అన్వేషించండి

Deadbody Parcel: 'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?

Crime News: ప.గో జిల్లా యండగండిలో ఇంటికి పార్శిల్‌లో మృతదేహం వచ్చిన ఘటనపై పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.

Police Investigation In Deadbody Parcel Case In Yendagandi: పశ్చిమగోదావరి జిల్లా (Westgodavari District) ఉండి మండలం యండగండి (Yendagandi) గ్రామంలో ఓ ఇంటికి పార్శిల్‌లో మృతదేహం వచ్చిన కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన అనుమానితుడు శ్రీధర్‌వర్మ తన వదిన సాగి తులసికి చెందాల్సిన ఆస్తిని కాజేయాలనే ఆలోచనతోనే ఈ పథకం రచించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీని కోసం జులై నుంచే ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. తొలుత ఓ సామాజిక సేవా సంస్థ ద్వారా తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అందిస్తున్నట్లు కథ నడిపించాడు. అదే క్రమంలో పార్శిల్‌లో శవాన్ని పంపి తులసిని భయపెట్టాలని భావించినట్లు తెలుస్తోంది. శవానికి బదులుగా కోడ్ భాషగా 'చేప దొరికిందా.?' అని మాట్లాడుకునే వారని సమాచారం. తులసికి శవాలంటే భయమని.. కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులకు తెలిసే ఛాన్స్ ఉండదని పోలీసులు భావిస్తున్నారు.

శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా.?

ముందుగా ఎక్కడి నుంచైనా శవాన్ని తేవాలని ప్రయత్నించారని.. అది కుదరకపోవడంతో అమాయకుడైన బర్రె పర్లయ్యను చంపేశారని తెలుస్తోంది. అతన్ని కారులో ఎక్కించుకుని ఉండి మండలం పెదపుల్లేరు దారిలో వెళ్లారని.. కారులోనే హతమార్చినట్లు సమాచారం. కాగా, మృతుడు బర్రె పర్లయ్య కూలి పనులు చేస్తూ జీవించేవాడని.. నా అనే వారు లేకపోవడంతో ఏ ఊరిలో పని చేస్తే అక్కడే ఆ ఇంటి అరుగు మీదే పడుకునేవాడని పోలీసులు తెలిపారు. 'అసలు ఎందుకు పర్లయను హత్య చేశారు.? అతన్ని హత్య చేస్తే శ్రీధర్ వర్మకు కలిగే లబ్ధి ఏంటి.?' అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు...

బర్రె పర్లయ్యను ఈ నెల 17న హత్య చేసి ఉంటే 19వ తేదీ వరకూ మృతదేహాన్ని ఎక్కడ దాచారు.?, శవాన్ని పార్శిల్ చేసి తులసిని బెదిరిస్తే వచ్చే ఆస్తిని ఎంతమంది కాజేయాలనుకున్నారు.? వంటి ఎన్నో చిక్కుముడులు వీడాల్సి ఉంది. శవాన్ని పంపిన అనంతరం ఈ నెల 20 నుంచి అదృశ్యమైన శ్రీధర్‌వర్మను మచిలీపట్నం సమీపంలో అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. తులసికి ఉన్న మూడెకరాల ఆస్తిపై కన్నేసింది అతనేనా..? లేక దీని వెనుక వేరే ఎవరైనా ఉన్నారా.? అనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. 2, 3 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ నయీంఅస్మీ తెలిపారు.

అసలేం జరిగిందంటే.?

ప.గో జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి అనే మహిళకు గ్రామంలో ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు కాగా ఇల్లు నిర్మిస్తోంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి ఆమె అప్లై చేసుకోగా.. తొలి విడతలో టైల్స్ అందజేసింది. మరోసారి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేయగా.. పార్శిల్‌ వచ్చింది. అందులో ఎలక్ట్రిక్ సామగ్రి ఉంటుందని భావించి ఓపెన్ చేయగా మృతదేహం కనిపించింది. దీంతో మహిళతో పాటు షాకైన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Nandyal News: కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Embed widget