలకి దిగి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని సలహా ఇస్తున్నారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ganja Seized: బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
Zaheerabad Crime: పోలీసుల ముందే ఘోరం - ప్రియుడితో వెళ్లిన భార్య గొంతు కోసిన భర్త!
పోలీసుల ముందే ఘోరం - ప్రియుడితో వెళ్లిన భార్య గొంతు కోసిన భర్త!
First Night Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Share Market: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Vaibhav Suryavanshi: డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
Embed widget