అన్వేషించండి

Crime News : వెజ్ బిర్యానీ ఆర్డరిస్తే చికెన్ బిర్యానీ తెచ్చాడట - రెస్టారెంట్ ఓనర్ని కాల్చి పడేశాడు ! ఇలా ఎలా?

Ranchi restaurant : రాంచీలో బిర్యానీ వివాదం హత్యకు దారి తీసింది. వెజ్ బిర్యానీకి బదులు నాన్-వెజ్ ఇచ్చారని రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపాడో కస్టమర్.

Served chicken biryani instead of veg customer murder restaurant owner: జార్ఖండ్ రాజధాని రాంచీలో బిర్యానీ ఆర్డర్ వివాదం హత్యగా మారిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాంకే-పిథోరియా రోడ్డుపైన ఉన్న చౌపట్టి రెస్టారెంట్ యజమాని విజయ్ కుమార్ నాగ్  ను ఓ కస్టమర్ కాల్చి చంపాడు. వెజిటేరియన్ బిర్యానీ ఆర్డర్ చేసిన తనకు నాన్-వెజ్ బిర్యానీ ఇచ్చారని ఆరోపిస్తూ ఈ  హత్య  చేశారు.  అక్టోబర్ 18  శనివారం  రాత్రి 11:30 గంటల సమయంలో ఈ  ఘటన జరిగింది. పోలీసులు నిందితుడ్ని అభిషేక్ కుమార్ నాగ్‌ను గుర్తించారు. 
  
కాంకే పోలీస్ స్టేషన్ పరిధిలోని భిత్తా గ్రామానికి చెందిన విజయ్ కుమార్ నాగ్, రాంచీలోని కాంకే-పిథోరియా రోడ్డుపై చౌపట్టి రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి అభిషేక్ కుమార్ నాగ్ అనే కస్టమర్ వెజిటేరియన్ బిర్యానీని పార్సెల్‌గా తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకుని ప్యాకెట్ తెరిచి చూస్తే అందులో చికెన్ ముక్కలు, ఎముకలు ఉన్నాయని గుర్తించాడు. దీంతో ఆగ్రహానికి గురైన అభిషేక్, రెస్టారెంట్ యజమాని విజయ్‌కు ఫోన్ చేసి వాదనకు దిగాడు.                             

ఆ తర్వాత అభిషేక్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కు తిరిగి వచ్చాడు. అప్పటికే విజయ్ రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నాడు. ఇరు వర్గాల మధ్య మాటలు కలిసి, దాడి, తోపులాటకు దారితీసింది. ఆవేశంతో అభిషేక్ తన వద్ద ఉన్న పిస్టల్ తీసి విజయ్ ఛాతీపై కాల్పులు జరిపాడు. విజయ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నిందితులు కారులో పారిపోయారు. గన్‌షాట్ సౌండ్ విని స్థానికులు రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు.                        

విజయ్‌ను తక్షణమే రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడిని చనిపోయినట్టు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపారు. కాంకే పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ప్రకాశ్ రాజక్ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని మూసివేశారు. రెస్టారెంట్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించారు.     

ఘటన విషయం తెలిసిన వెంటనే స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు రెస్టారెంట్ ముందు కాంకే-పిథోరియా రోడ్డును బ్లాక్ చేసి నిరసన తెలిపారు. నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు, స్థానిక నాయకులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. లేకుంటే నగరవ్యాప్త నిరసనలు చేస్తామని కుటుంబ సభ్యులు హెచ్చరించారు.
  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget