అన్వేషించండి

Retired Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని తన నివాసంలో ఆయన దారుణహత్యకు గురికావడం కలకలం రేపుతోంది. భార్య పాత్రపై అనుమానం వచ్చి, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్యకు గురయ్యారు. బెంగళూరులోని హైసోర్ లేఅవుట్‌లోని తన నివాసంలో ఓం ప్రకాష్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారని పోలీసు అధికారులు తెలిపారు. 1981 బ్యాచ్ అధికారి అయిన 68 ఏళ్ల ఈ రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి. ఆయన నివాసంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో రక్తపు మడుగులో మాజీ డీజీపీ ఓం ప్రకాష్ పడి ఉన్నట్లు గుర్తించి పోలీసుకు సమాచారం అందించారు. 

ఆయన శరీరంపై పదునైన ఆయుధంతో దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులు గుర్తించారు. మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో ఆయన భార్య పల్లవి పాత్ర ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పీటీఐ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. మాజీ డీజీపీ మృతిచెందారన్న సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శవపరీక్ష కోసం డెడ్ బాడీని  పంపారు. ఫోరెన్సిక్ బృందం దర్యాప్తులో కీలకంగా మారనుంది. 

మాజీ కర్ణాటక డీజీపీ ఓం ప్రకాశ్ హత్యలో భార్య హస్తం ఉందా..

మాజీ డీజీపీ ఓం ప్రకాష్ ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఆయన భార్య పల్లవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  పోలీసులు మాత్రం ఇది భార్య పని లేక సన్నిహిత కుటుంబసభ్యుల పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. కుటుంబ వివాదం హత్యకు దారి తీసిందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్ ప్రకారం.. మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ను మూడు సార్లు కత్తి లేక పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. హత్య చేయడానికి ఉపయోగించిన కత్తిని నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. భార్యనే ఓం ప్రకాష్ ను హత్య చేసిందని, లేక వేరొకరి సాయంతో హత్య చేయించిందా అని అనుమానిస్తున్నారు.

తన ప్రాణాలకు ముప్పు ఉందని కొందరు సన్నిహితులకు ఓం ప్రకాష్ ఇటీవల చెప్పారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు ఆయన భార్య, కుమార్తెలను విచారించారు. 

బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానాంద్ మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం 4 నుండి 4:30 గంటల మధ్య మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ మరణించారని సమాచారం అందింది. ఆయన కుమారుడిని సంప్రదించాం. ఆయన ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశారు. దాని వల్ల తీవ్ర రక్తస్రావం జరిగి ఆయన చనిపోయి ఉంటారని” అన్నారు.

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్.. 

ఓం ప్రకాశ్ 2015 మార్చి 1న కర్ణాటక 38వ డీజీపీగా నియమితులయ్యారు. ఆయన గతంలో హోం గార్డ్స్ కమాండెంట్ జనరల్, అగ్నిమాపక, అత్యవసర సేవలు, పౌర హక్కులు, కర్ణాటక లోకాయుక్త, సిఐడీ వంటి అనేక కీలక పదవులను నిర్వహించారు. రవాణా కమిషనర్‌గా కూడా సేవలు అందించారు. కార్వార్ జిల్లాలోని భట్కల్ ప్రాంతంలో కమ్యూనికేషన్ ఉద్రిక్తతలను సమర్థవంతంగా నిర్వహించారు. బెంగళూరులో జరిగిన రెండు ప్రధాన ఉగ్రవాద ఘటనల దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు. 2013 ఏప్రిల్ 17న బీజేపీ ఆఫీసు సమీపంలో జరిగిన బాంబు పేలుడు, 2014 డిసెంబర్ 28న చర్చ్ స్ట్రీట్ పేలుడు ఘటన కేసులు దర్యాప్తు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget