అన్వేషించండి

Road Accident: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం - వేర్వేరు చోట్ల ఘోర ప్రమాదాల్లో 9 మంది మృతి

Andhrapradesh News: తెలుగు రాష్ట్రాల్లోని ఘోర రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి చెందారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు, తెలంగాణలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Road Accidents In AP And Telangana: తెలుగు రాష్ట్రాల్లో శనివారం తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా (Annamayya District) రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురు స్నేహితులు కడప నుంచి కారులో రాయచోటికి వస్తుండగా.. కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ షేక్ ఖాదర్ భాషా (20) అనే వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో

అటు, చిత్తూరు (Chittor) జిల్లా పెద్దపంజాణి మండలం బసవరాజు కండ్రిగ వద్ద ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి రామేశ్వరం తీర్థయాత్రలకు 52 మందితో వెళ్తున్న పర్యాటకుల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా.. 21 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు అనంత జిల్లా రొద్దం మండలం చింగులపల్లికి చెందిన రామాంజనమ్మ, కర్ణాటక రాష్ట్రం తుంకుర్ జిల్లా మురారిహల్లికి చెందిన నరసింహారెడ్డిగా గుర్తించారు. అనంతపురం జిల్లా తమిళనాడుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి.

తెలంగాణలో..

అటు, మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జిల్లాలోని దంతాలపల్లి మండల కేంద్రం శివారులోని వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. తొర్రూరు నుంచి బీర్ శెట్టిగూడెం వెళ్తున్న ఆటోను మరిపెడ నుంచి దంతాలపల్లికి వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో రెండు ముక్కలవగా.. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ బంధు మల్లేశ్, పగిండ్ల కుమార్, భూక్య నరేశ్ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Also Read: Annamayya District: వంట చేయడానికి వచ్చి దుప్పటి సాయంతో ఖైదీ జంప్- రాజంపేట సబ్ జైలులో ఘటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Family Digital Card : తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
YS Jagan : లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
Actor Rajendra Prasad Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Haryana Elections 2024: హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP DesamIsrael attack in Beirut | హిజ్బుల్లా కీలకనేత సైఫుద్దీన్ చంపేసింది ఇక్కడే | ABP DesamIsrael attack in Beirut | లెబనాన్‌ యుద్ధ క్షేత్రంలో ABP News గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Family Digital Card : తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
YS Jagan : లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
Actor Rajendra Prasad Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Haryana Elections 2024: హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
Revanth Reddy : రేవంత్ రెడ్డిపై సూపర్ సీనియర్స్ అసంతృప్తి - కాంగ్రెస్ కల్చర్‌ను రేవంత్ ఇంకా వంటబట్టించుకోలేదా?
రేవంత్ రెడ్డిపై సూపర్ సీనియర్స్ అసంతృప్తి - కాంగ్రెస్ కల్చర్‌ను రేవంత్ ఇంకా వంటబట్టించుకోలేదా?
Women's World Cup 2024: ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
Navratri 2024: వ్యభిచార గృహాల ప్రాంగణంలో మట్టితో దుర్గామాత విగ్రహం తయారీ!
వ్యభిచార గృహాల ప్రాంగణంలో మట్టితో దుర్గామాత విగ్రహం తయారీ!
Weather Today: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Embed widget