అన్వేషించండి

Tirumala laddu Surprme Court : లడ్డూ కల్తీ జరిగిందనడానికి ఆధారాలేవి ? శ్రీవారి ప్రసాద వివాదంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court : లడ్డూ కల్తీపై ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.కల్తీ జరిగిన నెయ్యిని వాడలేదని ..వాడిన ట్యాంకర్లలో కల్తీ జరిగిందో టెస్టులు చేయించలేదన్నారు. వ గురువారానికి విచారణ వాయిదాపడింది.

Supreme Court opined that there is no evidence of laddu adulteration : తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలైన నాలుగు పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా లడ్డూ కల్తీ అయిందని ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనకు ఆధారాలు ఏమిటని  .. ప్రభుత్వ తరపు లాయర్ సిద్ధార్థ లూధ్రాను ధర్మాసనం ప్రశ్నించింది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందన్నారు. ఈ సందర్భంగా సిద్దార్థ లూధ్రా నాలుగు ట్యాంకర్ల కల్తీని నెయ్యిని గుర్తించారని అంతకు ముందు అందే  కంపెనీ పంపించిన ట్యాంకర్లను ఉపయోగించారని గుర్తు చేశారు. అయితే ఆ ట్యాంకర్లలో కల్తీ జరిగిందా.. ఆ నెయ్యిని ఉపయోగించి సిద్ధం చేసిన లడ్డూలను టెస్టులకు పంపారా అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.

కేంద్ర ప్రభుత్వం విచారణ చేపడితే బాగుంటుంది  !

లడ్డూ కల్తీ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బాగుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థలూధ్రాను ధర్మాసనం ప్రశ్నించింది.   నెయ్యి కల్తీ జరిగిందన్న రిపోర్ట్‌పై సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకున్నారా లేదా అని ప్రశ్నించారు.  కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టాలన్నారు.  

పులివెందులో మంచం కింద పేలిన జిలెటిన్ స్టిక్‌- వీఆర్‌ఏ ప్రాణం తీసిన ప్రత్యర్థులు

సిట్‌ను నియమించిన తర్వాత మీడియాలో ప్రకటన చేయడం ఎందుకు ?

ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన తర్వాత  ప్రకటనలు చేశారని ఇక సిట్ సమర్థంగా ఎలా విచారణ జరపగలదని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ప్రపంచంలో ఉన్న భక్తులందరి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని..  ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఈ విచారణకు సరిపోతుందా  స్వతంత్ర దర్యాప్తు ఏదైనా అవసరమా అని కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను  సుప్రీంకోర్టు ప్రశ్నించింది.  తిరుమల లడ్డూ వివాదంపై ఇరువైపులా వాదనలు రికార్డు చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది. గురువారం రోజు సిట్ విచారణ కొనసాగించాలా లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలా అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?

గురువారం కీలక నిర్ణయం వెలువరించే అవకాశం

తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత తగ్గిపోవడంతో నెయ్యి ట్యాంకర్లను టీటీడీ అధికారులు టెస్టులు చేయించారు. అందులో జంతువుల కొవ్వు కలిపినట్లుగా తేలడంతో ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమి నేతల సమావేశంలో ప్రకటించారు.అయితే లడ్డూ కల్తీ జరగలేదని.. దానికి ఆధారాల్లేవని కల్తీ అయిన ట్యాంకర్లను వెనక్కి పంపించారని భక్తుల మనోభావాలు దెబ్బతీశారని.. వైవీ సుబ్బారెడ్డితో పాటు మరో ముగ్గురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే సిట్ ను నియమించింది. సిట్ ను కొనసాగించాలా వద్దా అన్నదానిపై గురువారం విచారణలో కీలక నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రకటించే అవకాశం ఉంది. 
 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget