అన్వేషించండి

Nizamabad: నిజామాబాద్ లో విషాదం.. బదిలీ చేశారన్న మనస్తాపంతో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య...

బదిలీ చేశారన్న మనస్తాపంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు. 317 జీవో ప్రకారం ఆమెకు ఇటీవల కామారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యింది.

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి (35) ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు గత కొద్ది రోజులుగా మానసికంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మండలంలోని రహత్ నగర్ లో టీచర్ గా పనిచేస్తున్న సరస్వతికి ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో ప్రకారం కామారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యింది. బదిలీ కావడంతో జాయినింగ్ రిపోర్ట్ కూడా అందించారు. బదిలీపై వేరే జిల్లాకు వెళ్లాలని మానసిక క్షోభతో ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో సరస్వతి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమెను కుటుంబ సభ్యులు ఆర్మూర్ లోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త బేతల భూమేష్ ఉపాధి నిమిత్తం ఖతర్ లో ఉంటున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. టీచర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి స్వామి ఆర్మూర్ దావఖానాకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయురాలు మృతికి మానసిక బాధ కారణమా, బదిలీ అంశమా విచారణలో తెలియాల్సి ఉంది. 

Also Read: 'ఇక ధర్మ యుద్ధం స్టార్ట్ అయింది'.. కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదల

గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి..
 
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడిజర్ల  శివారు పుసాలి తండాలో  గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పి.శ్రీమతి (42) మృతి చెందారు. మహబూబాబాద్ లో  విధులు నిర్వహిస్తున్న   శ్రీమతికి ప్రభుత్వం ఏటూరునాగారం మండలానికి పోస్టింగ్ ఇచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం మనస్తాపానికి గురై  గుండె నొప్పితో మృతి చెందారు. ఈ ఘటనపై ఉపాధ్యాయ, ఉద్యోగులు మండిపడుతున్నారు. 317 జీవో వలన ఉద్యోగుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటికే ఒక ఉపాధ్యాయుడు మృతి చెందగా తాజాగా మరో ఉపాధ్యాయురాలు చనిపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 

Nizamabad: నిజామాబాద్ లో విషాదం.. బదిలీ చేశారన్న మనస్తాపంతో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య...

Also Read: హైకోర్టులో బండి సంజయ్ కి ఊరట.. వెంటనే విడుదల చేయాలని ఆదేశం

అసలేంటీ జీవో 317..?

2021 డిసెంబర్ 6న ప్రభుత్వం 317 జీవోను జారీ చేసింది. పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలోని ఉద్యోగులు, ఆ పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల పరిధిలోని కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీ జోన్లలో కోరుకున్న చోటుకు వెళ్లటానికి ఆప్షన్ ఎంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఆప్షన్లకు సీనియారిటీని ప్రాతిపదికగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వికలాంగులు, వితంతువులు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాలు ఉన్న వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఆప్షన్లు ఇచ్చింది. ఉద్యోగులు సీనియారిటీ ప్రకారం తాము కోరుకున్న జిల్లాను ఆప్షన్‌గా ఎంచుకోవాలి. ఉద్యోగులు ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారం ఆయా జిల్లాల్లో ఉన్న ఖాళీల మేరకు బదిలీ ఉత్తర్వులు ఇస్తారు. డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఖాళీలు పూర్తైతే సీనియారిటీ తక్కువగా ఉన్న వారికి ఆప్షన్ ఉండదు. దీంతో వారు కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ లభించదు. తమ స్థానిక జిల్లా కాకపోయినా వేరే జిల్లాకు శాశ్వతంగా వెళ్లాల్సిఉంటుంది.

Also Read: టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గోరి కడతారు... ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారు... హన్మకొండ సభలో బీజేపీ నేతలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News: భర్త అప్పు చెల్లించలేదని వృద్ధురాలైన భార్యను చెట్టుకు కట్టేశారు! సంగారెడ్డి జిల్లాలో దారుణం!
భర్త అప్పు చెల్లించలేదని వృద్ధురాలైన భార్యను చెట్టుకు కట్టేశారు! సంగారెడ్డి జిల్లాలో దారుణం!
Telangana News : జనగామ ఎమ్మెల్యేలకు సైబర్ నేరగాళ్ల టోకరా! వికసిత్ భారత్ పథకం పేరుతో లక్షలు స్వాహా!
జనగామ ఎమ్మెల్యేలకు సైబర్ నేరగాళ్ల టోకరా! వికసిత్ భారత్ పథకం పేరుతో లక్షలు స్వాహా!
Vanasthalipuram accident: తాగి రోడ్డెక్కిన వాళ్ల తప్పు - రెండు నిండు జీవితాలు బలి - హస్తీనాపురం ప్రమాదంలో చీకటి కోణాలు
తాగి రోడ్డెక్కిన వాళ్ల తప్పు - రెండు నిండు జీవితాలు బలి - హస్తీనాపురం ప్రమాదంలో చీకటి కోణాలు
Ganja Seized: బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
3 States Polling: అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
Jagityala KTR: జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
Gold Price: మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
KKR vs LSG Match Update: కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
Atchannaidu: వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
Jagan Vs Sharmila: జగన్, షర్మిల మధ్య పాదయాత్ర వారసత్వ వార్ - సోషల్ మీడియా వాగ్వాదం వైరల్
జగన్, షర్మిల మధ్య పాదయాత్ర వారసత్వ వార్ - సోషల్ మీడియా వాగ్వాదం వైరల్
Nobel Peace: నోబెల్ అంటే అంత కామెడీ అయిపోయిందా? పాకిస్తాన్ ప్రధానికీ కావాలట.. ట్రంప్‌కు తెలిస్తే!?
నోబెల్ అంటే అంత కామెడీ అయిపోయిందా? పాకిస్తాన్ ప్రధానికీ కావాలట.. ట్రంప్‌కు తెలిస్తే!?
Sharmila: 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
Embed widget