అన్వేషించండి

Work Stress: '45 రోజులు నిద్ర లేకుండా పని చేశా' - పని ఒత్తిడితో ఉద్యోగి ఆత్మహత్య, భార్యకు 5 పేజీల సూసైడ్ నోట్

UttarPradesh News: పని ఒత్తిడి కారణంగా ఓ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యూపీలో చోటు చేసుకుంది. 45 రోజులు నిద్ర లేకుండా పని చేసినట్లు సదరు ఉద్యోగి సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.

Finance Employee Forceful Death Due To Work Pressure In UP: పని ఒత్తిడితో కొందరు ప్రైవేట్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటోన్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోనూ (Uttarapradesh) అలాంటి ఘటనే జరిగింది. ఓ ఫైనాన్స్ సంస్థలో పని చేసే ఉద్యోగి పని ఒత్తిడి కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డారు. దాదాపు 45 రోజులుగా నిద్ర లేకుండా విధులు నిర్వహించానని.. పని ఒత్తిడితోనే చనిపోతున్నట్లు సూసైడ్ లేఖలో తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూపీ ఝాన్సీకి చెందిన తరుణ్ సక్సేనా (42) ఓ ఫైనాన్స్ కంపెనీలో ఏరియా మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అయితే, టార్గెట్లు పెడుతూ అతనిపై ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. సమయానికి పని పూర్తి చేయకుంటే జీతాన్ని కుదిస్తామని బెదిరించేవారు. ఈ క్రమంలోనే టార్గెట్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో తరుణ్ 45 రోజులు నిద్ర మానేసి మరీ పని చేశారు. సీనియర్లకు తన సమస్యను వివరించినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.

5 పేజీల సూసైడ్ నోట్

తరుణ్ సక్సేనా తన భార్యకు 5 పేజీల సూసైడ్ నోట్ రాస్తూ తన ఆత్మహత్యకు గల కారణాలను అందులో వివరించారు. తనను అధికారులు ఎంతో ఒత్తిడికి గురి చేశారని.. అవమానించడం సహా బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. భవిష్యత్తుపై భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసి విచారణ చేస్తామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

వరుస ఘటనలు

కాగా, పని ఒత్తిడితో ఇటీవల ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో పని చేస్తోన్న 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ ఇటీవలే బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే, లఖ్‌నవూలో ఓ బ్యాంకు ఉద్యోగిని విధుల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఈమె పని ఒత్తిడి కారణంగానే చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా, మరో ఉద్యోగి విధుల్లో ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: Tirumala laddu Surprme Court : లడ్డూ కల్తీ జరిగిందనడానికి ఆధారాలేవి ? శ్రీవారి ప్రసాద వివాదంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget