అన్వేషించండి

Retired Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని తన నివాసంలో ఆయన దారుణహత్యకు గురికావడం కలకలం రేపుతోంది. భార్య పాత్రపై అనుమానం వచ్చి, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్యకు గురయ్యారు. బెంగళూరులోని హైసోర్ లేఅవుట్‌లోని తన నివాసంలో ఓం ప్రకాష్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారని పోలీసు అధికారులు తెలిపారు. 1981 బ్యాచ్ అధికారి అయిన 68 ఏళ్ల ఈ రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి. ఆయన నివాసంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో రక్తపు మడుగులో మాజీ డీజీపీ ఓం ప్రకాష్ పడి ఉన్నట్లు గుర్తించి పోలీసుకు సమాచారం అందించారు. 

ఆయన శరీరంపై పదునైన ఆయుధంతో దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులు గుర్తించారు. మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో ఆయన భార్య పల్లవి పాత్ర ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పీటీఐ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. మాజీ డీజీపీ మృతిచెందారన్న సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శవపరీక్ష కోసం డెడ్ బాడీని  పంపారు. ఫోరెన్సిక్ బృందం దర్యాప్తులో కీలకంగా మారనుంది. 

మాజీ కర్ణాటక డీజీపీ ఓం ప్రకాశ్ హత్యలో భార్య హస్తం ఉందా..

మాజీ డీజీపీ ఓం ప్రకాష్ ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఆయన భార్య పల్లవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  పోలీసులు మాత్రం ఇది భార్య పని లేక సన్నిహిత కుటుంబసభ్యుల పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. కుటుంబ వివాదం హత్యకు దారి తీసిందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్ ప్రకారం.. మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ను మూడు సార్లు కత్తి లేక పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. హత్య చేయడానికి ఉపయోగించిన కత్తిని నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. భార్యనే ఓం ప్రకాష్ ను హత్య చేసిందని, లేక వేరొకరి సాయంతో హత్య చేయించిందా అని అనుమానిస్తున్నారు.

తన ప్రాణాలకు ముప్పు ఉందని కొందరు సన్నిహితులకు ఓం ప్రకాష్ ఇటీవల చెప్పారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు ఆయన భార్య, కుమార్తెలను విచారించారు. 

బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానాంద్ మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం 4 నుండి 4:30 గంటల మధ్య మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ మరణించారని సమాచారం అందింది. ఆయన కుమారుడిని సంప్రదించాం. ఆయన ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశారు. దాని వల్ల తీవ్ర రక్తస్రావం జరిగి ఆయన చనిపోయి ఉంటారని” అన్నారు.

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్.. 

ఓం ప్రకాశ్ 2015 మార్చి 1న కర్ణాటక 38వ డీజీపీగా నియమితులయ్యారు. ఆయన గతంలో హోం గార్డ్స్ కమాండెంట్ జనరల్, అగ్నిమాపక, అత్యవసర సేవలు, పౌర హక్కులు, కర్ణాటక లోకాయుక్త, సిఐడీ వంటి అనేక కీలక పదవులను నిర్వహించారు. రవాణా కమిషనర్‌గా కూడా సేవలు అందించారు. కార్వార్ జిల్లాలోని భట్కల్ ప్రాంతంలో కమ్యూనికేషన్ ఉద్రిక్తతలను సమర్థవంతంగా నిర్వహించారు. బెంగళూరులో జరిగిన రెండు ప్రధాన ఉగ్రవాద ఘటనల దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు. 2013 ఏప్రిల్ 17న బీజేపీ ఆఫీసు సమీపంలో జరిగిన బాంబు పేలుడు, 2014 డిసెంబర్ 28న చర్చ్ స్ట్రీట్ పేలుడు ఘటన కేసులు దర్యాప్తు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Embed widget